తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ భూములు, ప్లాట్లు, ఫ్లాట్లు, ఇళ్ల కొనుగోళ్లు భారంగా మారనున్నాయి. ఎనిమిది నెలల వ్యవధిలోనే తిరిగి మార్కెట్ విలువలు పెంచేందుకు సర్కారు సిద్ధమైంది. రియల్ ఎస్టేట్ బూమ్ తో గడిచిన నాలుగు నెలల్లో హైదరాబాద్, పరిసర ప్రాంతాలతో పాటు, ద్వితీయ శ్రేణి పట్టణాల్లోనూ రిజిస్ట్రేషన్లు గణనీయంగా పెరిగాయి. దీంతో మార్కెట్ విలువలను పెంచాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖను ఆదేశించినట్టు తెలుస్తోంది. ‘‘పట్టణ ప్రాంతాల్లో వ్యవసాయేతర ప్రాపర్టీల ధరలను ప్రభుత్వం ఆరు నెలలకు ఒకసారి, వ్యవసాయ ప్రాపర్టీల ధరలను రెండేళ్లకోసారి పెంచొచ్చు. కానీ, ప్రస్తుతం అన్నింటి ధరలను పెంచనుంది’’ అని అధికార వర్గాల కథనం.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భూముల ధరలు పెద్ద ఎత్తున పెరిగినట్టు సర్కారు గుర్తించింది. దీంతో మార్కెట్ ధరలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ల ధరలు కూడా ఉండాలని భావిస్తోంది. తద్వారా మరింత ఆదాయం సమకూరుతుందన్న ఆలోచనతో ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో 2013లో మార్కెట్ విలువలను పెంచారు. ఆ తర్వాత 2021 జూలైలో తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా ధరలను సవరించారు. దీంతో రిజిస్ట్రేషన్ల రూపంలో 2021-22లో రూ.10,000 కోట్ల ఆదాయం సమకూరుతుందని సర్కారు అంచనా వేసుకుంది.
ఇప్పుడు మరో విడత పెంపుతో అదనంగా రూ.3,000-4,000 కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా. వ్యవసాయ, వ్యవసాయేతర భూముల మార్కెట్ విలువలను సవరించేందుకు అనుమతిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. అధికారులు రెండు రోజుల్లో ప్రతిపాదనలను సిద్ధం చేసి కేబినెట్ ముందుంచనున్నారు. 20-50 శాతం మధ్య ఈ పెంపు ఉంటుందని తెలుస్తోంది. కేబినెట్ ఆమోదం అనంతరం ఫిబ్రవరి 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చే అవకాశం వుంది. ఇకపై ప్రతి రెండేళ్లకోసారి ధరలను సవరించాలన్న ప్రతిపాదన కూడా ఉంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more