ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఉన్న అమర్ జవాన్ జ్యోతిని.. జాతీయ యుద్ధ స్మారకం వద్ద కలపడాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. ప్రభుత్వం జాతి ద్రోహానికి పాల్పడుతోందని కాంగ్రెస్ పార్టీ నేత మనీష్ తివారీ తెలిపారు. చరిత్రను తిరగరాసే ప్రయత్నం జరుగుతోందన్నారు. అమర్ జవాన్ జ్యోతిని, జాతీయ యుద్ధ స్మారకంతో కలపడం అంటే.. చరిత్రను తుడిచిపెట్టడమే అని ఆయన ఆరోపించారు. అమరవీరుల ఆత్మలు ఘోషించే చర్యలకు కేంద్రం పాల్పడటం సరికాదని అన్నారు. జాతీయ యుద్ధ స్మారకాన్ని బీజేపీ నిర్మించిందని, అంత మాత్రాన అమర్ జవాన్ జ్యోతిని ఆర్పడం సరికాదు అని తివారీ పేర్కొన్నారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన ట్విట్టర్లో స్పందించారు. కొందరికి దేశభక్తి, త్యాగాలు అర్థంకావని విమర్శించారు. ఇది చాలా బాధాకరమైన విషయమని, అమర జవాన్ల త్యాగాలను నిత్యం స్మరించుకునేలా అహర్నిషలు వెలుగుతున్న జ్యోతిపై కూడా కేంద్రం కన్నుపడిందని.. అందుకని దానిని ఆర్పేస్తున్నట్లు ఆయన ట్వీట్లో తెలిపారు. కొందరికి దేశభక్తి, బలిదానం అర్థం కాదు అని, అయినా పర్వాలేదు అని, మరోసారి మన అమర సైనికుల కోసం జ్యోతిని వెలిగిద్దామని ఆయన అన్నారు. కాంగ్రెస్ నేత ప్రియాంకా చతుర్వేది తన ట్విట్టర్లో స్పందిస్తూ.. రెండు జ్యోతులను ఎందుకు వెలిగించలేమన్నారు. అమర జ్యోతిని ఆర్పడం ఇది మంచి రాజకీయాలకు సూచకం కాదు అని ఆర్జేడీ నేత మనోజ్ కుమార్ జా ఆరోపించారు.
అయితే అమరవీరులకు నివాళిగా నిలుస్తున్న అమర్ జవాన్ జ్యోతిని ఆర్పేస్తున్నట్లు వస్తున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఇండియా గేట్ వద్ద ఉన్న అమర్ జవాన్ జ్యోతిని.. జాతీయ యుద్ధ స్మారకం వద్ద జ్యోతితో ఇవాళ కలపనున్నట్లు చెప్పింది. అమర్ జవాన్ జ్యోతిని ఆర్పడం లేదని, దాన్ని జాతీయ యుద్ధ స్మారకంతో కలుపుతున్నామని, అమర్ జవాన్ జ్యోతి వద్ద కేవలం 1971 యుద్ధంలో మరణించిన సైనికుల పేర్లు మాత్రమే ఉన్నాయని, ఇతర యుద్ధాల్లో మరణించిన అమరుల పేర్లు లేవని కేంద్రం చెప్పింది. మొదటి ప్రపంచ యుద్ధంలో మరణించిన బ్రిటీష్ ఇండియన్ ఆర్మీ అమర సైనికులకు నివాళిగా బ్రిటీషర్లు ఇండియా గేట్ను నిర్మించారని, అది కేవలం బ్రిటీష్ పాలనకు చిహ్నంగా ఉన్నట్లు కేంద్ర వర్గాలు వెల్లడించాయి.
అన్ని యుద్ధాల్లో ప్రాణాలు కోల్పోయిన అమర సైనికుల పేర్లతో పాటు 1971 యుద్ధంలో అమరులైన వారి పేర్లను జాతీయ యుద్ధ స్మారకం వద్ద చేర్చినట్లు కేంద్రం తెలిపింది. అందుకే జాతీయ యుద్ధ స్మారకమే అరుమరులకు అర్పించే నిజమైన శ్రద్ధాంజలి అని కేంద్ర వర్గాలు వెల్లడించాయి. ఏడు దశాబ్ధాల నుంచి జాతీయ యుద్ధ స్మారకాన్ని నిర్మించలేకపోయిన పార్టీలు ఇప్పుడు నిజమైన నివాళి అర్పిస్తుంటే మొసలి కన్నీరు కారుస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా, ప్రభుత్వ నిర్ణయాన్ని ఇండియన్ ఆర్మీ మాజీ డీజీఎంవో జనరల్ వినోద్ భాటియా స్వాగతించారు. అమర్ జవాన్ జ్యోతిని.. జాతీయ యుద్ధ స్మారకంతో కలపడం గొప్ప నిర్ణయమన్నారు. అమర్ జవాన్ జ్యోతిని జాతీయ యుద్ధ స్మారకంతో కలపాల్సిన సమయం ఆసన్నమైందని జనరల్ వినోద్ తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more