పంజాబ్ ఆమ్ఆద్మీ పార్టీలో ఒక్కసారిగా విభేదాలు పొడసూపాయి. ఎన్నికల రణక్షేత్రం అసన్నమైన తరుణంలో తమకు టికెట్లు కేటాయించకపోవడంతో విభేదాలు తలెత్తాయి. పార్టీ కోసం అహర్నిషలు కష్టపడుతున్న తమను పక్కనబెట్టడంపై అశావహులతో పాటు వారి అనుచరుణులు పార్టీ అధిష్టానంపై తిరగబడ్డారు. పార్టీ వ్యవస్థాపన నాటి నుంచి ఇంత కాలం పనిచేసిన తమకు కాకుండా ఇటీవల పార్టీలో చేరిన వారికి టికెట్లు కేటాయించడంపై అసంతృప్తితో రగలిపోయిన అశవహులు పంజాబ్ అప్ కన్వీనర్ రాఘవ్ చద్దాపై తిరుగుబాటు ఎగురవేశారు.
అంతా సవ్యంగానే నడుస్తుందనుకుంటున్న సమయంలో టిక్కెట్ల విషయంలో విభేదాలు భగ్గుమన్నాయి. శుక్రవారం ఆప్ సీనియర్ నేత, పంజాబ్ ఎన్నికల కో ఇన్ఛార్జీ రాఘవ్ చద్దా మీడియా సమావేశం నిర్వహిస్తుండగా ఆగ్రహించిన అసంతృప్తి నేతలు కార్యాలయం బయటే ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతటితో ఆగకుండా ఒకానోక దశలో సమావేశ మధ్యలోనే మీడియా ప్రతినిధుల సమక్షంలోనే టిక్కెట్ల విషయంలో తీవ్ర అసంతృప్తికి లోనైన నేతలు ఒక్కసారిగా రెచ్చిపోయారు. రాఘవ్ చద్దాను ఘెరావ్ చేసి తమ వ్యతిరేకతను చాటుకున్నారు.
దీంతో ఆయనతో పాటుగా వచ్చిన అప్ నేతలకు.. అసంతృప్తి నేతలకు మధ్య ఘర్షణకు ప్రెస్ క్లబ్ వేదికగా మారింది. ఆమ్ఆద్మీ నేతలు ఒకరిపై ఒకరు ముష్ఠి ఘాతాలకు దిగారు. దీంతో అక్కడ రణరంగంగా మారిపోయింది. ఆప్ సీనియర్ నేతలైన శివదయాల్ మాలీ, సంజీవ్ శర్మ, జోగిందర్ పాల్ శర్మ మద్దతు దారులు ఒకరిపై ఒకరు సంచలన ఆరోపణలు చేసుకున్నారు. సరిగ్గా ఎన్నికల సమయంలో ఇతర పార్టీల నుంచి ఆప్లో చేరిన వారికే ఎక్కువ ప్రాధాన్యం లభిస్తోందని, వారినే అక్కున చేర్చుకుంటున్నారని ఈ వర్గీయులు రాఘవ్ చద్దాపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more