మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ పలు ఆసక్తికర విషయాలపై స్పందిస్తూ వాటిని నెటిజన్లతో పంచుకుంటారు. అయితే, తాజాగా మరో అంశంపై స్పందించారు. ముంబైకి చెందిన బిజినెస్ మొగల్ ఐఐటీ మద్రాస్ మద్దతుగల స్టార్ట్అప్ త్వాస్తా 21 రోజుల్లో నిర్మించిన భారతదేశపు మొదటి 3డి ప్రింటెడ్ ఇంటికి సంబంధించిన ఒక 104 సెకన్ల నిడివి గల వీడియోను ట్విటర్ వేదికగా పంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 3డి ప్రింటెడ్ గృహా రంగంలో జరుగుతున్న పరిణామాలను తాను అనుసరిస్తున్నానని, ఈ రంగంలో స్వదేశంలో అభివృద్ది చేసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉండటం భారతదేశానికి కీలకమని మహీంద్రా అన్నారు.
ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేస్తూ.. "విదేశాల్లో 3డి ప్రింటెడ్ గృహా రంగంలో జరుగుతున్న పరిణామాలను అనుసరిస్తున్నాను. ఈ రంగంలో ఐఐటి మద్రాస్(ఇప్పుడు ప్రపంచంలోని ప్రముఖ టెక్-ఇంక్యుబేటర్లలో ఒకటి) మద్దతుతో వచ్చిన టెక్ కంపెనీ ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ది చేయడం భారతదేశానికి చాలా అవసరం. మీరు కొత్తగా నిధుల సమీకరణ జరిపారని నాకు తెలుసు. కానీ నేను చేరడానికి ఏదైనా గది?" అని వీడియో జతచేస్తూ పోస్టు చేశారు. 3డి ప్రింటింగ్ కేటగిరీ కింద ఇండస్ట్రీ 4.0 రంగంలో నేషనల్ స్టార్టప్ అవార్డ్స్ 2021 విజేతగా త్వాస్తాను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. దీనికి ముందు, ప్రధాని నరేంద్ర మోడీ జూలై 2021లో తన మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈ స్టార్ట్-అప్ గురించి కూడా మాట్లాడారు.
Been following developments in 3D printed homes overseas. Critical for India so delighted to see home-grown tech from IIT Madras (now one of the world’s leading Tech-Incubators) I know you guys raised some seed funding, but any room for me to join in? pic.twitter.com/LXoZCMAwM8
— anand mahindra (@anandmahindra) January 31, 2022
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more