TRS MLA’s son booked as 3 of family die by suicide ఆ కుటుంబం ఆత్మహత్యతో సంబంధం లేదు: వనమా

Telangana family dies by suicide trs mla s son named in fir

vanama raghavender, Family suicide, Telangana police, Abetment of suicide, Vanama Venkateswara Rao, Ramakrishna, Family Suicide, Palwancha suicide case, Raghavender video, family suicide case, Palwancha, Khammam, Telangana, crime

Hours after Mandiga Naga Ramakrishna, his wife and daughter died in a suicide pact in Palvoncha on Monday morning, police listed Kothagudem TRS MLA Vanama Venkateswara Rao’s son Raghavendra Rao, who is also a local pink party leader, as one of the accused for abetting the incident.

ఆ కుటుంబం ఆత్మహత్యతో సంబంధం లేదు: వనమా రాఘవేందర్

Posted: 01/04/2022 12:51 PM IST
Telangana family dies by suicide trs mla s son named in fir

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచలో ఓ కుటుంబం సామూహిక ఆత్యహత్యకు సంబంధించిన ఘటనతో మాజీ ఎమ్మెల్యే తనయుడు వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవేందర్ పేరు కూడా ఉన్నట్లు వార్తలు వెలువడటంతో ఆయన పేరును కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ లో నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విషాద ఘటనకు తనకు ఎలాంటి ప్రమేయం లేదని ఆయన ఓ వీడియో సందేశం ద్వారా తెలిపారు. తన పేరున కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పరారీలో వున్న ఆయన ఈ ఘటనతో తనకు సంబంధం లేదని చెప్పుకోచ్చారు.

రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యతో తనకు సంబంధం లేదని రాఘవేందర్ స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో తన జోక్యం లేకపోయినా తన పేరు ఎందుకు రాశారో అర్థంకావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమది రాజకీయ కుటుంబం అని, పనుల కోసం వందలమంది వస్తారని వివరించారు. ఆర్థిక పరిస్థితి బాగాలేక చనిపోతే నాకేంటి సంబంధం? అని రాఘవేందర్ ప్రశ్నించారు. ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని కోరుకుంటున్నానని ఆయన తెలిపారు. ఈ వ్యవహారంలో తన ప్రమేయం ఉందని నిరూపితమైతే ఎంతటి శిక్షకైనా సిద్ధమేనని ప్రకటించారు.

అయితే ఇక్కడి వరకు బాగానే వున్నా.. రాఘవేందర్ తాను రామకృష్ణతో ఆయన తల్లిని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పడం నేరమా? అని ప్రశ్నించడంతో తనకు రామకృష్ణకు మధ్య ఏదో వివాదం నెలకొందన్న విషయమై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతటితో అగని అనుమానాలు.. రామకృష్ణ అర్థిక పరిస్థితులు బాగోలేవని రాఘవేందర్ కు ఎలా తెలుసునన్న అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. కాగా ఈ కేసులో తనను ఇరికించేందుకు కొందరు కుట్ర చేశారని రాఘవేందర్ ఆరోపించారు. తన రాజకీయ ఎదుగుదలను అడ్డుకునేందుకు పథకం ప్రకారం చేశారని అన్నారు. తనను అభాసుపాలు చేసేందుకు రామకృష్ణను ప్రలోభపెట్టారని, ఎలాంటి విచారణకైనా సిద్ధమేనని స్పష్టం చేశారు.

పాత పాల్వంచకు చెందిన రామకృష్ణ, శ్రీలక్ష్మి, వారి కుమార్తె సాహిత్య తమ ఇంట్లోనే అగ్నికి ఆహుతయ్యారు. మరో కుమార్తె సాహితి కాలిన గాయాలతో చికిత్స పొందుతోంది. కాగా, రామకృష్ణ కారు నుంచి క్లూస్ టీమ్ కొన్ని కీలక కాగితాలు, బిల్లులను స్వాధీనం చేసుకుంది. తొలుత ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందని భావించిన పోలీసులు, ఆపై ఇది ఆత్మహత్యేనని ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ క్రమంలో రామకృష్ణ రాసిన ఆత్మహత్య లేఖ అధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా తొలుత ఈ ఘటన గ్యాస్ లీకేజి ప్రమాదం సంభవించి చోటుచేసుకుందని అనుమానించిన పోలీసులు.. తరువాత ఆత్మహత్యకు పాల్పడినట్టు భావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles