ఉత్తరాఖండ్ ప్రభుత్వం నుంచి బర్తరఫ్ అయిన మంత్రి హరక్ సింగ్ రావత్ ఇవాళ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారన్న వార్తలు వినబడుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ పెద్దలతో మంతనాలు జరిపిన ఆయన.. ఇవాళ లాంఛనంగా పార్టీలో చేరి కండువాను కప్పుకోనున్నారు. బీజేపి ప్రభుత్వం తన అసెంబ్లీ నియోజకవర్గమైన కోట్ద్వార్ లో మెడికల్ కాలేజీని స్థాపిస్తామని హామి ఇచ్చి.. ఎన్నికలు సమీపిస్తున్నా ఆ హామీని నెరవేర్చలేదని ఆయన అరోపించారు. దేవభూమిగా వర్ధిల్లుతున్న ఉత్తరాఖండ్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయాలు సమీకరణలతో వేడెక్కుతున్నాయి. ఇప్పటికే నువా-నేనా అన్నట్లు ఇక్కడి ఎన్నికల సంగ్రామం నెలకొందని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.
కాంగ్రెస్ గూటికి చెందిన హరక్ సింగ్ రావత్ బిజెపి అధిష్టాన నిర్ణయాలను ఫాలో కావడం లేదని.. ఇక గత ఐదేళ్లలో పదేపదే సమస్యలను సృష్టించారని బీజేపి నేతలు అరోపిస్తున్నారు. క్షేత్రస్థాయిలో బీజేపి కార్యకర్తలలో కూడా ఆయనపై అసంతృప్తి ఉందని.. రావత్ తో పాటు 2016లో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన నేతలు, కార్యకర్తలకే అదిక ప్రాధాన్యత ఇచ్చారని.. పార్టీ అధిష్టాననికి బీజేపి కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేశారని కూడా బీజేపీ అరోపించింది. బీజేపిలో ముఠా నాయకత్వాలకు అస్కారం లేదని అక్షేపించింది. నియోజకవర్గ స్థాయిలో బీజేపి కార్యకర్తలతోనూ ఆయన సమన్వయం చేసుకోవాలని బీజేపి నాయకత్వం తెలిపింది.
దీంతో పాటు ఆయన ఏకంగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి నేతృత్వంలో ఏర్పాటైన కేబినెట్ సమావేశంలోనూ ఆయన దురుసుగా వ్యవహరించి.. తన డిమాండ్లు పరిష్కరించకపోతే పార్టీ నుంచి వైదోలగిపోతానని తీవ్రస్వరంతో ఆగ్రహం వ్యక్తి చసిన ఆయన మంత్రివర్గ సమావేశం నుంచి వెళ్లిపోయారని బీజేపి వర్గాలు తెలిపాయి. అయితే ఆయన తన అసెంబ్లీ నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు విషయంలో ఆగ్రహంతో వెళ్లిపోయారన్న వార్తల్లో వాస్తవం లేదని.. కేవలం తన కుటుంబసభ్యులకు పార్టీ టికెట్ల కోసం డిమాండ్ చేస్తూ పార్టీ అధిష్టానంపై ఒత్తడి తీసుకువచ్చారని అందుచేత పార్టీ ఆయనను బర్తరఫ్ చేసిందని బీజేపి వర్గాలు తెలిపారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తనకు, తన కోడలు అనుకృతి గోసైన్తో పాటు అతని మద్దతుదారుల్లో ఒకరికి టిక్కెట్లు ఇవ్వాలని రావత్ బిజెపి అగ్రనాయకులపై ఒత్తిడి తెచ్చారని వార్తలు బయటకోచ్చాయి. ఈ క్రమంలో ఆయనపై బీజేపి అధిష్టానం చర్యలు తీసుకుంది. దీంతో ఆయన ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పెద్దలతో చర్చలు జరిపారని, త్వరలోనే ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారని వార్తలు వచ్చాయి. అందుకు ఇవాళ ముహుర్తాన్ని ఖరారు చేసుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి కూడా ఆయనకు తన కొడలికి టికెట్ హామీ లభిస్తేనే పార్టీలో చేరుతారని ఆయన సన్నిహిత వర్గాల సమాచారం.
(And get your daily news straight to your inbox)
May 25 | జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో కశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్కు ఢిల్లీ పటియాలా హౌజ్ ఎన్ఐఏ కోర్టు జీవిత ఖైదు శిక్ష ఖరారు చేసింది. జీవిత ఖైదుతోపాటు రూ.10లక్షల జరిమానా... Read more
May 25 | తన కుటుంబం ఒక చిన్న ఇళ్లు కొనుక్కోవాలని అనుకుంది. అయితే తాముండే గ్రామంలో కాకుండా జిల్లా కేంద్రంలో అంటే లక్షల రూపాయల వ్యవహారం. ఐతే లక్షలు కావాలంటే ఎవరు మాత్రం ఇస్తారు. వ్యాపారం చేస్తామంటే... Read more
May 25 | టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై న్యాయస్థానం అదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. తెలుగు చిత్రసీమ ఖ్యాతిని బాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లి అక్కడ చిత్రాలను రూపోందించిన దర్శకుడిగా పాపులారిటీని సంపాదించిన ఆయన..... Read more
May 25 | ఆవేశం, కంగారు, తొందరపాటు మనల్ని ఊబిలోకి నెట్టివేస్తాయి. వీటి ప్రభావంతో ఒక్కోసారి మనం చేసే చిన్న చిన్న పనులు.. చాలా పెద్ద నష్టాలు జరుగుతుంటాయి. అందుకనే పెద్దలు అంటారుగా తన కోపమే తన శత్రువు,... Read more
May 25 | ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ పలుదేశాలలో ప్రభావం చూపుతున్న కరోన మహమ్మారి.. భారతదేశంలోనూ అధికారికంగా ఐదు లక్షలమందికిపైగా పోట్టనపెట్టుకుంది. అయితే అల్పా, డెల్టా వేరియంట్లు నేరుగా పేషంట్ల శ్వాసకోశలపై ప్రభావాన్ని చూపగా, ఆతరువాత తీవ్ర లక్షణాలు లేనిది... Read more