కరోనా మహమ్మారి ప్రజలను అనేక రకాలుగా బలి తీసుకుంటోంది. కరోనా పాజిటివ్ వచ్చిందన్న అందోళనతోనే కొందరు రోగులు మరణించగా, చికిత్స పోందుతూ బ్లక్ ఆక్సిజన్ లెవల్స్ తగ్గి పరిస్థితి విషమించడంతో మరికోందరు మరణించారు. ఇక అప్పటికీ దీర్ఘకాలిక రోగాలబారిన పడిన వారు కూడా కోవిడ్ చికిత్స పోందుతూ మరణించారు. ఇక తాజాగా వైద్యులు తెలుపుతున్న తాజా విషయాల ప్రకారం మరికోందరు కొవిడ్ బారిన పడి కోలుకున్న తరువాత కూడా హృద్రోగ సమస్యలతో మృతిచెందారు. ఇలాంటి అనేక ఘటనలు మనం తొలి, రెండవ దశలో చూశాం. తాజాగా ఒమిక్రాన్ వేరియంట్ తో దేశవ్యాప్తంగా మూడవ దశ ప్రభావం కొనసాగుతోంది. ఈ దశలోనూ కోవిడ్ బారిన పడిన బాధితులు తమ అరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
కోవిడ్ బాధితులందరూ తమ గుండె ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా వుండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. కరోనా గత రెండు వేరియంట్లతో ప్రత్యక్షంగా ప్రభావిత కేసులు నమోదు కాగా, తాజాగా తన ఉద్దృతిని కోనసాగిస్తు్న ఒమిక్రాన్ వేరియంట్ పెద్దగా లక్షణాలు కనిపించడం లేదని తేలిగ్గా తీసుకుంటున్న ప్రజలకు.. అప్రమత్తత అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. ఒమిక్రాన్ కారణంగా గుండె పనితీరు ప్రభావితం అవుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. గుండెదడ, హృదయ స్పందనల్లో వ్యత్యాసాల సమస్యతో ఎక్కువ మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్న తరువాత తమను ఆశ్రయిస్తున్నారని వైద్యులు తెలిపారు. గుండె కణజాలం బలహీనపడడంతో పాటు, ఇతర సమస్యలను గుర్తిస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు.
కోవిడ్ మొదటి (ఆల్ఫా), రెండో (డెల్టా) విడతలో గుండె దెబ్బతినడం, గుండె విఫలమై మరణించిన కేసులను కూడా ప్రస్తావిస్తున్నారు. ఒమిక్రాన్ లో లక్షణాలు స్వల్పంగానే కనిపిస్తున్నా.. కోలుకున్న వారిలో కార్డియోమయోపతి, రక్తం గడ్డకట్టడం, దడ, శ్వాస తీసుకోవడం కష్టంగా అనిపించే రిస్క్ ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ‘‘మా దగ్గరకు వచ్చే బాధితుల్లో చాలా మంది శ్వాస తీసుకోవడం భారంగా అనిపిస్తోందని, గుండె దడ అని చెబుతున్నారు. కరోనా వైరస్ రక్త నాళాల్లో వాపునకు కారణమవుతోంది. దీనివల్ల బ్లడ్ క్లాట్ ఏర్పడడం జరుగుతుంది. దీంతో హార్ట్ ఎటాక్ రావచ్చు. కనుక వారు జాగ్రత్తగా ఉండాలి’’ అని హైదరాబాద్ కు చెందిన కార్డియాలజిస్ట్ గణేష్ మంథన్ పేర్కొన్నారు.
‘‘ఇప్పటికే గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రోగులకు కోవిడ్ ప్రాణాంతకం అని నిరూపించవచ్చు. కోలుకున్న రోగులలో, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ నొప్పి, మూర్ఛ, బలహీనమైన గుండె, గుండె దెబ్బతినడం వంటి నాలుగు ప్రముఖ సమస్యలు గమనించబడ్డాయి, ”అని ఢిల్లీకి చెందిన జిబి పంత్ అసుపత్రిలోని ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్డర్ మోహిత్ గుప్తా చెప్పారు. కొన్ని సందర్భాల్లో, అంతర్లీన గుండె జబ్బులు ఉన్నవారు తీవ్రమైన లక్షణాలను కూడా ఎదుర్కోంటారని వైద్యులు తెలిపారు. అక్యూట్ మయోకార్డియల్ ఇంజ్యూరీకి వైరస్ కారణమవుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. గుండె జబ్బులతో బాధపడుతున్న వారికి వైరస్ ప్రాణాంతకంగా మారుతోందని అంటున్నారు.
"ప్రజలు గ్యాస్ట్రిక్ సమస్యలను కూడా కోవిడ్ అనంతరం ఎదుర్కొన్నారు, దీని కారణంగా వారు కోలుకున్న తర్వాత గుండె మంటను తరచుగా అనుభవిస్తూ తమను ఆశ్రయించారని.. దీనికి తోడు రక్తపోటు స్థాయిలు తగ్గడం, అధిక మధుమేహ స్థాయిలు కూడా నమోదయ్యాయి”అని ఎల్బి నగర్లోని కామినేని హాస్పిటల్స్ సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సాగర్ భుయార్ అన్నారు. కోలుకున్న వారిలో గుండె సమస్యలతో పాటు ఛాతీలో నొప్పి, తల తిరగడం, బలహీనత సమస్యలను ఎదుర్కొంటున్నట్టు వారు గుర్తించామన్నారు. కరోనా నుంచి బయటపడిన తర్వాత మూడు నెలల వరకు ఎటువంటి కఠోర వ్యాయామాలు, కష్టమైన పనుల జోలికి వెళ్లకుండా ఉండాలన్నది వైద్యుల సూచన. నిదానంగా ప్రారంభించి, క్రమంగా పెంచుకుంటూ వెళ్లాలని పేర్కొంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jun 25 | ‘పుష్ప’ సినిమాతో పాటు ఇప్పటికే పలు సినిమాల్లోనూ పోలీసుల కళ్లు గప్పి అక్రమార్గాలల్లో ఎలా సరుకు రవాణా చేయాలో అన్నది ఒక్కో దర్శకుడు ఒక్కో వినూత్న మార్గాన్ని చూపించారు. అయితే ఆ మార్గాలను అన్వయించుకుని,... Read more
Jun 25 | పామును తేలిగ్గా పట్టుకోవచ్చునని అనుకుంటారు కొందరు. స్నేక్ ఫ్ఱెండ్స్ లేదా స్నేక్ క్యాచర్స్ పాములను పట్టుకోవడం చూసి ఓస్ ఇంతేనా.. అని అనుకునేవారు.. తామేం తక్కువ అని ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ వాటిని పట్టుకోవడం... Read more
Jun 25 | తెలంగాణలోని ప్రభుత్వ ఉపాధ్యాయుల ఆస్తులపై రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని కొందరు ఉద్యోగులు తమ విధులకుహాజరుకాకుండా.. ఆయా స్థానాల్లో ఎవరో ఒకర్ని తమలా నటింపజేస్తూ.. వారు మాత్రం తమ... Read more
Jun 25 | విధి అడే వింత నాటకంలో అందరం పావులమే. అయితే.. ఎవరి ఆట ఎప్పుడు ఆరంభమవుతుందో ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. కానీ ఇది ముమ్మాటికీ నిజమని ఎవరైనా చెబితే ‘వేదాంతం’ మాట్లాడుతున్నారని కొట్టిపారేస్తాం. అయితే నిజమని... Read more
Jun 25 | మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న వేళ అటు శివసేన పార్టీ అనుకూల, ప్రతికూల వర్గాలతో పార్టీ నిట్టనీలువునా రెండుగా చీలిపోతోంది. ఇంతకాలం శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే అంటే మహారాష్ట్రవాసుల్లో ఉన్న భక్తి, అయన... Read more