కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కుమార్తె ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తల్లిదండ్రులు జూలోని జంతువులేమీ కాదని, తన తండ్రి ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై ఆమె తప్పుపట్టారు. డెంగ్యూ వ్యాధికి గురైన మన్మోహన్ సింగ్ ఎయిమ్స్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఆయన కరోనా వైరస్కు గురయ్యారు. ఇప్పటికే మన్మోహన్సింగ్కు 1990, 2009 లో రెండు సార్లు బైపాస్ సర్జరీలు జరిగాయి.
ఆరోగ్య సమస్యలతో గత రెండు రోజులుగా మన్మోహన్ సింగ్ ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతున్నారు. ఆయనను పరామర్శించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా శుక్రవారం దవాఖానకు వచ్చారు. అక్కడి వైద్యులతో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న మన్మోహన్ సింగ్ సతీమణి గురుశరన్ కౌర్ను కలిసి మాట్లాడారు. దీనికి సంబంధించిన ఫొటోలను మాండవీయ సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీటిని కొన్ని న్యూస్ ఛానళ్లు కూడా చూపించాయి. ఈ ఫొటోల్లో మన్మోహన్ సింగ్ మంచం మీద పడుకుని ఉండగా.. ఆయన భార్య పక్కన నిలబడి ఉన్నారు.
‘మన్మోహన్సింగ్ ఎయిమ్స్లో డెంగ్యూ వ్యాధికి చికిత్స పొందుతున్నారు. అతని పరిస్థితి నిలకడగా ఉన్నది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నది. కేంద్ర ఆరోగ్య మంత్రి వచ్చి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం చాలా సంతోషంగా ఉంది. అయితే, పరామర్శిస్తున్న సమయంలో ఫొటోలను తీసుకోవడంపై అమ్మ అభ్యంతరం వ్యక్తం చేసింది. అయినప్పటికీ వినిపించుకోకుండా ఫొటోలు తీసుకున్నారు. దీనిపై అమ్మ చాలా బాధపడింది. వాళ్లేమీ జూలో జంతువులు కాదు కదా? కొంచెమైనా నైతికత, వైద్య నిబంధనలు పాటించాలి కదా?’ అని మన్మోహన్ సింగ్ కుమార్తె డామన్ సింగ్ విచారం వ్యక్తం చేశారు.
ఇలాఉండగా, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో.. కేంద్ర మంత్రి మాండవియా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోలను తొలగించారు. ఫొటోగ్రాఫర్ని ఎయిమ్స్ వైద్యులు, మేనేజ్మెంట్ ఎలా లోపలికి అనుమతించారో చెప్పాలని పలువురు నెటిజెన్లు డిమాండ్ చేశారు. ఇలా చికిత్స పొందుతున్న వ్యక్తుల ఫొటోలు తీయడం మెడికల్ ఎథిక్స్ను ధిక్కరించడమే అవుతుందని ఫోరం ఫర్ మెడికల్ ఎథిక్స్ సొసైటీ సభ్యులు చెప్తున్నారు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఎయిమ్స్ డైరెక్టర్ రణ్దీప్ గులేరియా మంత్రి వెంటే ఉన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more