'మా' ఎన్నికల రగడ ఇప్పట్లో ముగిసేట్టు కనిపించడంలేదు. పోలింగ్ ముగిసి, ఫలితాలు వెల్లడై, కొత్త కార్యవర్గం కొలువుదీరినప్పటికీ ఏదో ఒక అంశం తెరపైకి వస్తూనే ఉంది. అయితే అత్యంత ఉత్కంఠభరితంగా జరిగిన ఈ ఎన్నికలు ఇవాళ కీలక మలుపు తిరగబోతున్నాయి. అదెలా అంటే.. ఎన్నికల సందర్భంగా మాకు సంబంధం లేని వ్యక్తి ఎన్నికల కేంద్రంలోకి వచ్చి ఓటర్లను బెదిరించారని ప్రకాశ్ రాజ్ అరోపిస్తున్నారు. ఆయన ఏమంటున్నారంటే.. ఎన్నికల సందర్భంగా వైసీపీకి చెందిన ఒక వ్యక్తి ఎన్నికల హాల్ లో ఉన్నాడని ఎన్నికల అధికారి కృష్ణమోహన్ కు ప్రకాశ్ రాజ్ ఫిర్యాదు చేశారు.
విష్ణు ప్యానల్ బ్యాడ్జి పెట్టుకుని ఆయన హల్ చల్ చేశారని ఆరోపించారు. ఆ వ్యక్తి పేరు నూకల సాంబశివరావు అని, జగ్గయ్యపేటకు చెందిన వాడని తెలిపారు. జగ్గయ్యపేట పీఎస్ లో ఆయనపై రౌడీషీట్ కూడా ఉందని చెప్పారు. అంతేకాదు ఏపీ ముఖ్యమంత్రి జగన్, మోహన్ బాబు, విష్ణులతో సాంబశివరావు దిగిన ఫొటోలను, కొన్ని వీడియోలను ఎన్నికల అధికారికి పంపించారు. ఓటర్లను సాంబశివరావు బెదిరించారని... ఆయన బెదిరింపులకు భయపడిన ఓటర్లు విష్ణు ప్యానల్ కి ఓట్లు వేశారని చెప్పారు. 'మా' సభ్యులు కాని వారిని ఎన్నికల హాల్ లోకి ఎలా అనుమతించారని ప్రశ్నించారు. క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వ్యక్తిని వెంట పెట్టుకుని విష్ణు ప్యానల్ తిరిగిందని చెప్పారు.
తాజాగా మంచు విష్ణుతో పోలింగ్ రోజున ఓ వైసీపీ నేత కనిపించాడంటూ ప్రకాశ్ రాజ్ సంచలన ఆరోపణలు చేశారు. ఆ వైసీపీ నేత ఓ రౌడీ షీటర్ అని తెలిపారు. అంతకుముందే సీసీటీవీ ఫుటేజి కావాలంటూ ప్రకాశ్ రాజ్ 'మా' ఎన్నికల అధికారికి లేఖ రాశారు. కాగా, 'మా' ఎన్నికల అధికారి కృష్ణమోహన్ మరోసారి వివరణ ఇచ్చారు. ప్రకాశ్ రాజ్ లేఖ తనకు అందలేదని అన్నారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ ఎన్నికలకు సంబంధించి తన విధి నిర్వహణ పూర్తయిందని స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటించడం వరకే తన విధి అని, ఇక తాను చేయడానికి ఏమీలేదని తెలిపారు. తర్వాతి పరిణామాలతో తనకు సంబంధం లేదని వివరించారు.
#MaaElections2021 .. dear Election officer Krishna mohan garu .. this is just the beginning.. give us the CC footage.. we will let the world know what happened.. how the elections were conducted #justasking pic.twitter.com/ew8waPyAXN
— Prakash Raj (@prakashraaj) October 22, 2021
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more