పైన దగా, కింద దగా, కుడిఎడమల దగాదగా అని ఎవరెంతగా చెప్పినా.. వినిపించుకోని కొందరు సరిగ్గా మోసగాళ్లు చేసే మోసానికి మాత్రం బుట్టలోపడి విలువైన సోమ్మును కోల్పోతుంటారు. కుడి చేతితో తింటూ ఎడమ చేతితో కాకిని కోట్టనివారు కూడా అత్యాశకు పోయి.. మోసగాళ్ల ఉచ్చులో పడి సంపదను పోగోట్టుకుంటారు. తాజాగా మహారాష్ట్రలోని ఫూణే ప్రాంతంలోని శివాజీనగర్ గోతాన్ ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి కూడా మహిళా కస్టమ్స్ అధికారి కారు చౌకగా బంగారుకడ్డీలను తెచ్చిస్తానని చెప్పగానే అత్యాశకుపోయాడు.
అమె చేతికి డబ్బు ఇవ్వడమే కాకుండా ఆమె అకౌంట్ ఖాతాకు కూడా డబ్బులు వేసి.. రెండు నెలలుగా ఎదురుచూస్తూనే వున్నాడు. అయితే అమె నుంచి తనకు బంగారు కడ్డీలు రావని పూర్తిగా నిర్థారించుకని తాను మోసపోయానని తెలుసుకున్న తరువాత చేసేది లేక పోలీసులను ఆశ్రయించాడు. బంగారు కడ్డీల పేరుతో స్థానిక వ్యాపారిని ఏకంగా రూ.84 లక్షల మేర మోసం చేసిన ఘటన మహారాష్ట్ర ఫూణేలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పూణేలోని 35 ఏళ్ల శివాజీనగర్ గోతాన్ అనే వ్యాపారి వద్దకు గత సెప్టెంబర్ మాసంలో ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వారిలో ఓ మహిళ కూడా వుంది.
అయితే ఆ మహిళా తనకు తాను కస్టమ్స్ అధికారినని చెబుతూ బాధితుడితో పరిచయం పెంచుకుంది. విదేశాల నుంచి కొందరు అక్రమంగా తీసుకువచ్చిన బంగారాన్ని తాము విమానాశ్రయంలో పట్టుకున్నామని.. అయితే అందులో కొంత తాను ఎవరికీ తెలియకుండా తీసి దాచానని నమ్మబలికింది. దానిని అతక్కువ ధరకే విక్రయిస్తానని నమ్మబలికింది. దీంతో అమెను గుడ్డిగా నమ్మిన వ్యాపారి నిందితురాలికి రూ 71.60 లక్షల నగదుతో పాటు ఆన్లైన్ ద్వారా మరో రూ 12.40 లక్షలు ఆమె బ్యాంక్ ఖాతాకు ట్రాన్స్ పర్ చేశానని చెప్పాడు. రెండు నెలలైనా తనకు బంగారం రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించానని బాధితుడు పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more