టీఆర్ఎస్ పార్టీపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. హుజూరాబాద్ లో మీటింగులకు ఇతర నియోజకవర్గాల నుంచి ప్రజలను రప్పించి అందరినీ అయోమయానికి గురి చేస్తున్నారని విమర్శించారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో తాము నియోజకవర్గ ప్రజలను నమ్ముకుంటే.. అధికార పీఠంపైనున్న కేసీఆర్ డబ్బు మూఠలను, పరాయి మూకలను నమ్ముకుంటున్నారని ఈటెల తీవ్రస్థాయిలో పైర్ అయ్యారు. కుట్రలు, కుతంత్రాలకు తెరలేపారని... తన టక్కుటమార విద్యలన్నింటిని హుజూరాబాద్ లో ప్రదర్శిస్తున్నారని అన్నారు. కేసీఆర్ గిమ్మిక్కులు చెల్లవని చెప్పేరోజు ఈనెల 30వ తేదీ అని చెప్పారు.
తనపై ముప్పేట దాడి చేసేందుకు యత్నిస్తున్న కేసీఆర్.. ఈ ఎన్నికలలో గెలిస్తే మరో 20 ఏళ్లు తెలంగాణను తన బానిస శృంఖాల కింద ఉంచవచ్చననే యోచనలో వున్నారని అరోపించారు. తనను ఎదుర్కొనే దమ్ము లేకే... తనపై భూ ఆక్రమణ ఆరోపణలు చేశారని మండిపడ్డారు. ఒక్క ఎకరం ఆక్రమించుకున్నా ముక్కు నేలకు రాస్తానని తన భార్య సవాల్ చేస్తే ఇంతవరకు కేసీఆర్ నుంచి స్పందనే లేదని అన్నారు. హుజూరాబాద్ లో తాను పోటీ చేస్తుంటే.. తనను ఓడించేందుక కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్న విషయాన్ని కూడా ప్రజలు గమనించారని అన్నారు. ఈ ఉప ఎన్నికల వల్లే తమ నియోజకవర్గంలోని దళితులకు దళిత బంధు పథకం అమలులోకి వచ్చిందన్నారు.
తన కారణంగానే ఒక్కో దళిత కుటుంబానికి రూ.10లక్షల ఆర్థిక సాయం లభిస్తోందని ఈటెల అన్నారు. హుజురాబాదులో జరుగుతున్నది ఉప ఎన్నిక.. అయితే ఇక్కడ తనను ఓడించేందుకు టీఆర్ఎస్ రెండు నాల్కల ధోరణిని అవలంభిస్తున్నదని ఈటెల దుయ్యబట్టారు. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేలేక తాను పార్టీ నుంచి బయటకు వస్తే.. సానుభూతి కోసం యత్నిస్తున్నానని హరీశ్ రావు అబద్ధాలే చెపుతున్నారని విమర్శించారు. ఒకప్పుడు హరీశ్ పై ఎంతో గౌరవం ఉండేదని.. మామకు పూర్తిగా బానిసై, ఇప్పుడు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తాటాకు చప్పుళ్లకు లొంగే వ్యక్తిని తాను కాదని చెప్పారు.
తన వద్దకు ఎవరు వచ్చినా.. వారి ఇంటికి ఓ కారు వచ్చి హరీశ్ ఇంటికి తీసుకెళుతుందని ఈటల అరోపించారు. ఈ సందర్భంగా అవేశానికి లోనైన ఈటెల హరీశ్ రావుపై ఏకవచన సంబోధనతో రెచ్చిపోయారు. టీఆర్ఎస్ నేతలు అరోపిస్తున్నట్లు.. తనతో హుజూరాబాద్ లో పోటీ పడుతున్న అభ్యర్థితో పోల్చి రెండు గుంటల రైతుతో రెండువందల ఎకరాల ఆసామి పోటీపడుతున్నారని అంటున్నారని.. మరీ అదే రైతు రెండు వందల కోట్ల రూపాయలను ఎన్నికలలో ఎలా ఖర్చు పెడుతున్నారని ఈటెల ప్రశ్నించారు. తనను గెలిపించి హూజూరాబాద్ లో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలను ఈటల కోరారు.
(And get your daily news straight to your inbox)
Jun 24 | తిరుగుబాటు బావుటా ఎగురవేసిన ఎమ్మెల్యేలపై గత కొన్ని రోజులుగా ఎలాంటి వ్యాఖ్యలు చేయని శివసేన చీఫ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఇవాళ వారికి అల్టిమేటం జారీ చేశారు. సీఎం అధికార నివాసమైన వర్షానే... Read more
Jun 24 | కేరళలోని వాయనాడ్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కార్యాలయంపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. అక్కడి సిబ్బందిని కొట్టడంతోపాటు ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు కల్పేటలోని వాయనాడ్ ఎంపీ రాహుల్... Read more
Jun 24 | బావ, బావ పన్నీరు.. బావను పట్టుకు తన్నేరు.. అన్నది పాతకాలం నాటి నానుడి. ఆ తరువాత బావలకు సముచిత గౌరవం కలిగేంచే రోజులు వచ్చాయి. అయితే భూమి గుండ్రంగా తిరుగుతుంది అన్నట్లు.. మళ్లీ బావలను... Read more
Jun 24 | మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి బీజేపీనే కారణమని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్న వేళ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ను బీజేపీ బెదిరిస్తోందని పరోక్ష ఆరోపణలు గుప్పించారు. అంతేకాదు... Read more
Jun 24 | అమెరికా ఇటీవల తుపాకుల కాల్పులతో మోతెక్కిపోయింది. కేవలం రోజుల వ్యవధిలోనే అగ్రరాజ్యంలో ఏకంగా 35 మంది ప్రాణాలను ఎందుకు తాము టార్గెట్ గా మారామో కూడా తెలియకుండానే బలైపోయాయి. అందుకు కారణం తుపాకీ తూటాలు.... Read more