పైన దగా, కింద దగా, కుడిఎడమల దగాదగా అని ఎవరెంతగా చెప్పినా.. వినిపించుకోని కొందరు సరిగ్గా మోసగాళ్లు చేసే మోసానికి మాత్రం బుట్టలోపడి విలువైన సోమ్మును కోల్పోతుంటారు. కుడి చేతితో తింటూ ఎడమ చేతితో కాకిని కోట్టనివారు కూడా అత్యాశకు పోయి.. మోసగాళ్ల ఉచ్చులో పడి సంపదను పోగోట్టుకుంటారు. తాజాగా మహారాష్ట్రలోని ఫూణే ప్రాంతంలోని శివాజీనగర్ గోతాన్ ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి కూడా మహిళా కస్టమ్స్ అధికారి కారు చౌకగా బంగారుకడ్డీలను తెచ్చిస్తానని చెప్పగానే అత్యాశకుపోయాడు.
అమె చేతికి డబ్బు ఇవ్వడమే కాకుండా ఆమె అకౌంట్ ఖాతాకు కూడా డబ్బులు వేసి.. రెండు నెలలుగా ఎదురుచూస్తూనే వున్నాడు. అయితే అమె నుంచి తనకు బంగారు కడ్డీలు రావని పూర్తిగా నిర్థారించుకని తాను మోసపోయానని తెలుసుకున్న తరువాత చేసేది లేక పోలీసులను ఆశ్రయించాడు. బంగారు కడ్డీల పేరుతో స్థానిక వ్యాపారిని ఏకంగా రూ.84 లక్షల మేర మోసం చేసిన ఘటన మహారాష్ట్ర ఫూణేలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పూణేలోని 35 ఏళ్ల శివాజీనగర్ గోతాన్ అనే వ్యాపారి వద్దకు గత సెప్టెంబర్ మాసంలో ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వారిలో ఓ మహిళ కూడా వుంది.
అయితే ఆ మహిళా తనకు తాను కస్టమ్స్ అధికారినని చెబుతూ బాధితుడితో పరిచయం పెంచుకుంది. విదేశాల నుంచి కొందరు అక్రమంగా తీసుకువచ్చిన బంగారాన్ని తాము విమానాశ్రయంలో పట్టుకున్నామని.. అయితే అందులో కొంత తాను ఎవరికీ తెలియకుండా తీసి దాచానని నమ్మబలికింది. దానిని అతక్కువ ధరకే విక్రయిస్తానని నమ్మబలికింది. దీంతో అమెను గుడ్డిగా నమ్మిన వ్యాపారి నిందితురాలికి రూ 71.60 లక్షల నగదుతో పాటు ఆన్లైన్ ద్వారా మరో రూ 12.40 లక్షలు ఆమె బ్యాంక్ ఖాతాకు ట్రాన్స్ పర్ చేశానని చెప్పాడు. రెండు నెలలైనా తనకు బంగారం రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించానని బాధితుడు పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 08 | తెలంగాణ సోమ, మంగళవారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు... Read more
Aug 08 | గవర్నమెంటు జాబ్ కోసం దేశవ్యాప్తంగా ఎందరెందరో విద్యార్థులు నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వమైనా.. లేక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగమైనా తమకు లభిస్తే.. తమకు జాబ్ సెక్యూరిటీ ఉంటుందని.. దీంతో ఇక తమ జీవితం... Read more
Aug 08 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ కేంద్ర సంస్థలను తమ చెక్కుచేతల్లో పెట్టుకుని.. ప్రతిపక్షాలపై వేధింపు రాజకీయాలకు పాల్పడుతోందని కాంగ్రెస్ అరోపించింది. మునుపెన్నడూ లేని విధంగా దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని అందుకు ఎన్ఫోర్స్మెంట్... Read more
Aug 08 | పుట్టిన రోజు వేడుకల పేరుతో వికృత చేష్టలకు పాల్పడుతున్న సంఘటనలు ఇటీవల పెరిగిపోయాయి. అందులోనూ ఉత్తర్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో స్వయంగా రాజకీయ నాయకులే చట్టాలను అతిక్రమించి మరీ బర్త్ డే పార్టీలలో తుపాకీలతో... Read more
Aug 08 | ఒక వ్యక్తి అనూహ్యంగా రాత్రికి రాత్రే కోట్లకు అధిపతి అయ్యాడు. అతని బ్యాంకు ఖాతాలోకి ఒక్కసారిగా కోటాను కోట్ల రూపాయలు వచ్చిపడ్డాయి. ఈ డబ్బు ఎలా వచ్చిందో.? ఎవరు పంపించారో తెలియదు.. వారం క్రితం... Read more