Petrol, Diesel Prices At Record High Levels మళ్లీ పెరిగిన ఇంధన ధరలు.. వాహనదారులకు వాయింపులు..

Petrol and diesel hit fresh record highs as prices hiked across india

Petrol Diesel prices, petrol diesel price hike, petrol prices in delhi, diesel prices in delhi, effect of covid 19 on petrol prices, effect of covid 19 on diesel prices, petrol price, petrol rate, petrol rate today India, diesel rate, diesel price, diesel rate today, diesel rate today in India, today petrol rate, today diesel rate, Petrol rate in Hyderabad, diesel rate in Telangana, diesel rate in Andhra Pradesh, diesel rate in Hyderabad, diesel rate in Guntur, diesel rate in Chennai, diesel rate in Vijayawada, diesel rate in Amaravati, diesel rate in Visakhapatnam, diesel rate in Delhi, diesel rate in Chennai, diesel rate in India, Petrol rate in Telangana, petrol rate in Andhra Pradesh, petrol rate in Delhi, petrol rate in Mumbai, Petrol rate in Hyderabad, Petrol rate in Visakhapatnam, fuel rates today in India, fuel rates, fuel price in India

After remaining steady for two consecutive days, petrol and diesel prices were hiked on Wednesday, October 20, 2021, hitting fresh record highs. In the national capital, the petrol and diesel prices each rose 35 paise. Following the latest price revision, petrol in Delhi is now retailing at Rs 106.19 a litre while diesel is selling at Rs 94.92.

మళ్లీ పెరిగిన ఇంధన ధరలు.. వాహనదారులకు వాయింపులు..

Posted: 10/20/2021 01:33 PM IST
Petrol and diesel hit fresh record highs as prices hiked across india

డెబై ఏళ్ల స్వతంత్ర భారతావనిలో ఎన్నడూ ఎరుగని రీతిలో ఇంధన ధరలు పైపైకి ఎగబాగుతున్నాయి. జూలై నెల 17న తొలిసారిగా గరిష్ట ధరలకు చేరిన చమురు ధరలు.. రెండు నెలల పాటు స్థబ్దుగా కొనసాగుతూ వచ్చి తాజాగా అల్ టైమ్ హై స్థాయిని అందుకున్నాయి. ప్రతీ రోజు పెరుగుతున్న ధరలతో రోజురోజు సరికొత్త గరిష్టాలను ఇంధన ధరలు అందుకుంటున్నాయి. ఇంధన ధరల పెంపుపై ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నామని చె్ప్పిన కేంద్రం.. ఈ ఏడాది ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన మే 4 నుంచి వరుసగా దరలను పెంచూతూ వాహనదారులకు షాకిస్తోంది.

ఏడురోజులగా వరుసగా పెరుగుతూ వస్తున్న ఇంధన ధరలతో డీజిల్ కూడా వంద రూపాయల మార్కును అందుకుంది. సరిగ్గా పెట్రోల్ ధర వంద మార్కును అందుకున్న నాలుగు నెలల తరువాత డీజిల్ కూడా రూ.100 ను అందుకుంది. ఇక ఇందులో రెండు నెలల పాటు ధరల పెంపుకు కళ్లెం పడినా.. డీజిల్ వంద మార్కును అందుకుంది. ఇక ఇంధన ధరల గణనీయమైన పెంపుతో మరీ ముఖ్యంగా డీజిల్ ధర పెంపు ప్రభావం నిత్యావసర సరుకులతో పాటు అన్ని రంగాలపై పడుతోందని ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పరోక్ష పన్నుల్ని తగ్గించడం ద్వారా ద్రవ్యోల్బణంపై ఒత్తిడిని తగ్గించవచ్చని సూచనప్రాయంగా తెలిపారు.

చమురు కెంపెనీలు ఇంధన ధరలను మే నెలలో ఏకంగా 16 సార్లు, జూన్ నెలలో 16 సార్లు, జూలైలో పది పర్యాయాలు పెంచాయి. అయితే ఇంధన ధరలను తగ్గించాల్సిందేనన్న డిమాండ్ పెల్లుబిక్కిన నేపథ్యంలో ఆగస్టు, సెప్టెంబర్ రెండు నెలలుగా ఇంధన ధరల జోలికి వెళ్లన చమురు సంస్థలు.. సెప్టెంబర్ నెలాఖరులలో మాత్రం మళ్లీ వాహనాదారులకు షాకిచ్చాయి. ఇక అక్టోబర్ నెల నుంచి వరుసగా ఇంధన ధరలు పెరుగుతూనే వున్నాయి. అక్టోబర్ లో పండుగ పర్వదినాలు రావడంతో ఎవరి పనులలో వారు నిమగ్నం కాగా, చాప కింద నీరులా ధరలను పెంచుతూనే వున్నాయి ఇంధన కంపెనీలు. సెప్టెంబర్ నుంచి ప్రారంభమైన ధరల పెంపు ఇప్పటివరకు ఏకంగా 17సార్లు పెంచాయి. దీంతో దేశంలోని అన్ని మెట్రోపాలిటిన్ నగరాలతో పాటు 13 రాష్ట్రాల్లో పెట్రోల్ ధర రూ.110 మార్కును దాటింది.

ఇక తాజాగా డీజిల్ దర కూడా వంద మార్కును అందుకునే దిశగా కదులుతోంది. ఇప్పటికే రికార్డు స్థాయికి ధరలు చేరగా.. మరోసారి పెట్రోల్‌ లీటర్‌కు 35 పైసలు మేర పెంచిన ఇంధన సంస్థలు, డీజిల్‌ ధరపై ఏకంగా మరోమారు 35 పైసల మేర పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ ఏడాది మే 3న దేశ రాజధాని ఢిల్లీలో పెట్రల్ ధర 90.40గా నమోదు కాగా డీజిల్ ధర 80.73గా నమోదైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు చమురు ధరను 54 పర్యాయాలు పెంచిన కేంద్రం.. మే నెల నుంచి తాజా పెంపు వరకు పెట్రోల్ పై రూ.15.79, డీజిల్‌పై 14.21 వరకు చమరు కంపెనీలు పెంచాయి. ఫలితంగా పెట్రోల్-డీజిల్ ధరలు దేశంలో రికార్డు స్థాయికి చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లో లీటరు పెట్రోల్ ధర ఏకంగా రూ.108 దాటింది.

తాజాగా దేశవ్యాప్తంగా మెట్రో నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు ఎలా వున్నాయంటే...

ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర 106.19గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ.94.92కు చేరింది.
ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.112.11గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ.102.89కు చేరింది.
చెన్నైలో లీటరు పెట్రోల్ ధర రూ.     103.31గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ.99.26కు చేరింది.
కొల్ కతాలో లీటరు పెట్రోల్ ధర రూ.106.78గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ.98.03కు చేరింది.
విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.110.90 కాగా, లీటరు డీజిల్ ధర రూ.103.43కు చేరింది.
హైదారాబాద్ లో లీటరు పెట్రోల్ ధర రూ.110.46గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ.103.56కు చేరింది.
బెంగళూరులో లీటరు పెట్రోల్ ధర రూ.109.89గా నమోదు కాగా, లీటరు డీజిల్‌ రూ.100.75కు చేరింది.
పాట్నాలో లీటరు పెట్రోల్ ధర రూ.109.64గా నమోదు కాగా, లీటరు  డీజిల్‌ రూ.101.50కు చేరింది.
భూపాల్ లో లీటరు పెట్రోల్ ధర రూ.114.81గా నమోదు కాగా, లీటరు డీజిల్ రూ.104.15కు చేరింది
చండీగఢ్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.102.21గా నమోదు కాగా, లీటరు  డీజిల్‌ రూ.94.64కు చేరింది.
లక్నోలో లీటరు పెట్రోల్ ధర రూ.103.18గా నమోదు కాగా, లీటరు  డీజిల్‌ రూ.95.37కు చేరింది.
తిరువనంతపురంలో లీటరు పెట్రోల్ ధర రూ.108.09గా నమోదు కాగా, లీటరు డీజిల్‌ రూ.101.67కు చేరింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles