టీఆర్ఎస్ పార్టీపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. హుజూరాబాద్ లో మీటింగులకు ఇతర నియోజకవర్గాల నుంచి ప్రజలను రప్పించి అందరినీ అయోమయానికి గురి చేస్తున్నారని విమర్శించారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో తాము నియోజకవర్గ ప్రజలను నమ్ముకుంటే.. అధికార పీఠంపైనున్న కేసీఆర్ డబ్బు మూఠలను, పరాయి మూకలను నమ్ముకుంటున్నారని ఈటెల తీవ్రస్థాయిలో పైర్ అయ్యారు. కుట్రలు, కుతంత్రాలకు తెరలేపారని... తన టక్కుటమార విద్యలన్నింటిని హుజూరాబాద్ లో ప్రదర్శిస్తున్నారని అన్నారు. కేసీఆర్ గిమ్మిక్కులు చెల్లవని చెప్పేరోజు ఈనెల 30వ తేదీ అని చెప్పారు.
తనపై ముప్పేట దాడి చేసేందుకు యత్నిస్తున్న కేసీఆర్.. ఈ ఎన్నికలలో గెలిస్తే మరో 20 ఏళ్లు తెలంగాణను తన బానిస శృంఖాల కింద ఉంచవచ్చననే యోచనలో వున్నారని అరోపించారు. తనను ఎదుర్కొనే దమ్ము లేకే... తనపై భూ ఆక్రమణ ఆరోపణలు చేశారని మండిపడ్డారు. ఒక్క ఎకరం ఆక్రమించుకున్నా ముక్కు నేలకు రాస్తానని తన భార్య సవాల్ చేస్తే ఇంతవరకు కేసీఆర్ నుంచి స్పందనే లేదని అన్నారు. హుజూరాబాద్ లో తాను పోటీ చేస్తుంటే.. తనను ఓడించేందుక కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్న విషయాన్ని కూడా ప్రజలు గమనించారని అన్నారు. ఈ ఉప ఎన్నికల వల్లే తమ నియోజకవర్గంలోని దళితులకు దళిత బంధు పథకం అమలులోకి వచ్చిందన్నారు.
తన కారణంగానే ఒక్కో దళిత కుటుంబానికి రూ.10లక్షల ఆర్థిక సాయం లభిస్తోందని ఈటెల అన్నారు. హుజురాబాదులో జరుగుతున్నది ఉప ఎన్నిక.. అయితే ఇక్కడ తనను ఓడించేందుకు టీఆర్ఎస్ రెండు నాల్కల ధోరణిని అవలంభిస్తున్నదని ఈటెల దుయ్యబట్టారు. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేలేక తాను పార్టీ నుంచి బయటకు వస్తే.. సానుభూతి కోసం యత్నిస్తున్నానని హరీశ్ రావు అబద్ధాలే చెపుతున్నారని విమర్శించారు. ఒకప్పుడు హరీశ్ పై ఎంతో గౌరవం ఉండేదని.. మామకు పూర్తిగా బానిసై, ఇప్పుడు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తాటాకు చప్పుళ్లకు లొంగే వ్యక్తిని తాను కాదని చెప్పారు.
తన వద్దకు ఎవరు వచ్చినా.. వారి ఇంటికి ఓ కారు వచ్చి హరీశ్ ఇంటికి తీసుకెళుతుందని ఈటల అరోపించారు. ఈ సందర్భంగా అవేశానికి లోనైన ఈటెల హరీశ్ రావుపై ఏకవచన సంబోధనతో రెచ్చిపోయారు. టీఆర్ఎస్ నేతలు అరోపిస్తున్నట్లు.. తనతో హుజూరాబాద్ లో పోటీ పడుతున్న అభ్యర్థితో పోల్చి రెండు గుంటల రైతుతో రెండువందల ఎకరాల ఆసామి పోటీపడుతున్నారని అంటున్నారని.. మరీ అదే రైతు రెండు వందల కోట్ల రూపాయలను ఎన్నికలలో ఎలా ఖర్చు పెడుతున్నారని ఈటెల ప్రశ్నించారు. తనను గెలిపించి హూజూరాబాద్ లో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలను ఈటల కోరారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more