కరోనా మహమ్మాది ధాటికి దేవాలయాలు, పుణ్యక్షేత్రాలకు కూడా పెద్ద సంఖ్యలో భక్తుల రాకపోకలు లేవు. కోవిడ్ ప్రోటోకాల్ పేరుతో ఎక్కడి ప్రభుత్వాలు అక్కడ పలు ఆంక్షలు విధించాయి. ఈ నేపథ్యంలో నిత్యం భక్తుల అలజడి.. వారి వాహనాలు శబ్దాలతో నిత్యంరద్దీగా ఉండే పుణ్యక్షేత్రాలు అసలు రద్దీలేకుండా పోతున్నాయి. ఇక ఈ క్రమంలో దారితప్పిన వన్యప్రాణులు కూడా తమ ఆహారం కోసం గ్రామాల బాటపడుతున్నాయి. తాజాగా సద్గురు సాయినాథుడు కొలువైన షిర్డీ పుణ్యక్షేత్రం సమీపంలోని శ్రీరాంపూర్లో చిరుత అలజడి సృష్టించింది.
అడవి నుంచి జనావాసాల్లోకి ప్రవేశించిన చిరుత ఐదుగురిపై దాడి చేసింది. చిరుత దాడిలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. ముందుగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిపై దాడికి పాల్పడింది. వెనుక నుంచి దాడి చేయడంతో ఆ వ్యక్తికి ఏం జరిగిందో అర్ధం కాలేదు. తృటిలో ఆ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. అక్కడి నుంచి తప్పించుకున్న చిరుత ఓ ఇంటిపై నక్కింది. చిరుత దాడితో వణికిపోయిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందచేశారు. వెంటనే అటవీశాఖ సిబ్బంది శ్రీరాంపూర్ చేరుకుని దానిని బంధించేందుకు రంగంలోకి దిగారు.
అయితే అటవీశాఖ సిబ్బందితో పాటు స్థానికులను కూడా బొల్తా కోట్టించిన చిరుత వలలో చిక్కినట్టే చిక్కి తప్పించుకుంది. ఫారెస్ట్ సిబ్బందితో సహా అక్కడ మరో నలుగురిపై దాడి చేసింది. అయినా పట్టువీడని అటవీశాఖ సిబ్బందికి స్థానికులు కూడా తోడుకావడంతో చివరకు చిక్కింది. అటవీశాఖ అధికారులు మరోసారి వల వేయడంతో దానిలో చిక్కింది ఆ చిరుత. దానిపై అటవీశాఖ సిబ్బంది మత్తుమందును ప్రయోగించారు. తరువాత బోనులో బంధించి తీసుకెళ్లారు. చిరుత హడావిడితో శ్రీరాంపూర్లో గ్రామస్థులు కొన్ని గంటలపాటు తెగ టెన్షన్ పడ్డారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more