మనస్సుంటే మార్గం ఉంటుందని పెద్దలు చెప్పిన సామెతను తప్పుగా అర్థం చేసుకున్నారు ఈ ముగ్గురు యువకుల ముఠా. ఏదైనా సాధించాలంటే అందుకు మార్గాలు కూడా ఉంటాయన్న పెద్దల మాటను వీరు రాత్రికి రాత్రే అక్రమమార్గంలో లక్షాధికారులు కావడానికి వినియోగించారు. ఏటీయం కేంద్రాల్లో డబ్బులు ఉంటాయని వీరికి తెలుసు. అయితే వాటిని ఎలా తెరవాలన్న విషయం మాత్రం వీరికి తెలియదు. దీంతో వాటిని రాత్రికి రాత్రే ఎలా తెరవాలో.. ఎలా దొంగలించాలో వీడియోలు చూశారు. అదేంటి ఇలాంటి వీడియోలు కూడా ఎక్కడ ఉంటాయని అంటారా.? అదేనండీ సోషల్ మీడియా దిగ్గజం యూట్యూబ్ లో ఇలాంటి వీడియోలు అనేకం.
అందులోనూ వీరు ఏటీయం తెరవడం ఎలా అన్న వీడియోలు చూసి.. అలానే ఏటీఎంను బద్దలుకొట్టిన ఈ ముఠా.. రూ 23 లక్షలతో ఉడాయించిన ఘటన మహారాష్ట్రలోని పుణే జిల్లాలో గ్రామీణ ప్రాంతంలో చోటుచేసుకుంది. జిల్లాలోని యవత్ పట్టణంలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. ఏటీఎం దోపిడీకి సంబంధించి పక్కా సమాచారం అందడంలో ప్రధాన సూత్రధారి అజయ్ షెండె (32)ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడికి దొపిడిలో సహకరించిన మరో ఇద్దరు నిందితులను శివాజీ గరద్, రుషికేష్ కిర్తికెలను కూడా అదుపులోకి తీసుకున్నారు. కాగా ఏటీయం యంత్రాన్ని ఎలా తెరవాలన్ని విషయాన్ని ఎలా తెలుసునన్న పోలీసుల ప్రశ్నలకు వారు యూట్యూబ్ అని సమాధానం చెప్పడంలో పోలీసులు విస్మయానికి గురయ్యారు.
అజయ్ షెండె తన ఇద్దరు అనుచరులు రుషీకేష్ కిర్తికె (22), శివాజీ గరద్ (25)తో కలిసి దోపిడీకి ప్లాన్ చేశారు. అయితే ఏటీయంను ఎలా తెరవాలో తెలుసుకునేందుకు వారు యూట్యూబ్ వీడియోలను చూశారు. ఇక ఏటీయం కొల్లగోట్టడానికి కావాల్సిన పరికరాలతో పాటు స్ర్పెలను కూడా అన్ లైన్ ఈ కామర్స్ సైట్ల నుంచి తెప్పించుకున్నారు. పోలీసులు తమను గుర్తించకుండా వుండేందుకు ఏటీయం కేంద్రంలోని ప్రవేశించగానే సిసిటీవీ కెమెరాలు తమను బంధించకుండా వాటిపై స్ర్పే చేశారు. ఇక తాము వచ్చిన పని కానిచ్చేశారు. యూట్యూబ్ లో చూసిన వీడియోల ద్వారా ఏటీయం యంత్రాలను తెరచి వాటిలోంచి ఏకంగా 23 కోట్ల రూపాయలతో ఉడాయించినట్లు ప్రాధమిక దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు తెలిపారు.
అప్పటికే పలు ఇళ్లు, ఇతర దోంగతనాలకు పాల్పడిన అజయ్ షిండే ఈ ఏటియం కేంద్రం దొపిడికి పాల్పడ్డారని పక్క సమాచారం అందుకున్న పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకుని విచారిండంతో విషయం బయటపడింది. యవత్ పట్టణంలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఏటీఎంలోకి వెళ్లిన ఈ ముఠా సెక్యూరిటీ కెమెరాలను బ్లాక్ చేసి.. గ్యాస్ కట్టర్తో ఏటీఎం మిషన్ను తెరిచి డబ్బుతో పరారైంది. నిందితుడి నుంచి ఓ బైక్, రూ పది లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. కాగా కుర్కుంభ్లో ఏటీఎం పగలకొట్టడానికి ప్రయత్నించడం, వాషిమ్లో తాళం వేసిన ఇంటిలోకి చోరబడటం, గేట్గావ్ వద్ద ఏటీఎంను తెరిచి రూ. 7.67 లక్షల చోరీ, లోనికల్భోర్ ప్రాంతంలో వాహనాల చోరీలు సహా మరో నాలుగు నేరాల్లో ఈ ముఠా ప్రమేయాన్ని పోలీసులు నిర్ధారించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more