వరంగల్లోని కాకతీయ మెడికల్ కళాశాల (కేఎంసీ)లో మరోమారు ర్యాగింగ్ భూతం జడలు విప్పింది. ఈ కాలేజీలో ర్యాగింగ్ తరహా ఘటనకు కేరాఫ్ సెంటరుగా మారిందని.. తమపై సీనియర్ విద్యార్థులు చేస్తున్న దాడుల నుంచి తమను కాపాడాలని కొరుతూ జూనియర్ విద్యార్థులు చేసిన ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ప్రోఫెసర్ల మధ్యఅధిపత్య పోరు.. ఈ ఘటనకు కేంద్రబింధువుగా మారుతోందన్న అరోపణలు వినబడుతున్నాయి. అయితే ఈ కాలేజీలో ర్యాగింగ్ పేరుతో విద్యార్ధుల మధ్య ఫ్రోఫెసర్లు లడాయికి లంగరు వేస్తున్నారన్న అరోపణలు వినబడతున్నాయి.
తాజాగా నిర్వహించిన ఫ్రెషర్స్ డే పేరుతో సీనియర్ విద్యార్థులు కొందరు మద్యం మత్తులో తమను ర్యాగింగ్ చేస్తున్నారంటూ ఓ విద్యార్థి చేసిన ట్వీట్ తో రాష్ట్రంలోని కాలేజీల్లో లేకుండా పోయిన ర్యాగింగ్ భూతం మళ్లీ వరంగల్ మెడికల్ కాలేజీలో నిద్రలేచిందని విషయం బయటకు వచ్చింది. ఈ కాలేజీలో ఇటీవలి కాలం నుంచి వరుసగా వెటుగుచూస్తున్న ఘటనలు అక్కడి విద్యార్థుల వాతావరణాన్ని ఎత్తిచూపుతున్నాయి. ఈ క్రమంలో ఓ విద్యార్థి ఏకంగా ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రి అమిత్ షా, తెలంగాణ మంత్రి కేటీఆర్, డీజీపీ, రాష్ట్ర వైద్యసంచాలకుడిని ట్యాగ్ చేస్తూ ఓ విద్యార్థి ట్వీట్ చేశాడు.
అయితే కళాశాలలో జరుగుతున్న సీనియర్ల పెత్తనంపై జూనియర్ విద్యార్థులు ఎంతగా పిర్యాదు చేసినా.. కళాశాల యాజమాన్యం మాత్రం ఆ వార్తలను కొట్టిపడేస్తోంది. 2017 బ్యాచ్ కు చెందిన 50 మంది విద్యార్థులు మద్యం తాగి తమను వేధిస్తున్నట్టు ఆ ట్వీట్లో ఫిర్యాదు చేశాడు. అయితే, విద్యార్థి ఫిర్యాదును కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్దాసు కొట్టిపడేశారు. ర్యాగింగ్ వార్త నిజం కాదన్నారు. కళాశాలలో సీనియర్, జూనియర్ విద్యార్థుల హాస్టల్ భవనాలు దూరదూరంగా ఉంటాయన్నారు. సీనియర్ విద్యార్థులు కొందరు జన్మదిన వేడుకలు చేసుకోవడాన్ని జీర్ణించుకోలేని కొందరు ఇలా ప్రచారం చేస్తున్నారని అన్నారు.
అయితే మెన్స్ హాస్టల్ 1లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయని విద్యార్థి ట్వీట్ చేయడంపై అప్రమత్తమైన హాస్టల్ మేనేజ్ మెంట్.. అలాంటి ఘటనలు ఏవీ నమోదు కాలేదని చెబుతున్నారు. మరోవైపు, ఈ ఘటనపై ఆరా తీసిన డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రమేశ్రెడ్డి కళాశాలలో జరగాల్సిన ఫ్రెషర్స్ డేకు అనుమతి ఇవ్వొద్దని సూచించినట్టు తెలుస్తోంది. కాగా, విద్యార్థి ట్వీట్ను పరిగణనలోకి తీసుకున్న పోలీస్ కమిషనర్ ఆదేశాలతో మట్టెవాడ పోలీసులు నిన్న కేఎంసీలో విచారణ జరిపారు. ర్యాగింగ్పై విద్యార్థులు ఎవరూ తమకు ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more