ఉత్తరప్రదేశ్ లో దాదాపుగా 20 లక్షల మంది అశావహులు పాల్గోనదలచిన ఉపాధ్యాయ నియామక అర్హత పరీక్ష ‘టెట్’ రద్దైన విషయం తెలిసిందే. చివరిక్షణంలో పరీక్షను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం అనేక ప్రాంతాలకు చెందిన వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ గా మారడంతో.. దీనిపై సమాచారం అందుకున్న ప్రభుత్వం పరీక్షలకు కొన్ని గంటల వ్యవధి ముందు పరీక్షలను రద్దు చేసింది. ఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం మథుర, ఘజియాబాద్, బులంద్షహర్ ప్రాంతాల్లోని వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టడమే ఇందుకు కారణం.
కాగా లీకులకు సంబంధించి ఉత్తర్ ఫ్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ రంగంలోకి దిగి ఏకంగా 29 మందిని అరెస్టు చేసింది. వీరిపై జాతీయ భద్రత చట్టంతో పాటు గ్యాంగస్టర్ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఓ ప్రకటనలో తెలిపారు. కాగా రద్దు చేసిన పరీక్షను నెల రోజుల తర్వాత పారదర్శకంగా నిర్వహిస్తామని పేర్కోన్నారు. అయితే మళ్లీ పరీక్షలు రాసేందుకు ఏ అభ్యర్థి ఎలాంటి అదనపు చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు. దీంతో పాటు ఎలాంటి అదనపు ఫారాలను నింపాల్సిన పనిలేదని అన్నారు. ఇక అభ్యర్థులు తమ ఇళ్లకు అడ్మిట్ కార్డును చూపించి ఉచితంగా రాష్ట్ర బస్సులలో వెళ్లవచ్చునని తెలిపారు.
కాగా ఇవాళ ఒకటి నుంచి ఎనమిదవ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఆశావహులు రెండు బ్యాచులలో 2376 కేంద్రాలలో పరీక్షలకు హాజరయ్యారు. మరోవైపు, పేపర్ లీకేజీ ఘటనకు సంబంధించి లక్నో, మీరట్, వారణాసి, గోరఖ్పూర్ తదితర ప్రాంతాల్లో 23 మంది అనుమానితులను అరెస్ట్ చేశారు. ప్రశ్నపత్రం నిర్వహణ ఏజెన్సీని అధికారులు బ్లాక్లిస్ట్లో పెట్టారు. పేపర్ లీకేజీకి పాల్పడిన వారిని ఉపేక్షించబోమని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. వారిపై గ్యాంగ్స్టర్ చట్టం కింద కేసులు నమోదు చేయడంతోపాటు జాతీయ భద్రతా చట్టాన్ని ప్రయోగించి వారి ఆస్తులను జప్తు చేస్తారని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more