సాంకేతిక రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులతో ఎంతో వేగంగా పనులు చక్కబెట్టుకుంటున్నామని సంబరపడిపోతున్నాం. అయితే అదే వేగంతో అవతలివారి మాయలో పడతే మాత్రం నిట్టనిలువునా మునిగిపోతాం. ఎదుటివారిని బుట్టలో దింపి వారిని మోసం చేయడమే పరమావధిగా పెట్టుకున్న సైబర్ నేరగాళ్ల వెయి కళ్లతో నిత్యం నిఘా పెడుతూనే వుంటాయి. ఇలాంటి వారి నుంచి అప్రమత్తంగా లేకపోతే ఎంతో కష్టించి సంపాదించిన డబ్బంతా క్షణపాటులో కోల్పోయినవారు అవుతారు. ఇలాంటి ఘటనే ఒకటి హైదరాబాద్ నగరంలోని హిమాయత్ నగర్లో జరిగింది. బ్రిటెన్ లో ఉద్యోగం కల్పిస్తామంటూ నమ్మించి.. శఠగోపం పెట్టిన సైబర్ నేరగాడి వలలో చిక్కిన నగరవాసి ఏకంగా పదకొండు లక్షల 14 వేల రూపాయలను కోల్పోయాడు.
అన్ లైన్ లో రెజ్యూమ్ అప్ లోడ్ చేయగానే ఇక్కడ జాబులేంటి.. మీ రెజ్యూమ్ చూశాను.. మీ చదవుకు తగ్గ ఉద్యోగం మంచి వేతనం కావాలంటే లండన్ బెటర్. ఇక్కడ వేలలో సంపాదించే కంటే అక్కడ లక్షల్లో సంపాదన అంటూ ఆశపెట్టి మరీ బుట్టలోకి దింపాడు. ఫార్మాలిటీస్ ఏమైనా ఉంటే అవి తాను చూసుకుంటానన్నాడు. ఒప్పుకునే వరకు ఒప్పించేలా చాలా కష్టపడతారు. సర్లే ఊ అన్నావా.. వారి ఉచ్చులో పడ్డటే. ఉన్నవన్నీ ఊడ్చేశారు సైబర్ నేరగాళ్లు. నగర వాసి ఉద్యోగం కోసం తన రెజ్యూమ్ని ఆన్లైన్ పెట్టాడు. రెజ్యూమ్ చూసిన సైబర్ నేరగాడు నగర వాసితో మాటలు కలిపాడు. యూకేలో అయితే మంచి హోదా, ప్యాకేజీతో మీ చదువుకు తగిన ఉద్యోగం వస్తుందన్నాడు.
అతను చెప్పిన మాయ మాటలకు బుట్టలో పడ్డాడు. డాక్యుమెంట్స్ కోసమని, వీసా కోసమని డబ్బులు కావాలన్నాడు. ఆ తర్వాత తాము చెన్నై ఆర్బీఐ నుంచి మాట్లాడుతున్నామని మరికొన్ని డాక్యుమెంట్స్ అవసమరమన్నారు. ఇలా డాక్యుమెంట్స్ పేరు చెప్పి నగర వాసికి ఆశ చూపి పలు దఫాలుగా రూ.11లక్షల 14వేలు కాజేశారు. మరో వ్యక్తి ఆర్బీఎల్ బ్యాంక్ కస్టమర్ కేర్ కోసం ప్రయత్నించగా..తాము సాయ పడతామని చెప్పారు. మొబైల్లో ఎనీడెస్క్ యాప్ ఇన్స్టాల్ చేయించి నగర వాసి అకౌంట్లో నుంచి రూ.2లక్షల 56వేలు స్వాహా చేశారు. వీరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వినయ్ తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more