సామాజిక మాద్యమాలైన వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ సేవలు దాదాపుగా ఆరు గంటల వ్యవధి తరువాత తిరిగి అందుబాటులోకి వచ్చాయి. గతరాత్రి నుంచి ఆకస్మికంగా సేవలు నిలిచిపోవడంతో ప్రపంచమే నిలిచిపోయిందన్న భావన నెట్ జనులలో కలిగింది. తమ సెల్ ఫోన్ లలో సాంకేతిక లోపం ఎదురైందా.. లేక సామాజిక మాద్యమాల సర్వీసులలోనే లోపం ఏర్పడిందా.? అన్న ప్రశ్నలు తలెత్తడంతో మళ్లీ పాత పద్దతిలో వాయిస్ కాల్ చేసుకుని మిత్రుల నుంచి సమాచారం పోందారు నెటిజనులు. తాము ఇదే సమస్యను ఎదుర్కోంటున్నామన్న సమాధానం సంతృప్తి చెందారు.
ప్రపంచవ్యాప్తంగా క్రితంరోజు రాత్రి 9 గంటల సమయంలో సామాజిక మాధ్యమాల సేవలన్నీ ఒక్కసారిగా నిలిచిపోవడంతో కోట్లాదిమంది వినియోగదారులు ఇబ్బందిపడ్డారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన ఫేస్బుక్.. సేవల పునరుద్ధరణకు నడుం బిగించింది. మొత్తానికి ఈ తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో దాదాపు ఏడు గంటలపాటు సేవలు స్తంభించిన తరువాత వాటిని పునరుద్దరించారు. ఫేస్ బుక్ సోంతం చేసుకున్న మూడు అతిపెద్ద సామాజిక మాద్యమాల సేవలు అకస్మాత్తుగా నిలిచిపోవడంపై ఫేస్బుక్ క్షమాపణలు తెలిపింది.
దేశంలో ఈ మూడు మాద్యమాలను ఏకంగా నలభై కోట్ల మంది ఫేస్ బుక్ యాజమాన్య పరిధిలో నడిచే వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్, పేస్ బుక్ ఈ మూడు మాద్యమాలలో ఏదో ఒకటిని వినియోగిస్తున్నారు. ఇక వీటి సేవలు పునరుద్దరణ జరగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా తమ సేవలు తిరిగి ఆన్లైన్లోకి వస్తున్నందుకు ఆనందంగా ఉందని ఫేస్ బుక్ పేర్కొంది. తమకు సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు పేర్కొంది. కాగా, గత రాత్రి సామాజిక మాధ్యమాలన్నీ ఒక్కసారిగా మూగబోవడంతో ఏం జరుగుతోందో అర్థంకాక వినియోగదారులు అయోమయానికి గురయ్యారు. ఏం జరిగిందో తెలుసుకునేందుకు ట్విట్టర్ ద్వారా ప్రయత్నించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more