దేశంలో వంట నూనెల ధరల గణనీయంగా తగ్గాయని కేంద్ర ఆహార ప్రజాపంపిణీ విభాగం తెలిపింది. నూనె రకాన్ని బట్టి కిలోకు కనిష్ఠంగా రూ.7 నుంచి గరిష్ఠంగా రూ.20 వరకు తగ్గినట్లు ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ డిపార్టుమెంట్ కార్యదర్శి సుధాన్షు పాండే వెల్లడించారు. పామాయిల్, పల్లి నూనె, సోయాబీన్ నూనె, పొద్దుతిరుగుడు నూనెతోపాటు అన్ని ప్రధానమైన నూనె రకాలపై ధరలు తగ్గినట్లు తెలిపారు. కాగా, కరోనా దేశంలో కాలుమోపిన అనంతరం కొండెక్కిన వంట నూనెల ధరలు.. ఇప్పుడిప్పుడే దిగి వస్తున్నాయి.
2020, మార్చిలో కిలో రూ.70-80 మధ్య ఉన్న వంట నూనెల ధరలు ఆ తర్వాత కరోనా మహమ్మారి కారణంగా కొండెక్కాయి. కిలో నూనె రూ.190-200 వరకు పలికింది. ఆ తర్వాత క్రమంగా దిగివచ్చి ప్రస్తుతం 150-160 మధ్య ఉన్నది. ఇప్పుడు ధరలు మరికాస్త తగ్గడంతో కిలో నూనె రూ.140కి అటుఇటుగా ఉండే అవకాశం ఉన్నది. అక్టోబరులోనే కేంద్రం పన్నులు తగ్గించినా ధరలు దిగిరాకపోవడంతో, కేంద్రం దిద్దుబాటు చర్యలకు దిగింది.
వ్యాపారుల వద్ద ఉన్న వంట నూనెలు, నూనె గింజల నిల్వలపై వచ్చే ఏడాది మార్చి 31 వరకు పరిమితి విధించింది. స్టాక్ పరిమితులు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రకటించింది. ఈ నేపథ్యంలో వంటనూనెల ధరలు కొద్దిమేర తగ్గాయి. పామాయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్, వేరుశనగ నూనె, సోయాబీన్ నూనెల ధరలు తగ్గినట్టు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ విభాగం కార్యదర్శి సుధాంశు పాండే తెలిపారు. అన్ని ప్రధానమైన వంట నూనెలకు ధర తగ్గింపు వర్తిస్తుందని తెలిపారు.
తగ్గింపు నూనెల వివరాలిలా:
* పామాయిల్- రూ.20
* వేరుశనగ నూనె- రూ.18
* సోయాబీన్ నూనె- రూ.10
* సన్ ఫ్లవర్ ఆయిల్- రూ.7
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more