ఇంటర్ ఫస్టియర్ పలితాలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫెయిలైన ఫస్టియర్ విద్యార్థులను కనీస మార్కులతో పాస్ చేయనున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇంటర్ విద్యార్థుల ఆందోళనలపై స్పందించిన మంత్రి.. మొదటి సంవత్సరంలో తప్పిన విద్యార్థులందరినీ కనీస మార్కులతో ఉత్తీర్ణులుగా చేస్తున్నామని ప్రకటించారు. కరోనా సమయంలో విద్యావ్యవస్థ ఇబ్బందులు ఎదుర్కొందని.. ఆ విపత్కర పరిస్థితులలో తరగతుల నిర్వహణకు అన్ని చర్యలు చేపట్టామన్నారు. దూరదర్శన్ ద్వారా విద్యార్థులకు పాఠాలు అందించామని తెలిపారు. వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి సమన్వయం సాధించామన్నారు.
రాష్ట్రంలోని 9, 10 తరగతుల విద్యార్థులను పరీక్షలు లేకుండానే ప్రమోట్ చేశామన్న మంత్రి.. విద్యార్థి జీవితంలో ఇంటర్ విద్య చాలా కీలకమని అందుకనే ఇక్కడ కొంత కఠినంగా వ్యవహరించామన్నారు. వీరి విద్యపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామన్న మంత్రి టీ-శాట్, దూరదర్శన్ వెబ్సైట్ల ద్వారా పాఠాలు అందుబాటులో ఉంచామని తెలిపారు.అయినా నెలరోజుల సమయమిచ్చి పరీక్షలు నిర్వహించామన్నారు. ఇంటర్ ఫస్టియర్ పరీక్షల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. 4.50లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇంటర్ ఫస్టియర్లో 49శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారని అన్నారు.
ఫస్టియర్ ఫలితాలపై విమర్శలు సరికాదన్న మంత్రి.. 10వేల మంది విద్యార్థులు 95శాతం మార్కులు సాధించారన్నారు. ఇంటర్ బోర్డు తప్పు లేకున్నా నిందించడం సరికాదని అన్నారు. పార్టీలను పక్కనపెట్టి విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించాలని అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, విపక్షాలు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, సీఎం కేసీఆర్ ఆదేశాలమేరకు.. ఇంటర్ విద్యార్థులందరికీ మినిమం 35 మార్కులు ఇచ్చి అందిరినీ పాస్ చేస్తున్నాం. ఇంటర్ సెకండ్ ఇయర్లో మంచి మార్కులు సాధించాలి. ఇలాగే ఆందోళనలు చేస్తే ఇంటర్ సెకండియర్లో కూడా పాస్ చేస్తారని ఆశించవద్దు’’ అని మంత్రి సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more