అటోడ్రైవర్లు అంటే అందరికీ చులకనే. వీళ్లు ఊరు తెలియని వారిని బురడీ కొట్టించి ఊరంతా తిప్పి.. చివరకు ఇరవై రూపాయల దూరానికి వంద రూపాయల మేర లాగేస్తారని భావనతోనే వారిని చులకనగా చూస్తారు. ఇక వారికి మాట్లాడటం కూడా తెలియదని.. భావిస్తారు. అయితే అటోడ్రైవర్ల నిజాయితీకి కొలమానమని పలు ఘటనలు ఇప్పటికే నిరూపించాయి, ఒంటరి బాలిక... ఊరుకాని ఊరుకు వచ్చి.. ఓ ఆటోడ్రైవర్ ను ఆద్దె గదికోసం అరాతీస్తే.. అమ్మో ఇంకేమైనా వుందా.? అంటూ అందోళన వ్యక్తం చేస్తాం. ఇక తాజాగా ఆటో డ్రైవర్లు అంటే ఇంత మంచివారా అనేలాంటి ఘటన ముంబైలోనూ చోటుచేసుకుంది. కానీ ఆటోడ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పారిపోయిన ఓ బాలిక తిరిగి తన తల్లిదండ్రుల వద్దకు క్షేమంగా చేరుకుంది.
ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. మహారాష్ట్ర రాష్ట్రంలోని పాలఘర్లోని వసాయి రైల్వే స్టేషన్ వద్ద రాజు కర్వాడే (35) అనే ఆటోడ్రైవర్ ప్రయాణికుల కోసం ఎదురుచూస్తుండగా.. క్రితం రోజున ఓ బాలిక (14) ఒంటరిగా ఆ రైల్వేస్టేషన్ నుంచి బయటకు వచ్చింది. రాజు అటోవద్దకు చేరుకోగానే ఎక్కడికైనా వేళ్లేందుకు ఆటో కోసం అడుగుతుందేమోనని అనుకున్నాడు. కానీ బాలిక వచ్చి రాగానే అనుమానం వచ్చే ప్రశ్నను సంధించింది. మంచి గది తక్కువ అద్దెకు దొరుకుతుందేమోనని అడిగింది. దీంతో అనుమానం వచ్చిన రాజు.. బాలికకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నాడు. చాలా గదులు ఉన్నాయని, అయితే ఎంతమంది ఉంటారు.? అద్దె ఎలా కడతారు.? అంటూ బాలిక మాటల్లో పెట్టి అనుమానం రాకుండా వివరాలు రాబట్టాడు,
ఆ బాలికది ఢిల్లీ అని, తల్లిదండ్రులతో గొడవపడి ఇంటినుంచి పారిపోయివచ్చినట్లు తెలుసుకున్న ఆటోడ్రైవర్ రాజు.. బాలికను నేరుగా స్థానిక మానిక్ పూర్ పోలీసుస్టేషన్ కు తీసుకెళ్లి అప్పగించాడు. పోలీసులు ఆ బాలిక చెప్పిన వివరాలను బట్టి ఢిల్లీలోని సాకేత్ పోలీసుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాలిక తప్పిపోయిన ఫిర్యాదును అందుకున్నట్లు తెలుసుకున్న మానిక్పూర్ పోలీసులు ఆ కేసుకు సంబంధించి వివరాలు అడిగితెలుసుకుని ఈ బాలిక గురించి సమాచారం అందించారు. సాకేత్ పోలీసుల నుంచి అందిన వివరాల ద్వారా బాలిక తల్లిదండ్రులకు మానిక్పూర్ పోలీసులు సమాచారం ఇవ్వగా వారు వచ్చి బాలికను తీసుకెళ్లారు. బాలికను క్షేమంగా తల్లిదండ్రులకు చేరవేయటంలో కీలకపాత్ర పోషించిన ఆటోడ్రైవర్ రాజు కర్వాడేను పోలీసులు అభినందించారు.
(And get your daily news straight to your inbox)
Aug 13 | తన బిడ్డ అపదలో ఉన్నాడంటే ప్రతీ తల్లి గజేంద్రమోక్ష ఘట్టంలోని శ్రీమహావిష్ణువు రూపం దాల్చి అత్యంత వేగంగా ప్రతిస్పందించి రక్షిస్తుందని అంటారు. తన బిడ్డకు ఆపద వస్తుందంటే అవసరమైతే పులితో కూడా పోట్లాడి.. తన... Read more
Aug 13 | బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రియాంక ఖర్గే చేసిన తీవ్రవ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు పోందాలంటే యువకులు లంచం ఇవ్వాలి.. యువతులైతే మరో రకంగా సహకరించాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రియాంఖ ఖార్గే... Read more
Aug 13 | దేశ స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు గడుస్తున్న సందర్భంగా.. దేశప్రజలందరూ తమ ఇళ్లపై జెండాలను అవిష్కరించాలని ఇప్పటికే జెండాలను కూడా పంచిన క్రమంలో.. వాటితో తమ తమ... Read more
Aug 13 | కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజినీర్ (JE) పోస్టుల నియాక ప్రక్రియను స్టాఫ్ సెలెక్షన్ కమిటీ (SSC) చేపట్టింది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయింది. అర్హులైనవారు వచ్చే నెల 2... Read more
Aug 13 | మరో రెండేళ్లలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. ఇప్పటి నుంచే రాజకీయ సమీకరణాలపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే, సీ ఓటర్ సంస్థతో కలిసి చేపట్టిన జాతీయస్థాయి... Read more