మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కొన్ని నెలల కిందట ప్రధాన నిందితుడు సునీల్ యాదవ్ ను అరెస్టు చేసిన సీబిఐ.. ఆ తరువాత ఈ కేసులో వైసీపీ పార్టీ కీలక నేతను శివశంకర్ రెడ్డిని కూడా అరెస్టు చేసింది. సునీల్ యాదవ్ అరెస్టు తరువాత విచారణ వేగం పెంచిన సీబిఐ.. వైఎస్ కుటుంబం సమీప బంధువులు, సన్నిహితులపైన దృష్టి సారించింది. కడప ఎంపీ అవినాష్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని సీబిఐ అధికారులు హైదరాబాదులో అరెస్టు చేసి పులివెందులకు తీసుకెళ్లిన విషయం తెలిసిందే.
ఇక ఈ కేసులో ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధమున్నవారి వెన్నులో చలిపుట్టేలా చేస్తోంది సీబిఐ. చాపకింద నీరులా తమ విచారణను అన్ని కోణాల్లో కొనసాగిస్తూనే.. ఈ కేసులో ప్రమేయమున్న వ్యక్తులను విచారిస్తోంది. కాగా ఈ కేసులో తాజాగా ఓ ట్విస్టు ఏర్పడింది. ఈ కేసులో తనకు ఏ సంబంధమూ లేకున్నా తనను సీబిఐ బృందం టార్గెట్ చేసి.. ఇరికిం చేందుకు ప్రయత్నం చేస్తోందని గంగాధర రెడ్డి అనే వ్యక్తి అభియోగాలు సంచలనంగా మారాయి. ఈ మేరకు గంగాధర్ రెడ్డి అనంతపురం జిల్లా ఎస్సీ ఫకీరప్పను ఆశ్రయించి.. తనకు సీబిఐ నుంచి రక్షణ కల్పించాలని కోరారు.
పది కోట్ల రూపాయల సుపారీ తీసుకుని వైఎస్ అవినాశ్ రెడ్డి, శంకర్ రెడ్డీలు వివేకాను తనతో హత్య చేయించినట్టు చెప్పాలని వివేకా కుమార్తె సునీత, సీబీఐ, మడకశిర ఎస్సై, సీఐ శ్రీరామ్ లు తనను వేధిస్తున్నారని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వీరి వల్ల తనకు, తన కుటుంబానికి ఆపద ఉందని... తమకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ ఫిర్యాదుపై ఎస్పీ స్పందించారు. గంగాధర్ రెడ్డి ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్నామని... విచారణ అధికారిగా డీఎస్పీ స్థాయి అధికారిని నియమించామని చెప్పారు. గంగాధర్ కు, ఆయన కుటుంబానికి రక్షణ కల్పించామని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more