తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలను గత ఏడేళ్లుగా ఏలుతున్నది కుటుంబ పార్టీలేనని.. వీరి హయాంలో కుటుంబాలకు చెందిన వారు అభివృద్ది చెందుతున్నారే తప్ప.. రాష్ట్రాలు మాత్రం అంగుళం కూడా ప్రగతి సాధించడం లేదని బీజేపి సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి ప్రకాశ్ జావదేకర్ అరోపించారు. ఈ మూడూ కుటుంబ పార్టీలు అవినీతికి పాల్పడుతున్నాయని ఆయన ఆరోపించారు. విజయవాడలో బీజేపి రాష్ట్ర స్థాయి నాయకత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆగ్రహ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఏపీలో టీడీపీ, వైసీపి రెండూ ప్రజలను మోసం చేశాయని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్లో చాలామంది నేతలు బెయిలుపై బయట ఉన్నారని, వారంతా త్వరలోనే జైలుకు వెళ్తారని పేర్కొన్నారు. ‘‘ప్రస్తుతం ఏపీలో విధ్వంసకర పాలన సాగుతోంది. ఎన్నికలకు మందు ఇచ్చిన హామీలను కాలగర్భంలో కలుపుతూ ప్రభుత్వాలు పాలనను సాగిస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో అంచెలవారీగా సంపూర్ణ మద్య నిషేధం అని చెప్పి మద్యంపై వచ్చిన డబ్బుతోనే పాలన సాగిస్తున్నారు. ఇచ్చిన హామీలు ఏవీ జగన్ నెరవేర్చలేదు. కేంద్ర పథకాలకు రాష్ట్ర స్టిక్కర్లు అంటిస్తూ.. అవి తమవిగా బీరాలు పోతున్నారని విమర్శించారు. ఇక్కడ కట్టించేది జగనన్న కాలనీలు కాదు.. మోదీ కాలనీలు. వాటికి డబ్బు ఇస్తున్నది కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వమని తెలిపారు.
తాను కేంద్రమంత్రిగా కొనసాగిన సందర్భంలోనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు లభించాయని.. అయితే అనుమతులు ఇచ్చి ఏడేళ్లయినా పోలవరం మాత్రం ఇప్పటికీ పూర్తి చేయలేదని దుయ్యబట్టారు. అమరావతి కోసం అటవీ భూములను కూడా బదిలీ చేశామని చెప్పిన ఆయన.. రాజధాని విషయంలో టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు ఘర్షణ పడుతున్నాయని అన్నారు. తాను విజయవాడ సభకు వస్తున్నప్పుడు దారిలో ‘పుష్ప’ సినిమా పోస్టర్ చూశానన్న ఆయన.. రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్పై వేసిన సిట్ను ఏపీలో రద్దు చేశారన్నారు. ఈ రాష్ట్రానికి మేలు చేసే నాయకత్వం తప్పక అవసరమని నోక్కి చెప్పిన ఆయన.. రానున్న ఎన్నికలలో రాష్ట్రంలో బీజేపి పార్టీ ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని ప్రకాశ్జావడేకర్ అభిప్రాయపడ్డారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more