దేశం ఇవాళ సరికొత్త అధ్యయనాన్ని లిఖించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అక్టోబర్ 21వ తేదీన దేశంలో కోవిడ్ టీకా పంపిణీ విషయంలో వంద కోట్ల మార్క్ను అందుకున్నట్లు తెలిపిన ఆయన ఈ ఘనత సాధించడంలో భాగమైన దేశంలోని ప్రతి ఒక పౌరుడికి ఇది దక్కుతుందని అన్నారు. వంద కోట్ల కోవిడ్ టీకాలను దేశంలోని వంద కోట్ల మంది ప్రజలకు ఇచ్చిన నేపథ్యంలో ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ మార్క్ను అందుకున్న నేపథ్యంలో ప్రతి పౌరుడికి కంగ్రాట్స్ చెబుతున్నట్లు ప్రధాని అన్నారు. కాగా వంద కోట్ల టీకా డోసుల జారీలో ఎక్కడా వీఐసీ సంస్కృతి కనపించలేదని అన్నారు.
వ్యాక్సినేషన్ కార్యక్రమంపై వీఐపీ ప్రభావం పడకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని అన్నారు. వాక్సీన్ తీసుకోవడంలో ప్రతి పౌరుడు సమానమే అన్నట్లు వ్యవహరించామని అన్నారు. దేశంలో జరిగిన వ్యాక్సినేషన్ విధానంపై గర్వంగా ఫీలవ్వాలని, శాస్త్రీయ పద్ధతిలో.. శాస్త్రీయ ఆధారంగా వ్యాక్సినేషన్ జరిగినట్లు ప్రధాని తెలిపారు. సంపూర్ణంగా సైంటిఫిక్ పద్ధతుల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం జరిగినట్లు ఆయన చెప్పారు. ఇది నిజంగా దేశం సాధించిన ఘనతగా పేర్కోన్నారు. వంద కోట్ల వ్యాక్సిన్ డోసులు కేవలం సంఖ్య మాత్రమే కాదు అని, దేశ చరిత్రలో ఇదో కొత్త అధ్యాయం అన్నారు.
వ్యాక్సినేషన్ కార్యక్రమంపై మొదట్లో చాలా భయాందోళనలు వ్యక్తం అయ్యాయని, ఇండియా లాంటి దేశంలో వ్యాక్సిన్ క్రమశిక్షణ ఎలా సాధ్యం అవుతుందని విమర్శించారన్నారు. సబ్కా సాత్.. సబ్ కా వికాశ్కు ఇండియా వ్యాక్సిన్ ప్రోగ్రామ్ సజీవ ఉదాహరణ అన్నారు. కఠిన పరిస్థితుల్లో ఇండియా ఓ లక్ష్యాన్ని విజయవంతంగా చేరుకున్నట్లు చెప్పారు. లక్ష్యాల కోసం దేశం కఠినంగా పనిచేస్తుందన్న సంకేతాన్ని చెబుతుందన్నారు. ఇది భారత సామర్ధ్యానికి ప్రతిబింబంగా నిలుస్తుందన్నారు. కొత్త ఇండియా ఇమేజ్కు ఇది నిదర్శనమన్నారు. బిలియన్ వ్యాక్సిన్ డోసుల పంపిణీలో వీఐపీ కల్చర్ చోటుచేసుకోలేదన్నారు.
భారత ఆర్థికవ్యవస్థ పట్ల దేశంలోని, విదేశాల్లోని నిపుణులు పాజిటివ్గా ఉన్నట్లు ప్రధాని తెలిపారు. రికార్డు స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయని, అలాగే యువతకు కొత్త ఉపాధి అవకాశాలను కూడా క్రియేట్ చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడు అంతటా ఆశావాదమే కనిపిస్తోందన్నారు. ఇప్పుడు అందరూ మేడిన్ ఇండియా గురించి మాట్లాడుతున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటి వరకు తొలి డోసు వ్యాక్సిన్ తీసుకోని వారికి ప్రాధాన్యత ఇవ్వాలని, వాళ్లంతా వ్యాక్సినేట్ కావాలని, వ్యాక్సిన్ వేయించుకున్నవాళ్లు ఇతరుల్ని ఎంకరేజ్ చేయాలని, రాబోయే పండుగ సీజన్ వేళ ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని మోదీ తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more