నిర్మల్ జిల్లాలోని బాసర అనగానే అందరికీ గుర్తుకువచ్చే పేరు సరస్వతీ దేవి దేవాలయం. అలాంటి పుణ్యధామంలో మరో పురాతన సరస్వతి శిల్పం చరిత్రకారులకు లభ్యమైంది. కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు, పరిశోధక చరిత్రకారుడు, బాసరవాసి బలగం రామ్మోహన్ బాసరలోని పాపహరేశ్వర దేవాలయపు గర్భగుడిలో కొత్తదైన పురాతన సరస్వతి శిల్పాన్ని గుర్తించాడు. స్థానికుల నుంచి పార్వతి దేవిగా పూజలు అందుకుంటున్న ఈ సరస్వతీ మాత విగ్రహాన్ని ఆయన గుర్తించారు. దేవతా ప్రతిమ లక్షణాలను పరిశీలించిన ఆయన ఈ విగ్రహం సరస్వతీ అమ్మవారిదిగా గుర్తించారు.
ఈ దేవతా మూర్తి విగ్రహం తలపై కరండమకుటం, చెవులకు చక్రకుండలాలు, మెడలో హారగ్రైవేయకాలు, కేయూరాలు, కంకణాలు, మణిమేఖల, జయమాల ధరించి ఉన్నది. ఈ దేవతామూర్తి చతుర్భుజి పై చేతులలో అంకుశం, పాశం, ముందు చేతులలో అక్షమాల, పుస్తకం ధరించి, ఎడమకాలిపై కుడికాలు పెట్టి అర్ధపద్మాసనంలో కూర్చున్న సరస్వతి అమ్మవారిగా గుర్తించారు. ఈ దేవత తలవెనక ప్రభావళి ఉంది. శైలిని బట్టి ఈ శిల్పం రాష్ట్రకూట, చాళుక్యుల కాలంనాటిది. ఆసనభేదాన్నిబట్టి ఈ దేవత జైనధర్మ ప్రతిమ అయి ఉంటుందని రామ్మోహన్ తెలిపారు. వ్యాసపురి(బాసర) ఆలయంలోని సరస్వతి శిల్పాన్ని ప్రసిద్ధ చరిత్రకారులు బీఎన్ శాస్త్రి జైన సరస్వతిగా భావించారు.
జైన మతంలో సరస్వతి ఆరాధన ఉన్నదని చెప్పడానికి ఉత్తర భారతదేశంలోని మధుర కంకాళిదిబ్బలో పీఠంమీద క్రీ.శ. 2వ శతాబ్దపు శాసనంతో లభించిన తలలేని రెండుచేతుల సరస్వతి శిల్పమే మొదటి ఆధారం. ఇదే దేశంలోకెల్లా తొలిసారి లభించిన సరస్వతి దేవతా విగ్రహం. కొలనుపాకలో దొరికిన శ్రుతదేవి (విద్యాదేవి, సరస్వతి) మరొక ఆధారం. బాసరలోని పాపహరేశ్వర దేవాలయమనే శిథిలమైన గుడిలో లభిస్తున్న శిల్పాలు కూడా జైనధర్మానికి సంబంధించినవి ఎక్కువని అన్నారు. ఈ గుడి మంటప స్తంభాలపై జైనులైన సెట్టిలు వేయించిన లఘు శాసనాలున్నాయి. సరస్వతి శిల్పాలు లభించిన బాసర ఒకప్పటి జైనవిద్యా కేంద్రంగా చెప్పవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more