టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ నివాసంతో పాటు రాష్ట్ర ప్రధాన కార్యాలయం, విశాఖపట్నంతో పాటు పలు ప్రాంతాల్లోని టీడీపీ కార్యాలయాలపై అగంతకులు దాడులకు తెగబడటాన్ని పలు రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో ఖండించాయి. అధికారంలోని పార్టీ తమ అనుచరులతో ప్రత్యర్థి పార్టీ కార్యాలయాలపై దాడులకు తెగబడటాన్ని తీవ్రంగా ఖండించాయి. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఈ దాడులను నిర్ద్వందంగా ఖండించారు. అటు కాంగ్రెస్ పార్టీ కూడా దాడులను ఖండించింది. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు, ఏపీ బీజేపి అధ్యక్షుడు సోమువీర్రాజు కూడా దాడులను ఖండించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాట్లాడుతూ, జనసేన ఐటీ వింగ్ కు సంబంధించిన సమావేశంలో ఉండగా రాష్ట్రంలో టీడీపీ ఆఫీసులపై దాడులు జరిగినట్టు సమాచారం అందిందని తెలిపారు. తనకు తెలిసినంతవరకు రాష్ట్రంలో పార్టీ ఆఫీసులపై దాడులు జరగడం ఇదే ప్రథమం అని పేర్కొన్నారు. ఇలాంటి దాడుల సంస్కృతి ప్రజాసంక్షేమానికి ఏమాత్రం క్షేమకరం కాదని స్పష్టం చేశారు. పార్టీ ఆఫీసులపైనా, నాయకుల ఇళ్లపైనా దాడులు చేస్తే అది అరాచకానికి, దౌర్జన్యానికి దారితీస్తుంది తప్ప, అది ప్రజాస్వామ్యానికి ఏమాత్రం క్షేమకరం కాదని పవన్ అభిప్రాయపడ్డారు.
దీనిపై కేంద్ర హోంశాఖ దృష్టి సారించాలని పవన్ కోరారు. ఏపీ పోలీసు విభాగం కూడా సత్వరమే దీనిపై చర్యలు తీసుకోవాలని, దోషులను పట్టుకుని శిక్షించకపోతే ఆంధ్రప్రదేశ్ అరాచకానికి చిరునామాగా మారుతుందని స్పష్టం చేశారు. వైసీపీ నేతలే ఇవాళ్టి దాడులకు పాల్పడ్డట్టు చెబుతున్నారని, భవిష్యత్తులో ఇలాంటి ధోరణులను వైసీపీ నేతలు నియంత్రించుకోకపోతే ప్రజాస్వామ్యానికి అది గొడ్డలిపెట్టు అని పేర్కొన్నారు. ఈ మేరకు పవన్ ఓ సందేశం విడుదల చేశారు. ఈ దాడులపై వైఎస్సార్ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు స్పందించారు.
ఈ దాడికి పాల్పడినవారు పట్టాభి కుటుంబ సభ్యులను కూడా తీవ్రంగా దూషించినట్టు తెలిసిందని పేర్కొన్నారు. ఈ దాడులకు కారకులు ఏ పార్టీకి చెందినవారైనా సరే డీజీపీ తక్షణమే చర్యలు తీసుకుని వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. నేతల మీద, పార్టీ కార్యాలయాల మీద ఇలాంటి దాడులు ప్రజాస్వామ్యానికి భంగకరం అని తెలిపారు. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య రాష్ట్రంలో నేడు జరిగిన సంఘటనలు విషాదకరం అని అభివర్ణించారు. ఇటువంటి దమనకాండకు పాల్పడిన వ్యక్తులపై జగన్ ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించి ప్రజాస్వామ్య విలువలు కాపాడాలని ఏపీ బీజేపీ తరఫున డిమాండ్ చేశారు.
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని గత రాత్రి ఏపీ కాంగ్రెస్ కమిటీ ప్రతినిధి బృందం సందర్శించింది. అగంతకుల దాడిలో ధ్వంసమైన కార్యాలయాన్ని పరిశీలించింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ సాకే శైలజానాథ్ ఆదేశాల మేరకు పీసీసీ కార్యదర్శి నూతలపాటి రవికాంత్, ప్రధాన కార్యదర్శి చిలకా విజయ్కుమార్, మైనార్టీ సెల్ జిల్లా చైర్మన్ షేక్ సలీం తదితరులు టీడీపీ కార్యాలయాన్ని సందర్శించారు. అనంతరం చంద్రబాబును కలిసి మాట్లాడారు. దాడిపై విచారం వ్యక్తం చేశారు. కాగా, దాడికి నిరసనగా టీడీపీ నేడు రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more