దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరగుతున్న క్రమంలో సంక్రాంతి నాటికి కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తో కూడా మూడవ దశ ప్రారంభం అవుతుందని ఇప్పటికే వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో దేశంలోని ప్రతీ ఒక్కరినీ ఈ వేరియంట్ ప్రభావితం చేస్తుందని కూడా వైద్యనిపుణులు అంచనాలు వేస్తున్నారు. ఇది ఫిబ్రవరి, మార్చి నెలల్లో మరితం తారాస్తాయికి చేరి ఏకంగా ప్రతీరోజు లక్షల కేసులు నమోదవుతాయని కూడా అంచనా వేశారు. అయితే ఇది డెల్టా వేరియంట్ అంత తీవ్రంగా లక్షణాలు కలిగి ఉండదని, దాదాపుగా 90 శాతం మందిలో అసలు లక్షణాలే కనిపించవని కూడా అధ్యయనాలు ఇప్పటికే చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో తొలిదశ కరోనా బీభత్సం నాటి నుంచి దీనిపై తన మాథమెటికల్ టేబుల్ ఆధారంగా అధ్యయనం చేస్తున్న ఐఐటీ కాన్పుర్ కు చెందిన ప్రొఫెసర్ మహీంద్ర అగర్వాల్ తాజాగా మూడవ దశపై కూడా కీలక విషయాలను వెల్లడించారు. భారత్లో కొవిడ్ థర్డ్ వేవ్ జనవరిలోనే మొదలవుతుందని.. అది జనవరి నుంచి నాలుగు నెలల పాటు అంటే ఏప్రిల్ వరకు ఉంటుందని పేర్కొన్నారు. ఈ దశ ఉన్నత స్థాయికి చేరిన క్రమంలో రోజుకు 1.8 లక్షల కేసులు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. అయితే ఆసుపత్రుల బారిన పడేవారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుందని తెలిపారు.
ఇక ఈ దశ అధ్యధికంగా ప్రబలడానికి ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో.. ఎలక్షన్ ర్యాలీలు సూపర్ స్ప్రెడర్లుగా మారతాయని హెచ్చరించారు. భారీ ప్రజా సమూహాల నేపథ్యంలో కొవిడ్ నిబంధనలు పాటించడం అంత సులువు కాదన్నారు. ఎలాంటి నిబంధనలు పాటించకుండానే ఎన్నికల ర్యాలీలు జరిగే అవకాశాలే అధికమని మహీంద్ర అగర్వాల్ పేర్కొన్నారు. ‘ఎన్నికల ర్యాలీల్లో భారీఎత్తున ప్రజలు పాల్గొంటారు. కొవిడ్ నిబంధనలను పాటించరు. దీనివల్ల దేశంలో కరోనా తీవ్రత పెరుగుతుంది. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. దేశంలో థర్డ్ వేవ్ జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఉంటుంది.
అయితే ఈసారి కరోనా సోకిన ప్రతి 10 మందిలో ఒక్కరికి మాత్రమే ఆస్పత్రి అవసరం ఉంటుంది. మార్చి చివరి నాటికి దేశంలో రెండు లక్షల పడకలు అవసరమవుతాయి’ అని వెల్లడించారు. భారత్లోని ప్రజలకు రోగనిరోధకశక్తి అధికంగా ఉందని మహీంద్ర అగర్వాల్ తెలిపారు. ఆఫ్రికా, భారత్లో 80శాతం జనాభా 45ఏళ్ల లోపువారేనని.. వీళ్లకు సాధారణ రోగనిరోధక శక్తి 80శాతం వరకు ఉంటుందన్నారు. మ్యూటెంట్ల కారణంగానే డెల్టా వేరియంట్ వచ్చిందన్నారు. దక్షిణాఫ్రికా మాదిరే భారత్లోనూ వేరియంట్ల ప్రభావం తక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more