మధ్యప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి బిసాహులాల్ సింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాష్ట్రంలో అగ్గిరాజేస్తున్నాయి. రాజ్ పుత్ సామాజికవర్గానికి చెందిన మహిళలతో పాటు అగ్రవర్ణాలకు చెందిన వర్గాల మహిళలపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. సమాజంలో సమానత్వం సాధించేందుకు అణగారిన వర్గాలకు చెందిన మహిళలతో పాటు అగ్రవర్ణాలకు చెందిన మహిళలు కూడా కష్టపడిపనిచేయాలని అన్నారు. అంతటితో ఆగకుండా.. ఠాకూర్లుగా వ్యవహరించే రాజ్పుత్ వర్గానికి చెందిన మహిళలతో పాటు ఇతర అగ్రవర్ణ మహిళలను ఇండ్ల నుంచి బయటకి లాగి వారితో పని చేయించాలని అన్నారు.
మంత్రి బిసాహులాల్ సింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో కూడిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అనుప్పుర్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ “ఠాకూర్లతో పాటు ఇతర అగ్ర కులాలు తమ మహిళలను ఇండ్లకు పరిమితం చేశాయి..సమాజంలో పనిచేసేందుకు వారిని అనుమతించడం లేదు.. సమానత్వం సాధించేందుకు ఠాకూర్లతో పాటు ఇతర అగ్రకులాల మహిళలను ఇండ్ల నుంచి బయటకు లాగి వారితో పని చేయించాల”ని సింగ్ ఆ వీడియోలో అన్నారు.
అయితే దీనిపై రాజ్ పుత్ సహా ఇతర అగ్రవర్ణాలకు చెందిన మహిళలు మండిపడుతున్నారు. సమానత్వం కోసం ఉపన్యసించే ముందు ఎలాంటి ప్రసంగాలు చేయాలో.. చేయకూడదో కూడా తెలియదా.? అంటూ మహిళలు విరుచుకుపడుతున్నారు. ఠాకూర్ సామాజికవర్గానికి చెందిన నేతలు కూడా మంత్రివ్యాఖ్యలను తప్పబడుతున్నారు. తమ ఇంటి మహిళలపై వ్యాఖ్యలు చేసే అవసరం మంత్రికి ఏముందని వారు ప్రశ్నిస్తున్నారు. మంత్రి వ్యాఖ్యలను మీరు వీక్షించండీ..
#WATCH | Thakur-thakar (upper castes) keep their women confined to their homes & don't allow them to work in society. Women of Thakurs&other big people should be dragged out of their homes & made to work in society to ensure equality: MP Minister Bisahulal Singh in Anuppur(24.11) pic.twitter.com/46962n0Puj
— ANI (@ANI) November 25, 2021
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more