ఐదు రాష్ట్రాల ఎన్నికలలో భాగంగా తమ పార్టీ విస్తృతం ప్రచారంతో పాటు పార్టీ అగ్రనాయకత్వం అంతా కష్టపడి పనిచేస్తున్న పనిచేస్తూ పంజాబ్ అసెంబ్లీపై దృష్టిసారించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పంజాబ్ అప్ పార్టీ హస్తగతం కాబోతున్నట్లు ఇప్పటికే పలు సర్వేలు కూడా వెల్లడించిన విషయం కూడా తెలిసిందే. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు రమారమి నెల రోజుల ముందు ఢిల్లీ ముఖ్యమంత్రి, అప్ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కేంద్రంలోని బీజేపి ప్రభుత్వంతో పాటు కేంద్ర స్వయం ప్రతిపత్తి సంస్థ ఈడీపై కూడా సంచలన అరోపణలు చేశారు. తమకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు తమ ప్రభుత్వంలోని ఒక మంత్రిని అరెస్ట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.
కేంద్రం బురదజల్లే ప్రయత్నాలు ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఎన్నికల ముందు జరిగాయని, వాటిని ఎన్నికల ప్రచారంగా కూడా కేంద్రంలోని అధికార పార్టీ లేదా దాని మిత్రపక్షాలు మార్చుకున్న ఉదంతాలను కూడా దేశప్రజలు గమనిస్తున్నారని ఆయన విమర్శించారు. అయినా తాము ఎలాంటి దాడులకు భయపడబోమని అన్నారు. ఎన్నికల వేళ కేంద్ర ఏజెన్సీలు యాక్టివ్గా మారుతున్నాయని తెలిపారు. ఎవరినైనా ఏజెన్సీలతో దాడులు చేయించగలరని, కానీ తాము ఎవ్వరికీ భయపడమని అన్నారు. కేంద్ర సంస్థ ఈడీ తమ ప్రభుత్వంలోని ఆరోగ్యశాఖమంత్రి సత్యేందర్ జైన్ను ఆర్థిక నేరాల పేరుతో అరెస్ట్ చేయాలని యోచిస్తునట్లు సమాచారం అందినట్లు పేర్కొన్నారు. జైన్ ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పంజాబ్లో ఉన్నారని తెలిపారు. దాడులకు భయపడి తాము వెనకడుగు వెయ్యమని అన్నారు.
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ‘పంజాబ్ ఎన్నికలకంటే ముందే రాష్ట్ర మంత్రి సత్యేందర్ జైన్ను ఈడీ అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తోందని సమాచారం ఉంది. వారికి స్వాగతం పలుకుతాం. గతంలో కూడా ఆయనపై కేంద్ర ప్రభుత్వం దాడులు జరిపించింది. కానీ, ఆయన వద్ద ఏం లభించలేదు’ అని సీఎం కేజ్రీవాల్ అన్నారు. ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయే పరిస్థితులు కనిపిస్తే కేంద్ర సంస్థల ద్వారా ప్రతిపక్షాలపై దాడి చేయిస్తుందని మండిపడ్డారు. ఎన్నికలు వస్తే బీజేపీ.. దాడులు, అరెస్ట్లు చేయిస్తుందని, వాటికి తాము భయపడమని తెలిపారు. పంజాబ్ సీఎం చరణ్జిత్ చన్నీలా తాము గందరగోళానికి గురికామని చెప్పారు. తాము ఏ తప్పు చేయలేదని స్పష్టం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more