సముద్రంలో చేపలవేటకు వెళ్లిన ఓ మత్స్యకారులకు భయానక అనుభవం ఎదురైంది. ఐదుగురు సభ్యులతో చేపటవేటకు వెళ్లిన మత్సకారులు విశాఖతీరంలో ఇలాంటి అనుభవం ఎదురుకావడం ఇదే తొలిసారి. చేపటలను వేటాడుతున్న ఓ మత్సకారుడిపై ఓ చేప దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయాడు. విశాఖపట్టణం జిల్లా పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం తీరానికి 90 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. చాపదాడిలో గాయపడిన మత్య్సకారుడిని ఒడ్డుకు తీసుకువచ్చేందుకు ఏకంగా ఏడు గంటల పాటు ప్రయాణించాల్సి వచ్చింది. అయితే అప్పటికీ తీవ్ర రక్తస్రావం కావడంతో మత్య్సకారుడు మృత్యువు ఒడిలోకి జారిపోయాడు.
పోలీసుల కథనం ప్రకారం.. ముత్యాలమ్మపాలెం పంచాయతీ శివారులోని జాలరిపేటకు చెందిన నొల్లి జోగన్న (45), ఒలిశెట్టి అప్పలరాజు, ఒలిశెట్టి కొర్లయ్య, ఒలిశెట్టి ముత్తురాజు, కాంబాల చినదేముడు, కంబాల మహేశ్ కలిసి ఆదివారం సాయంత్రం ఇంజిన్ బోటుపై సముద్రంలో వేటకు వెళ్లారు. రాత్రంతా వేట కొనసాగించగా, సోమవారం ఉదయం ఆరు గంటల సమయంలో భారీ కొమ్ము కోనం చేప (మార్లిన్ ఫిష్) వారికి కనిపించింది. దీంతో దానికి గేలం వేసేందుకు జోగన్న సముద్రంలోకి దూకాడు. అయితే తనకు ప్రమాదం పోంచివుందని భావించిన కొమ్ముకోనం చేప.. కొంత దూరం వెనక్కి వెళ్లింది. అకస్మాత్తుగా వెనుదిరిగి వేగంగా దూసుకొచ్చి జోగన్నపై దాడికి పాల్పడింది.
దాడి సమయంలో చేప ముందర, ముక్కు భాగంలో ఉండే భారీ కొమ్ము జోగన్న కడుపులో దిగబడింది. తీవ్రంగా గాయపడిన జోగన్నను వెంటనే బోటులోకి చేర్చి తీరానికి బయలుదేరారు. అయితే 90 కిలోమీటర్ల దూరంలో వున్న పడవ ఒడ్డకు చేర్చేందుకు ఎంత వేగంగా నడిపినా దాదాపుగా ఏడు గంటల సమయం పట్టింది. దీంతో తోటి మత్స్యకారులు జోగన్నను ఒడ్డుకు చేర్చారు. కానీ.. అప్పటికీ తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న జోగన్న పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. కాగా, చేపదాడిలో మత్స్యకారుడు మృతి చెందడం ఇదే తొలిసారని జాలర్లు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more