యూరోప్లో కోవిడ్ మహమ్మారి తుది దశకు చేరుకున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయపడింది. ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్ వల్ల యూరోప్ దేశాల్లో కోవిడ్19 ఓ కొత్త దశకు చేరుకున్నదని, తర్వలో ఆ దశ ముగిసే అవకాశాలు ఉన్నట్లు డబ్ల్యూహెచ్వో యూరోప్ డైరక్టర్ హాన్స్ క్లూజ్ తెలిపారు. ఈ ప్రాంతంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టే దశలో ఉందన్నారు. అయితే మార్చి నాటికి సుమారు 60 శాతం మంది యురోపియన్లకు ఒమిక్రాన్ సోకుతుందని, ఆ తర్వాత కరోనా స్తబ్దుగా మారుతుందని ఆయన అన్నారు. కొన్ని నెలల పాటు మామూలు స్థాయిలో ఉండి, ఆ తర్వాత ఏడాది చివరి నాటికి కనిష్ట స్థాయికి చేరుకుంటుందని, ఆ తర్వాత మళ్లీ కరోనా ఆనవాళ్లు కనబడే ఛాన్సు లేదని క్లూజ్ తెలిపారు.
అమెరికా టాప్ సైంటిస్టు ఆంథోనీ ఫౌసీ కూడా ఇదే విషయాన్ని తెలిపారు. అమెరికాలోని అనేక ప్రాంతాల్లో కోవిడ్ కేసులు గణనీయంగా తగ్గుతున్నట్లు ఆయన ఓ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆఫ్రికాలో కూడా కేసుల సంఖ్య తగ్గుతున్నట్లు డబ్ల్యూహెచ్వో శాస్త్రవేత్త తెలిపారు. అయితే ఎండమిక్ దశకు చేరుకున్నట్లు ఇప్పుడే నిర్ధారించలేమని క్లూజ్ చెప్పారు. ఎండమిక్ దశకు చేరుకుంటే వైరస్ను అంచనా వేయవచ్చు అని, కానీ ప్రస్తుతం కరోనా వైరస్ ప్రబలుతున్న తీరు పట్ల జాగ్రత్తగానే ఉండాలని క్లూజ్ అన్నారు. ఒమిక్రాన్ మరీ ఎక్కువగా వ్యాపిస్తే, కొత్త వేరియంట్లు పుట్టుకువచ్చే ప్రమాదం ఉందన్నారు.
(And get your daily news straight to your inbox)
May 25 | జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో కశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్కు ఢిల్లీ పటియాలా హౌజ్ ఎన్ఐఏ కోర్టు జీవిత ఖైదు శిక్ష ఖరారు చేసింది. జీవిత ఖైదుతోపాటు రూ.10లక్షల జరిమానా... Read more
May 25 | తన కుటుంబం ఒక చిన్న ఇళ్లు కొనుక్కోవాలని అనుకుంది. అయితే తాముండే గ్రామంలో కాకుండా జిల్లా కేంద్రంలో అంటే లక్షల రూపాయల వ్యవహారం. ఐతే లక్షలు కావాలంటే ఎవరు మాత్రం ఇస్తారు. వ్యాపారం చేస్తామంటే... Read more
May 25 | టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై న్యాయస్థానం అదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. తెలుగు చిత్రసీమ ఖ్యాతిని బాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లి అక్కడ చిత్రాలను రూపోందించిన దర్శకుడిగా పాపులారిటీని సంపాదించిన ఆయన..... Read more
May 25 | ఆవేశం, కంగారు, తొందరపాటు మనల్ని ఊబిలోకి నెట్టివేస్తాయి. వీటి ప్రభావంతో ఒక్కోసారి మనం చేసే చిన్న చిన్న పనులు.. చాలా పెద్ద నష్టాలు జరుగుతుంటాయి. అందుకనే పెద్దలు అంటారుగా తన కోపమే తన శత్రువు,... Read more
May 25 | ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ పలుదేశాలలో ప్రభావం చూపుతున్న కరోన మహమ్మారి.. భారతదేశంలోనూ అధికారికంగా ఐదు లక్షలమందికిపైగా పోట్టనపెట్టుకుంది. అయితే అల్పా, డెల్టా వేరియంట్లు నేరుగా పేషంట్ల శ్వాసకోశలపై ప్రభావాన్ని చూపగా, ఆతరువాత తీవ్ర లక్షణాలు లేనిది... Read more