టాలీవుడ్ హీరోలతో పాటు సినీప్రముఖులు, రియల్టర్లను, అధికవడ్డీ ఆశతో బోల్తా కొట్టించి.. వందల కోట్ల మేర డబ్బును వసూలు చేసిన వ్యాపారవేత్త, సినీ నిర్మాత శిల్పా చౌదరీ లీలా విన్యాసాలు అనేకం ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా టాలీవుడ్ హీరోల నుంచి ప్రముఖుల వరకు అందరినీ అధికవడ్డీ పేరిట బురడీ కొట్టించి.. నల్లడబ్బును రూటు మార్చి సక్రమమైనదిగా తీసుకోస్తామని శఠగోపం పెట్టిన మాయలాడి శిల్పా చౌదరి చేతిలో టాలీవుడ్ అగ్రహీరో మహేశ్ బాబు సోదరి, టాలీవుడ్ హీరో సుధీర్ బాబు సతీమణి ప్రియదర్శిని కూడా మోసపోయారు.
సుమారు 200 కోట్ల వరకు వసూళ్ల పేరుతో కుచ్చు టోపీ పెట్టినట్లు తెలుస్తోంది. ఫేజ్ త్రీ పార్టీ లు ఇచ్చి సెలబ్రిటీలను ఆకర్షించిన శిల్ప.. వారి నుంచి ప్రముఖులను పరిచయాలు చేసుకుని వారి నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూళ్లు చేసింది. చాలామంది ప్రముఖుల్ని శిల్ప మోసం చేసినట్లు వార్తలు అందుతున్నాయి. ఆధిక వడ్డి ఇస్తానని చెప్పి శిల్ప కోట్లు వసూలు చేసింది. శిల్పతో పాటు ఆమె భర్తను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. నల్లధనాన్ని మార్పిస్తానని, అధిక వడ్డీ ఇస్తానని చెప్పి శిల్పి.. ప్రముఖుల్ని మోసం చేసింది. మోసపోయినవారిలో చాలా మంది బాధితులు ఉన్నారని పోలీసులు భావించారు.
తాజాగా శిల్పా జాబితాలో మహేష్ బాబు చెల్లెలు, హీరో సుధీర్ సతీమణి ప్రియదర్శిని కూడా చేరింది. శిల్పా చౌదరి తన నుంచి తీసుకున్న రూ.2.9 కోట్లు ఎగ్గొట్టారంటూ నార్సింగి పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఓ కిట్టి పార్టీలో శిల్ప తనకు పరిచయమైందని ఆమె తెలిపారు. డబ్బుల కోసమే ఆమె ప్రతి వీకెండ్లో కిట్టి పార్టీ ఏర్పాటు చేసేదని ప్రియదర్శిని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో శిల్పను మరోసారి కస్టడిలోకి తీసుకుని డబ్బులు ఎక్కడికి తరలించారనే దానిపై విచారిస్తామని పోలీసులు తెలిపారు.
ఇప్పటికే శిల్పా చౌదరి, ఆమె భర్త శ్రీనివాస్ చౌదరి నుంచి మూడు మొబైల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో సెల్ ఫోన్ లు తెరిచి అందులోని సమాచారంతో దర్యాప్తు చేయనున్నట్టు తెలుస్తోంది. ఆమె వల్ల కోట్ల రూపాయల్లో మోసపోయిన బాధితులు ఫిర్యాదు చేయడానికి మరి కొందరు ముందుకు రావడంలేదు. ఐటీ కట్టకుండా దాచుకున్న డబ్బు ఆమెకు ఇచ్చినట్టు సమాచారం. నల్లడబ్బును అకౌంటబుల్ మనీగా చూపించే క్రమంలో అమెకు కొందరు డబ్బులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more