బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. తీవ్రరూపం దాల్చి వాయుగుండంగా మారింది. ఈ వాయుగుండం ప్రభావంతో ఇప్పటికే తమిళనాడు, అంధ్రప్రదేశ్ రాష్ట్రల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే జల దిగ్భంధంలో రెండు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లు చిక్కుకున్నాయి. అనేక గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో ఇవాళ సాయంత్రం తమిళనాడు, అంధప్రదేశ్ రాష్ట్రాల మధ్య వాయుగుండం తీరం దాటనుంది. దీని ప్రభావం చేత గత రెండు రోజులుగా రెండు రాష్ట్రాల్లోని అనేక జిల్లాల్లో కుంభవృష్టి కురుస్తోంది.
వాయుగుండం తీరం దాటే సమయంలో గంటలకు 45 కిలోమీటర్ల వేగంతో ఈతురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర తమిళనాడులోని అనేక జిల్లాలతో పాటు తమిళనాడు రాజధాని చెన్నైలోనూ భారీ నుంచి అతిభారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ డిఫ్యూటీ జనరల్ ఎస్ బాలచంద్రన్ తెలిపారు. దీంతో పాటు ఇటు అంధ్రపరదేశ్ లోని చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశాలు వున్నాయిని తెలిపారు. వాయువ్య బంగాళాఖాతంలోని ఏర్పడిన వాయుగుండం గంటలకు 21 కిలోమీటర్ల వేగంతో నైరుతి తమిళనాడు వైపు కదులుతోందని తెలిపారు.
ఈ సాయంత్రం తమిళనాడులోని కారైక్కల్, నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట మధ్య కడలూరు వద్ద వాయుగుండం తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో వాయుగుండం, దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో భారీ వర్షాలు కురుస్తున్నాయని ఆయన తెలిపారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో చిత్తూరు, నెల్లూరు జిల్లాలోని అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలన్నింటికీ జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్ ఇవాళ సెలవు ప్రకటించారు. వాయుగుండం ప్రభావంతో గత అర్ధరాత్రి నుంచి చిత్తూరు జిల్లావ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి.
లోతట్టు ప్రాంతాల ప్రజలకు రెవెన్యూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. చంద్రగిరిలోని అమ్మ చెరువు ప్రమాదకరస్థితికి చేరగా, చైతన్యపురం చెరువు ఐదేళ్ల అనంతరం పరవళ్లు తొక్కుతుంది. తిరుపతిలోని మాధవ్ నగర్ లో వర్షపు నీరు ఇళ్లలోకి ప్రవేశించింది. డీఆర్ మహల్, రైల్వే అండర్ బ్రిడ్జి (పశ్చిమ) కింద భారీగా నీరు నిలిచిపోయింది. శ్రీనివాస కల్యాణమండపాల వద్ద రోడ్డుపై నీరు భారీగా నిలిచిపోయింది. అటు నెల్లూరు జిల్లాలో తీర ప్రాంత గ్రామాల్లో పర్యటించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చక్రధర్ బాబు అధికారులకు స్పష్టం చేశారు. అవసరమైన పక్షంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా రెవెన్యూ అధికారి బి.చిన్నఓబులేసు ఆదేశాలు జారీ చేశారు.
భారీ వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ అధికారుల హెచ్చరికల నేపథ్యంలో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. 2015లో సంభవించిన వరదల భీభత్సాన్ని తలచుకుని.. అలాంటి ఘటనలు పునరావృతం అవుతాయా.? అని అందొళన చెందుతున్నారు. చెన్నై సహా దాని సమీప 14 జిల్లాల్లో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశాలు వున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కుడ్డలూర్, విల్లుపురం, చెన్నై, కాంచిపురం, చెంగళ్ పట్టు, తిరువళ్లూర్, వెల్లూర్, రాణిపేట్, తిరుపట్టూర్, నాగపట్టణం, మియినలద్దుత్తురయ్,కాళ్లకూర్చి, తిరువణ్ణామలై, సేలం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురస్తాయని హెచ్చిరకలు జారీచేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more