విద్యార్థి దశలో అడుకోవడం, స్నేహితులతో పోట్లాడటం.. అల్లరిచేయడం, కొంటెపనులు చేయడం, ఎవరైనా కొత్తవస్తువు తీసుకువస్తే వారిపై దౌర్జన్యం చేసి.. దానితో కొంతసేపు గడపటం ఇలాంటి చేయడం సహజం. ఇలా చేస్తేనే వారు విద్యార్థులు. అయితే అల్లరి శృతిమించిన నేపథ్యంలో ఎలా ఉంటుందో తెలుసా.. అబ్బా వీళ్లేం పిల్లలు.. అంటూ వారిపై అరిచేయడం ఇంట్లో తల్లిదండ్రులకే కాదు స్కూళ్లో ఉపాధ్యాయులకు, హెడ్ మాస్టార్లుకు కూడా విసుగు తెప్పిస్తోంది. అయితే తమ పిల్లలను కొట్టడం ఇష్టం లేని తల్లిదండ్రులు ఇప్పటికీ ఉపాధ్యాయులకు తమ పిల్లాడు బాగా అల్లరి చేస్తున్నాడని వాడిని దారిలో పెట్టాలని అప్పగించడం అన్ని పాఠశాలల్లో జరుగుతూనే ఉంటుంది.
అయితే విద్యార్థులు అల్లరి చేస్తే కోట్టేస్తామంటూ ఉపాధ్యాయులు మందలించడం కామన్. విద్యార్థులు చదవకపోతే.. వాళ్లను బుజ్జగించడమో.. లేక బెదిరించడమో చేసి వాళ్లు చదువుకునేలా చేయడం టీచర్ల బాధ్యత. కానీ.. కొందరు టీచర్లు దాన్ని గ్రాంటెడ్గా తీసుకొని విద్యార్థులను ప్రతి చిన్న విషయానికి దండిస్తున్నారు. దీని వల్ల చిన్నవయసులోనే పిల్లలు మెంటల్గా డిస్టర్బ్ అవుతున్నారు. ఇలాంటి ఘటనలు ఇప్పటికే చాలా జరిగాయి అయినా కూడా ఉపాధ్యాయులు తమ తీరు మార్చుకోవడం లేదు. తాజాగా యూపీలో ఇటువంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. రెండో తరగతి చదివే విద్యార్థిని హెడ్మాస్టర్ బిల్డింగ్ మీది నుంచి కిందకు వేలాడదీశాడు.
మీర్జాపూర్లోని ఓ పాఠశాల హెడ్మాస్టర్.. మనోజ్ విశ్వకర్మ.. రెండో తరగతి చదివే విద్యార్థిని తీసుకెళ్లి బిల్డింగ్ మీది నుంచి తల కిందులుగా వేలాడదీశాడు. దీంతో అక్కడ ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. వెంటనే పిల్లలంతా అక్కడ గుమికూడారు. ఆ పిల్లాడు భయంతో ఏడుస్తున్నాడు. హెడ్ మాస్టర్ సారీ చెబితేనే కిందికి దించుతానంటూ ఆ పిల్లాడిని బెదిరిస్తున్నాడు. ఇంతలో తోటి విద్యార్థులు గట్టిగా అరవడంతో ఆ హెడ్ మాస్టర్ పిల్లాడిని కిందికి దించాడు. అయితే.. హెడ్మాస్టర్ చేసిన పనిని కొందరు ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
దీంతో సామాజిక మాధ్యమాల్లో ఆ వీడియోలు వైరల్ అయ్యాయి. అంతేకాదు పోలీసులు రంగంలోకి దిగి సదరు ప్రధాన ఉపాధ్యాయుడిని అరెస్టు కూడా చేశారు. అయితే విషయం తెలుసుకున్న పిల్లాడి తల్లిదండ్రులు వెంటనే వచ్చి హెడ్ మాస్టర్కు మద్దతుగా నిలిచారు. ఆయన చేసింది తప్పే.. కానీ ఆలా చేసింది ప్రేమతోనే కానీ, పగ, ద్వేషంతో కాదని, అన్నారు. అయితే రంగంలోకి దిగిన బాలల హక్కుల సంఘాలు హెడ్ మాస్టారుపై పిర్యాదు చేయడంతో పోలీసులు జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. హెడ్ మాస్టారుకు రెండవ తరగతి విద్యార్థి పాఠం నేర్పించాడా..? లేక ఎవరికి ఎవరు పాఠం నేర్పించారని నెట్ జనులు కామెంట్లు చేస్తున్నారు.
This teacher also seems to have been inspired by #Godse:
— Abhayjit singh(अभयजीत सिंह) (@abhayjitsandhu) October 28, 2021
In a school in #Mirzapur-Ahraura, #uttarpradesh student studying in class 2nd did mischief, then the teacher grabbed his feet and hanged him from the building. pic.twitter.com/9whomOUHaN
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more