బాలీవుడ్ పరిశ్రమను ముంబై నుంచి తరిమివేసేందుకే దేశంలోని కాషాయ పార్టీ తెరవెనుక కుట్రలు పన్నుతోందని ఎన్సీపీ సీనియర్ నేత, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ఆరోపించారు. ఈ కుట్రలో భాగంగానే ముంబై క్రూయిజ్ డ్రగ్ కేసును తెరపైకి తెచ్చిందని ఆయన ధ్వజమెత్తారు. దేశ ఆర్థిక రాజధానిగా బాసిల్లుతున్న ముంబై మహానగర ప్రతిష్టను మసకబార్చేందుకే బీజేపి పార్టీ డ్రగ్స్ కేసుతో కుట్రకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. డ్రగ్స్ కేసులో బడా బీజేపి నేతల సమీప బంధువులు ఉన్నా వారిని విడిపించి.. బాలీవుడ్ కు చెందిన ప్రముఖుల పిల్లల చుట్టూనే కథను నడుపడానికి ఇదే కారణమని ఆయన అరోపించారు.
ఎన్సీబి అధికారి 10 నుంచి 11 మందిని ఈ కేసులో పట్టుకుని కేవలం 8 మందిని మాత్రమే అరెస్టు చేశారని ఏకంగా ఎన్సీబి ముంబై జోనల్ హెడ్ సమీర్ వాంఖేడ్ పై సంచలన అరోపణలు చేసిన నవాబ్ మాలిక్.. అప్పుడే ఆయనకు చూపించిన సినిమా వెనుక అసలు సినిమా ఇంకా బ్యాలెన్స్ ఉందని కూడా ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకే రక్షణ కోరుతూ ఎన్సీబీ అధికారి సమీర్ వాంఖడే బాంబే హైకోర్టును ఆశ్రయించారని నవాబ్ మాలిక్ ఆరోపించారు. తన తాజా అరోపణలకు బలం చేకూర్చేలా ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం యోగి ఆదిత్యానాధ్ ఇటీవల సినీ ప్రముఖులతో నోయిడాలో ఫిల్మ్ సిటీ ఏర్పాటుపై చర్చలు జరిపిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. బాలీవుడ్ను ముంబై నుంచి దూరం చేసేందుకే బీజేపీ ఇలా వ్యవహరిస్తోందని అన్నారు.
ఆర్యన్ ఖాన్ను ఎన్సీబీ కార్యాలయానికి తీసుకువచ్చిన కిరణ్ గొసావి జైలు పాలవడంతో పరిస్ధితి మారిపోయిందని వ్యాఖ్యానించారు. డ్రగ్ కేసులో ప్రత్యక్ష సాక్షి కిరణ్ గొసావిని చీటింగ్ కేసులో పుణే పోలీసులు బుధవారం రాత్రి అరెస్ట్ చేశారు. అక్టోబర్ 3న ముంబై నుంచి గోవా వెళుతున్న క్రూయిజ్ సిప్లో ఎన్సీబీ దాడుల అనంతరం ఆర్యన్ ఖాన్తో గొసావి సెల్ఫీ వైరల్గా మారింది. కాగా డ్రగ్స్ కేసులో నిందితులను విడిచిపెట్టేందుకు ఎన్సీబీ అధికారులు పెద్దమొత్తంలో లంచాలు డిమాండ్ చేసినట్టు ఆరోపణలు వెల్లవెత్తాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more