రోజూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ రేట్లతో నిత్యావసర ధరలు కూడా భగ్గుమంటున్నాయి. దీంతో పండుగల సంగతి అటుంచితే కనీసం రోజువారీ గ్యాస్ ఆదాను చేయడమెలా అన్న విసయాలపై దేశంలోని గృహలక్ష్ములు దృష్టిసారించారు. ఈ క్రమంలోనే మరో పిడుగులాంటి వార్త వినబడింది. దీపావళిని పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రభుత్వాలు కానుకలను అందజేస్తాయి. కానీ కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం మాత్రం 2016లో వారి స్ర్రీధనంగా వచ్చిన బంగారంపై కూడా లెక్కలు చెప్పాలని ఆంక్షలు పెట్టింది. ఇక తాజాగా 2021లో దీపావళిని పురస్కరించుకుని వారికి మరింత భారం కలిగించనుంది.
ప్రతీ పక్షం రోజులకో పర్యాయం అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగూణంగా లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ సబ్సీడీ (ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర)లపై హెచ్చతగ్గుల కోసం కేంద్రంతో పాటు ఇంధన సంస్థలు కూడా సమీక్ష నిర్వహిస్తుంటాయి. కాగా ఈ పర్యాయం మాత్రం సబ్సీడి వంట గ్యాస్ ధరలు భారీగా పెరుగనున్నట్టు సమాచారం. 14.2 కిలోల వంటగ్యాస్ సిలిండర్పై రూ.100 వడ్డించనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ అనుమతి లభించిన తర్వాత.. ధరను ఎంతమేరకు పెంచాలన్న దానిపై నిర్ణయిస్తామని ఆ వర్గాలు వెల్లడించాయి. సిలిండర్ ధరను ఇంత మొత్తంలో పెంచడానికి గల కారణాలను ఆయిల్ కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
గ్యాస్ ధరల్లో పెరుగుదలకు అనుగుణంగా బహిరంగ మార్కెట్లో రిటైల్ సిలిండర్ ధర పెంచేందుకు ఆయిల్ కంపెనీలను అనుమతించడం లేదు. దీంతో గ్యాస్ కొనుగోలు, అమ్మకం ధరల్లో అంతరం ఏర్పడింది. దీన్ని పూడ్చేందుకు అవసరమైన సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం ఎత్తేసింది. ఇది చాలదన్నట్టు అంతర్జాతీయ విపణిలో గ్యాస్ ధరలు గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగిపోయాయి. దీంతో నష్టాలను పూడ్చుకోవడానికి ఒక్కో సిలిండర్పై రూ.100 పెంచాలని నిర్ణయించినట్టు వెల్లడించాయి.
‘ఎల్పీజీ అనేది ఇంకా నియంత్రిత వస్తువే. ప్రభుత్వం రిటైల్ సిలిండర్ ధరను క్రమబద్దీకరించవచ్చు కూడా. దీనికోసం ఆయిల్ కంపెనీలకు ప్రభుత్వం సబ్సిడీని చెల్లించాలి. అప్పుడే, తక్కువ రేటుకు ఎల్పీజీ సిలిండర్ను విక్రయించగలం’ అని ఒక అధికారి తెలిపారు. ‘అసలు ధర, రిటైల్ ధర మధ్య ఏర్పడిన అంతరాన్ని పూడ్చేందుకు అవసరమైన పరిహారం లేదా సబ్సిడీని ఇస్తామన్న హామీ.. ప్రభుత్వం నుంచి ఇంకా రాలేద’ని పేర్కొన్నారు. సిలిండర్పై సబ్సిడీని ప్రభుత్వం ఇవ్వడానికి ఆసక్తి చూపించకపోతే, కచ్చితంగా రిటైల్ సిలిండర్ ధరలను పెంచాల్సిందేనన్నారు.
గడిచిన మూడు నెలల్లో వంటగ్యాస్ సిలిండర్ ధరలను నాలుగుసార్లు పెంచారు. జూలైలో ఒక్కో సిలిండర్పై రూ.25.50, ఆగస్టు 17న రూ.25, సెప్టెంబర్ 1న రూ. 25, అక్టోబర్ 6న రూ.15 పెంచారు. స్థూలంగా గడిచిన జూలై నుంచి సిలిండర్పై ప్రభుత్వం ఇప్పటివరకూ రూ.90 పెంచింది. ప్రస్తుతం ఒక్కో ఎల్పీజీ సిలిండర్ ధర రూ.952కు చేరింది. ఎల్పీజీపై సబ్సిడీని ఎత్తేస్తూ గతేడాది కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీంతో సబ్సిడీ, సబ్సిడీయేతర సిలిండర్ ధరలు ఒకేలా ఉంటున్నాయి.
* నరేంద్రమోడీ తొలిసారి అధికారంలోకి వచ్చిన జూన్, 2014లో సబ్సీడీ గ్యాస్ సిలిండర్ ధర-రూ.414
* రెండోసారి అధికారంలోకి వచ్చిన జూన్, 2019లో సబ్సీడి గ్యాస్ సిలిండర్ ధర-రూ.500
* ప్రస్తుతం సబ్సీడీ గ్యాస్ సిలిండర్ ధర- రూ. 952
* ఏడేండ్ల వంటగ్యాస్ సిలిండర్ ధరలో పెరుగుదల- రూ.538
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more