ప్రజాప్రతినిధులే కాదు ప్రముఖులు మరణించినా అంతిమయాత్రతో పాటు తుది వీడ్కోలు పలికే అంతిమ సంస్కరణలకు చాలా తక్కువ మంది బంధువులు, ఇరుగుపోరుగువారు, పరియస్థులు, స్నేహితులు హాజరవుతుంటారు. ఇక గత రెండేళ్లుగా కరోనావైరస్ మహమ్మారి అంక్షల నేపథ్యంలో పట్టుమని పదిమంది కూడా హాజరుకావడం లేదు. అయ్యో అలా పరమపదించారా.? అని అంగలార్చేవారే తప్ప.. నిజంగా వచ్చి బాధిత కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని పంచేవారే కరువయ్యారు. ఇలాంటి ఘటనలు నమోదవుతున్న తరఉణంలో ఎవరికీ ఏమీ కాని ఓ మానసిక వికలాంగుడి అంతిమ యాత్రకు ఏకంగా ఊరు-వాడా కలిదినంత జనం హాజరయ్యారు.
కర్ణాటకలోని విజయనగర జిల్లాలోని హవినహడగలిలో హుచ్చబస్య (‘పిచ్చి బస్య) అనే నిరాశ్రయుడైన మానసిక వికలాండుగు.. ఎవరు కనిపించినా కేవలం ఒక్క రూపాయి మాత్రమే అడిగి తీసుకునేవారు. అయితే ఎవరైనా ఎక్కవు డబ్బును ఇచ్చినా తాను మాత్రం ఒక్క రూపాయిని మాత్రమే తీసుకుని మిగిలిన చిల్లరను వారికి తిరిగిచ్చేసేవాడు. అయితే ఆయన మరణించారడన్న వార్తును తెలుసుకున్న హవినహడగలి జనం శోక సంద్రంలో మునిగిపోయారు. అంతేకాదు అతని అంతిమయాత్రను ఎంతో ఘనంగా చేయాలని నిర్ణయించుకుని తమకు తాముగా చందాలు వేసుకుని పెద్ద ఎత్తున ఊరేగింపుగా అంతిమ యాత్ర చేశారు.
హుచ్చబస్య పట్టణంలో ఎన్నో ఏళ్లుగా బస్య నివసిస్తున్నాడు. దివ్యాంగుడైన అతను పట్టణంలో ప్రతి ఒక్కరికి హుచ్చబస్య గురించి బాగా సుపరిచితుడు. అందర్ని పేర్లతో పలకలరిస్తూ చిన్నారులను మాత్రం ప్రేమతో పలకరించే బస్యను చిన్నారులు, మహిళలు అప్పాజీ అని ప్రేమగా పిలిచేవారు. అదేంటో సాధారణంగా ఎవరైనా బిచ్చగాడు కనిపిస్తే అసహ్యించుకునే సందర్భాలే ఎక్కువ కానీ హచ్చబస్య కనిసిస్తే చాలు అతిని వద్దకు వచ్చి మరీ రూపాయి ధర్మం చేసేవారు. ఇలా చేయడం వల్ల తమకు మంచి జరుగుతుందని అక్కడి ప్రజల భావన.. అందుకే హచ్చబస్య కనిపిస్తే రూపాయి ఇచ్చేసేవారు అక్కడి ప్రజలు.
కాగా నవంబర్ 12న ఆయన ఓ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో ఆర్జీసీ బస్సు ఆయననను ఢీకొంది. అయితే స్థానికులు హుటాహుటిన బస్యను అసుపత్రికి తరలించారు. అయితే తీవ్రగాయాలు కావడంతో ఆయన చికిత్స పోందుతూ శనివారం మరణించారు. దీంతో ఒక్కసారిగా స్తానికంగా విషాధఛాయలు అలుముకున్నాయి. స్థానికులు తమ వంతుగా స్వచ్చందంగా చందాలు వేసుకుని ఆయన అంతక్రియలను మాత్రం ఘనంగా నిర్వహించారు. బస్య అంత్యక్రియలకు ఏకంగా 3000 మందికి పైగా జనం హాజరయ్యారంటే అయనకు స్థానికంగా ఎంత ప్రాచుర్యం ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఆయన అంతిమ సంస్కారాలకు స్థానిక ప్రజలు స్వచ్చంధంగా హాజరయ్యారు.
Over 3,000 people joined the funeral procession of Basava, a homeless man in Karnataka's Ballari pic.twitter.com/KsrBO7vAPh
— Shishir Rao.S (@Shishir_rao97) November 18, 2021
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more