కరోనా మహమ్మారి మూడవ దశ విజృంబిస్తుందని అనేక దేశాలు శరవేగంగా కరోనా వాక్సీన్లను తమ ప్రజలకు అందజేసి.. వ్యాధి నియంత్రణ చర్యలకు శ్రీకారం చుడుతున్న తరుణంలో యూరోప్ ఖండంలోని దేశాల్లో మాత్రం నాలుగో దశ కరోనావైరస్ విజృంభిస్తోంది. అందుకు కారణం అక్కడి ప్రజలు కరోనా టీకాలపై నిరాసక్తతను వ్యక్తం చేయడంతో పాటు అక్కడి దేశాలకు ఇంకా హార్డ్ ఇమ్యూనిటీ రాలేదన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. యూరోప్ ఖండంలోని పరిస్థితులను పరిశీలిస్తున్న ప్రపంచ అరోగ్య సంస్థ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపర్చింది.
ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో కరోనావైరస్ క్రమంగా తన ఉద్దృతిని కోల్పోతున్న తరుణంలో యూరోప్ దేశాలు మాత్రం అందుకు భిన్నంగా వున్నాయని పేర్కోంది. అన్ని దేశాల్లో కరోనా అదుపులోకి వస్తున్నా.. యూరోప్ దేశాల్లో మాత్రం కరోనా కేసుల విజృంభన కోనసాగుతుందని అన్నారు. వాటితో పాటు మరణాల సంఖ్య కూడా అధికంగానే వుందని పేర్కోంది. ప్రపంచవ్యాప్తంగా తాజాగా 31 లక్షల కరోనా కేసులు నమోదు కాగా, అందులో కేవలం యూరోప్ దేశాల్లో మాత్రమే 19 లక్షల కేసులు నమోదయ్యాయని వివరాలను తెలిపింది. గత వారంతో పొల్చితే ఈ వారం 10శాతం మేర అధికంగా కరోనా మరణాలు సంభవించాయని పేర్కోంది.
యూరోప్ లోనే అత్యధికంగా కేసులు నమోదైన దేశాల్లో జర్మని, బ్రిటన్ దేశాలు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్యసంస్థ తెలిపింది. జర్మనీ, బ్రిటన్ దేశాల్లో కరోనా రోజువారీ కేసుల సంఖ్య ఆందోళన కలిగించేలా ఉంది. నిన్న ఒక్కరోజే జర్మనీలో 39,676 కొత్త కేసులు నమోదుకాగా, బ్రిటెన్ లోనూ అదే స్థాయిలో 39,329 కేసులు వెల్లడయ్యాయి. దీంతో జర్మనీలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 3.31లక్షలకు చేరగా, నిన్న ఒక్క రోజులో ఏకంగా 236 మంది మృత్యువాత పడ్డారు. అదే సమయంలో అటు బ్రిటన్ లోనూ 214 మంది కరోనాతో మరణించగా ఈ మహమ్మారి వల్ల అసువులు బాసిన వారి సంఖ్య ఏకంగా 1.42 లక్షలు దాటింది.
దేశంలోని ఆసుపత్రులకు తరలివస్తున్న కరోనా బాధితుల సంఖ్య అంతకంతకు పెరిగిపోయింది. ఐసీయూల్లో ఖాళీలు లేని పరిస్థితి ఏర్పడింది. కొత్తగా వచ్చేరోగులను ఆసుపత్రుల్లో చేర్చుకోలేకపోతున్నామని అక్కడి వైద్యసిబ్బంది నిస్సహాయత వ్యక్తంచేస్తున్నారు. ఆసుపత్రుల్లోని సిబ్బంది మొత్తం కరోనా రోగుల బాగోగులు చూసుకోవడానికి సరిపోతున్నారని, ఇతర కేసుల్లో శస్త్రచికిత్సలు కూడా నిర్వహించలేకపోతున్నామని ఓ ఆసుపత్రి యజమాన్యం వాపోయింది. కొత్త కేసుల సంఖ్య ఇలాగే పెరుగుతూ పోతే దేశంలో లాక్ డౌన్ తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more