వరంగల్లోని కాకతీయ మెడికల్ కళాశాల (కేఎంసీ)లో మరోమారు ర్యాగింగ్ భూతం జడలు విప్పింది. ఈ కాలేజీలో ర్యాగింగ్ తరహా ఘటనకు కేరాఫ్ సెంటరుగా మారిందని.. తమపై సీనియర్ విద్యార్థులు చేస్తున్న దాడుల నుంచి తమను కాపాడాలని కొరుతూ జూనియర్ విద్యార్థులు చేసిన ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ప్రోఫెసర్ల మధ్యఅధిపత్య పోరు.. ఈ ఘటనకు కేంద్రబింధువుగా మారుతోందన్న అరోపణలు వినబడుతున్నాయి. అయితే ఈ కాలేజీలో ర్యాగింగ్ పేరుతో విద్యార్ధుల మధ్య ఫ్రోఫెసర్లు లడాయికి లంగరు వేస్తున్నారన్న అరోపణలు వినబడతున్నాయి.
తాజాగా నిర్వహించిన ఫ్రెషర్స్ డే పేరుతో సీనియర్ విద్యార్థులు కొందరు మద్యం మత్తులో తమను ర్యాగింగ్ చేస్తున్నారంటూ ఓ విద్యార్థి చేసిన ట్వీట్ తో రాష్ట్రంలోని కాలేజీల్లో లేకుండా పోయిన ర్యాగింగ్ భూతం మళ్లీ వరంగల్ మెడికల్ కాలేజీలో నిద్రలేచిందని విషయం బయటకు వచ్చింది. ఈ కాలేజీలో ఇటీవలి కాలం నుంచి వరుసగా వెటుగుచూస్తున్న ఘటనలు అక్కడి విద్యార్థుల వాతావరణాన్ని ఎత్తిచూపుతున్నాయి. ఈ క్రమంలో ఓ విద్యార్థి ఏకంగా ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రి అమిత్ షా, తెలంగాణ మంత్రి కేటీఆర్, డీజీపీ, రాష్ట్ర వైద్యసంచాలకుడిని ట్యాగ్ చేస్తూ ఓ విద్యార్థి ట్వీట్ చేశాడు.
అయితే కళాశాలలో జరుగుతున్న సీనియర్ల పెత్తనంపై జూనియర్ విద్యార్థులు ఎంతగా పిర్యాదు చేసినా.. కళాశాల యాజమాన్యం మాత్రం ఆ వార్తలను కొట్టిపడేస్తోంది. 2017 బ్యాచ్ కు చెందిన 50 మంది విద్యార్థులు మద్యం తాగి తమను వేధిస్తున్నట్టు ఆ ట్వీట్లో ఫిర్యాదు చేశాడు. అయితే, విద్యార్థి ఫిర్యాదును కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్దాసు కొట్టిపడేశారు. ర్యాగింగ్ వార్త నిజం కాదన్నారు. కళాశాలలో సీనియర్, జూనియర్ విద్యార్థుల హాస్టల్ భవనాలు దూరదూరంగా ఉంటాయన్నారు. సీనియర్ విద్యార్థులు కొందరు జన్మదిన వేడుకలు చేసుకోవడాన్ని జీర్ణించుకోలేని కొందరు ఇలా ప్రచారం చేస్తున్నారని అన్నారు.
అయితే మెన్స్ హాస్టల్ 1లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయని విద్యార్థి ట్వీట్ చేయడంపై అప్రమత్తమైన హాస్టల్ మేనేజ్ మెంట్.. అలాంటి ఘటనలు ఏవీ నమోదు కాలేదని చెబుతున్నారు. మరోవైపు, ఈ ఘటనపై ఆరా తీసిన డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రమేశ్రెడ్డి కళాశాలలో జరగాల్సిన ఫ్రెషర్స్ డేకు అనుమతి ఇవ్వొద్దని సూచించినట్టు తెలుస్తోంది. కాగా, విద్యార్థి ట్వీట్ను పరిగణనలోకి తీసుకున్న పోలీస్ కమిషనర్ ఆదేశాలతో మట్టెవాడ పోలీసులు నిన్న కేఎంసీలో విచారణ జరిపారు. ర్యాగింగ్పై విద్యార్థులు ఎవరూ తమకు ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
May 19 | పంజాబ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు, భారత మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూకు సుప్రీంకోర్టు జైలు శిక్షను విధించింది. ఏడాది పాటు జైలు శిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది. 1988లో రోడ్డుపై గొడవ పడిన... Read more
May 19 | మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాలనలో హిందువులపై అదనపు పన్నులు వేసిన ఇబ్బందులకు గురిచేశాడన్న విషయం చరిత్ర పాఠ్యపుస్తాకాల్లో నిక్షిప్తమైవుంది. ఈ అంశమే ఇప్పుడు మహారాష్ట్రలో ప్రజల మధ్య శాంతియుత వాతావరణానికి భంగం కలిగిస్తోంది. ఇటీవల... Read more
May 19 | ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్)లోని ఏఈసీ పాఠశాలలో ఉపాధ్యాయ ఆశావహులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని... Read more
May 19 | వారణాసిలోని జ్ఞానవాపి మసీదు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వారణాసిలోని స్థానిక కోర్టు ఈ కేసును విచారించకుండా దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గురువారం స్టే విధించింది. ఈ కేసులో శుక్రవారం మధ్యాహ్నం... Read more
May 19 | నది పరివాహక ప్రాంతంలోని ప్రజలు ప్రతీరోజు నదుల్లోనే స్నానం చేస్తుంటారు. నదీ సాన్నాలు ఆచరించడం వారి జీవన విధానంలో భాగమైపోతుంది. క్రమంగా అడవులు తగ్గడం, వర్షాలు కురవకపోవడంతో పూర్తిస్థాయిలో ప్రవహించాల్సిన నదులు కూడా నానిటికీ... Read more