దీపావళి పర్వదినం నాటికి మూడు రోజుల ముందు నుంచే తెలుగురాష్ట్రాల్లో అలుముకునే పండగ వాతావరణం.. రాష్ట్రంలో ఆధ్యాత్మిక శోభను తీసుకువస్తోంది. ఇక పండగ పూర్తైన వెంటనే అర్థారాత్రి నుంచి అత్యంత పవిత్రమాసమైన కార్తీకంలోకి అడుగుపెడుతుండటం.. అందులోనూ ఆద్యాత్మికతకు నెలవైన శుక్రవారం రోజున కార్మీక ప్రారంభం కావడంతో రాష్ట్రంలో కార్తీక మాస శోభ సంతరించుకుంది. హిందూ మహిళలు తమ కుటుంబాలతో ఉదయాన్నే శైవాలయాలకు వెళ్లి కార్తిక మాసాన్ని పురస్కరించుకుని శివయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
దీంతో తెలుగు రాషాల్లో ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మంత్రం ఇవాళ్టి నుంచి నెల రోజుల పాటు మారుమ్రోగుతోంది. శివయ్యకు అత్యంత ప్రీతికరమైన ఈ మాసంలో భక్తులు లయకారుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఉపవాస దీక్షలు, ఆకాశదీపాలు, కార్తీక మాసం మహాన్యాస రుద్రాభిషేకాలు, ఏకాదశ రుద్రాభిషేకాలు సహా ఇత్యాది పైజలను భక్తిశ్రద్దలతో నిర్వహిస్తున్నారు. దీంతో శివాలయాలు, పుణ్యక్షేత్రాల్లో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తున్నది. శుక్రవారం తెల్లవారుజాము నుంచే పుణ్యస్నానాలు చేసి త్రినేత్రుడిని దర్శించుకుంటున్నారు. ఆలయాల్లో కార్తిక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.
అలంపూర్లోని జోగులాంబ ఆలయాలను భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుంటున్నారు. ఆలయాల్లో కార్తిక మాస పూజలు నిర్వహిస్తున్నారు. బాలబ్రహ్మేశ్వర స్వామివారి ఆలయంలో కార్తిక శోభ నెలకొన్నది. జోగులాంబ ఆలయంలో కార్తిక దీపాలను వెలిగిస్తున్నారు. వేములవాడ రాజరాజేశ్వరుని సన్నిధికి భారీ సంఖ్యలో తరలివస్తున్న భక్తులు రాజన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అలు శ్రీశైలం, శ్రీ కాళహస్తీ, యాగంటి క్షేత్రాలలో కార్తిక మాసోత్సవాలను పురస్కరించుకుని భక్తులు భారీ సంఖ్యలో మల్లికార్జునస్వామి, అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. సామూహిక అభిషేకాలు నిర్వహిస్తున్నారు. కార్తికమాసోత్సవాల సందర్భంగా శ్రీగిరీశుడు మల్లికార్జున స్వామి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చాడు. ఆలంయంలోని గంగాధర మండపం వద్ద భక్తులు కార్తిక దీపారాధనలు చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more