ఒక సినిమాకు ఆర్థికంగా ఇబ్బంది కలిగించడం కోసం ప్రభుత్వం యత్నించడం ఇదే తొలిసారి అని, తానూ ఇప్పుడే చూస్తున్నానని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తీవ్రంగా మండిపడ్డారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ అహంకారంతో సినిమా థియేటర్ల వద్ద కర్ఫ్యూ వాతావరణాన్ని సృష్టించారని మండిపడ్డారు. భీమ్లా నాయక్ సినిమాకు ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. ఫ్యాన్స్ విజయవంతం చేస్తారని గుర్తు చేశారు. స్వయంగా ప్రభుత్వమే ఒక సినిమాపై కక్షగట్టి వ్యవహరించడం రాష్ట్ర చరిత్రలోనే ఇది ప్రప్రథమం అని ధ్వజమెత్తారు. భీమ్లా నాయక్ సినిమా విషయంలో ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందన్నారు.
ప్రభుత్వం చేస్తున్న దిగజారుడు వ్యవహారాలతో మనజాలలేక ఆత్మగౌరవం ఉన్న నేతలు.. వైసీపీ ప్రభుత్వం నుంచి.. ఆ పార్టీ నుంచి బయటకు రావాలని మనోహర్ పిలుపు నిచ్చారు. ప్రజా సమస్యలను పరిష్కరిస్తారని ప్రజలు నమ్మి అధికారాన్ని ఇస్తే.. జగన్ ఇలాంటి ప్రజావ్యతిరేక పాలనను అందిస్తున్నారని నాదెండ్ల మనోహర్ ఫైర్ అయ్యారు. భీమ్లా నాయక్ సినిమా విడుదల సందర్భంగా క్షేత్రస్థాయిలో జరిగిన అధికార దుర్వినియోగాన్ని చూసి యావత్ ప్రపంచం ఆశ్చర్యపోతున్నదని చెప్పారు. సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తామని చెప్పిన జగన్.. పవన్ కల్యాణ్ నటించిన సినిమా విషయంలో మాత్రం అభిమానులను నిరుత్సాహపర్చేలా వ్యవహరించారన్నారు.
అధికారులను అడ్డం పెట్టుకుని థియేటర్ల వద్ద భయభ్రాంతులు సృష్టించారని చెప్పారు. కక్షపూరితంగా, నియంతలా వ్యవహరిస్తూ.. ప్రభుత్వప్రతిష్టను దిగజార్చే చర్యలను చేపట్టారని దుయ్యబట్టారు. తన ఆలోచన మేరకు అధికారులు పనిచేయాలనడం జగన్ కు తగదని నాదెండ్ల మనోహార్ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని నమ్మే వైసీపీ నాయకులు ఇప్పటికైనా ఆత్మగౌరవంతో బతికేందుకు వెంటనే ఆ పార్టీ నుంచి బయటకు రావాలని నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. ప్రభుత్వం నుంచి ఎన్ని ఒత్తిళ్లు, అవమానాలు ఎదురైనా హుందాగా వ్యవహరించడం పట్ల పవన్ కల్యాణ్ అభిమానులకు అభినందనలు తెలుపుతున్నానన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more