భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచలో ఓ కుటుంబం సామూహిక ఆత్యహత్యకు సంబంధించిన ఘటనతో మాజీ ఎమ్మెల్యే తనయుడు వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవేందర్ పేరు కూడా ఉన్నట్లు వార్తలు వెలువడటంతో ఆయన పేరును కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ లో నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విషాద ఘటనకు తనకు ఎలాంటి ప్రమేయం లేదని ఆయన ఓ వీడియో సందేశం ద్వారా తెలిపారు. తన పేరున కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పరారీలో వున్న ఆయన ఈ ఘటనతో తనకు సంబంధం లేదని చెప్పుకోచ్చారు.
రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యతో తనకు సంబంధం లేదని రాఘవేందర్ స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో తన జోక్యం లేకపోయినా తన పేరు ఎందుకు రాశారో అర్థంకావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమది రాజకీయ కుటుంబం అని, పనుల కోసం వందలమంది వస్తారని వివరించారు. ఆర్థిక పరిస్థితి బాగాలేక చనిపోతే నాకేంటి సంబంధం? అని రాఘవేందర్ ప్రశ్నించారు. ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని కోరుకుంటున్నానని ఆయన తెలిపారు. ఈ వ్యవహారంలో తన ప్రమేయం ఉందని నిరూపితమైతే ఎంతటి శిక్షకైనా సిద్ధమేనని ప్రకటించారు.
అయితే ఇక్కడి వరకు బాగానే వున్నా.. రాఘవేందర్ తాను రామకృష్ణతో ఆయన తల్లిని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పడం నేరమా? అని ప్రశ్నించడంతో తనకు రామకృష్ణకు మధ్య ఏదో వివాదం నెలకొందన్న విషయమై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతటితో అగని అనుమానాలు.. రామకృష్ణ అర్థిక పరిస్థితులు బాగోలేవని రాఘవేందర్ కు ఎలా తెలుసునన్న అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. కాగా ఈ కేసులో తనను ఇరికించేందుకు కొందరు కుట్ర చేశారని రాఘవేందర్ ఆరోపించారు. తన రాజకీయ ఎదుగుదలను అడ్డుకునేందుకు పథకం ప్రకారం చేశారని అన్నారు. తనను అభాసుపాలు చేసేందుకు రామకృష్ణను ప్రలోభపెట్టారని, ఎలాంటి విచారణకైనా సిద్ధమేనని స్పష్టం చేశారు.
పాత పాల్వంచకు చెందిన రామకృష్ణ, శ్రీలక్ష్మి, వారి కుమార్తె సాహిత్య తమ ఇంట్లోనే అగ్నికి ఆహుతయ్యారు. మరో కుమార్తె సాహితి కాలిన గాయాలతో చికిత్స పొందుతోంది. కాగా, రామకృష్ణ కారు నుంచి క్లూస్ టీమ్ కొన్ని కీలక కాగితాలు, బిల్లులను స్వాధీనం చేసుకుంది. తొలుత ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందని భావించిన పోలీసులు, ఆపై ఇది ఆత్మహత్యేనని ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ క్రమంలో రామకృష్ణ రాసిన ఆత్మహత్య లేఖ అధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా తొలుత ఈ ఘటన గ్యాస్ లీకేజి ప్రమాదం సంభవించి చోటుచేసుకుందని అనుమానించిన పోలీసులు.. తరువాత ఆత్మహత్యకు పాల్పడినట్టు భావిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
May 28 | పెంపుడు కుక్కతో పాటు వాకింగ్ చేసేందుకు స్టేడియం ఖాళీచేయించిన ఐఏఎస్ అధికారుల జంట నిర్వాకంపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య వారధీగా ఉండాల్సిన ఐఏెఎస్ అధికారులు కూడా నాయకులను మించిపోతున్నారని... Read more
May 28 | కన్న కొడుకు సక్రమమైన మార్గంలో నడవాలని ఏ తల్తైనా కోరుకుంటోంది. అదే కొడుకు తెలిసి.. చేసినా తెలియక చేసినా కొడుకును ఓ వైపు మందలిస్తూనే.. మరోవైపు తన కోడుకును వెనుకేసుకొస్తోంది. అమెది మాతృ హృదయం.... Read more
May 28 | కాలం మారింది.. కాలంతోపాటు మనుషులు కూడా మారుతున్నారు. సంప్రదాయాలను పాతచింతకాయ పచ్చడిలా భావిస్తున్న యువతరం నిత్యం ట్రెండీ ఆలోచనలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. పదిమందిలో కొత్తగా కనిపించాలని అనుకోవడమే కాదు.. విభిన్నంగా అలోచించి జీవితంలో... Read more
May 28 | తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత నందమూరి తారకరామారావు శత జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్లోని ఆయన ఘాట్ వద్ద వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ తెల్లవారుజామున ఎన్టీఆర్ ఘాట్కు చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్రామ్ పుష్పగుచ్ఛాలు ఉంచి... Read more
May 27 | హర్యానా మాజీ ముఖ్యమంత్రి, ఇండియన్ లోక్ దళ్ మాజీ అధ్యక్షుడు వృద్దనేత ఓం ప్రకాశ్ చౌతాలా మరోమారు కారాగారవాసానికి వెళ్లనున్నారు. ఇటీవలే ఆయన ఉపాధ్యయుల అక్రమ నియామకాల కేసులో జైలు శిక్షను అనుభవించి.. విడుదలయ్యారు.... Read more