Petrol, diesel prices hiked sharply after day’s gap మళ్లీ పెరిగిన ఇంధన ధరలు.. రికార్డు మార్కుకు చేరువలో పెట్రోల్ ధర..

Petrol and diesel prices hiked today on 30 september 2021 breaches rs 110 in bhopal

Petrol Diesel prices, petrol diesel price hike, petrol prices in delhi, diesel prices in delhi, effect of covid 19 on petrol prices, effect of covid 19 on diesel prices, petrol price, petrol rate, petrol rate today India, diesel rate, diesel price, diesel rate today, diesel rate today in India, today petrol rate, today diesel rate, Petrol rate in Hyderabad, diesel rate in Telangana, diesel rate in Andhra Pradesh, diesel rate in Hyderabad, diesel rate in Guntur, diesel rate in Chennai, diesel rate in Vijayawada, diesel rate in Amaravati, diesel rate in Visakhapatnam, diesel rate in Delhi, diesel rate in Chennai, diesel rate in India, Petrol rate in Telangana, petrol rate in Andhra Pradesh, petrol rate in Delhi, petrol rate in Mumbai, Petrol rate in Hyderabad, Petrol rate in Visakhapatnam, fuel rates today in India, fuel rates, fuel price in India

After remaining unchanged for a day, petrol prices were hiked on Thursday, September 30, 2021, touching a record high across the country, In Delhi, petrol costs Rs 101.64 a litre, a hike by 25 paise while the rate of diesel was Rs 89.87 per litre, a hike by 30 paise.

మళ్లీ పెరిగిన ఇంధన ధరలు.. రికార్డు మార్కుకు చేరువలో పెట్రోల్ ధర..

Posted: 09/30/2021 12:17 PM IST
Petrol and diesel prices hiked today on 30 september 2021 breaches rs 110 in bhopal

డెబై ఏళ్ల స్వతంత్ర భారతావనిలో ఎన్నడూ ఎరుగని రీతిలో ఇంధన ధరలు పైపైకి ఎగబాగుతూ.. చరిత్రలో కొత్త శిఖరాలను అందుకుంటున్నాయి, చమురు ధరల పెంపుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నామని చె్ప్పిన కేంద్రం.. ధరలు పతాకస్థాయికి చేరుకున్నాయన్న నేపథ్యంలో విపక్షాల పోరాటల ఫలితంగా ప్రజలకు రెండు నెలల పాటు ఊరట కల్పించింది. ఇక క్రమంలో మళ్లీ ధరల పెంపుకు రెండు రోజుల క్రిందట తెరలేపింది. నిన్న స్థిరంగా వున్న ధరలను మళ్లీ ఇవాళ మరోమారు పెంచి వాహనదారుల జేబులకు చిల్లులు పెట్టింది. దీంతో తమిళనాడులోని చైన్నై మినహా దేశంలో ఎక్కడా లీటరు పెటోల్ ధర రూ. 100కు లోబడి లేదంటే అతిశయోక్తి కాదు.

తాజా పెరుగుదల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలోనూ పెట్రోల్ ధర 101.64 రూపాయలకు చేరువలో వుంది. దీంతో పాటు చైన్నై మినహా దాదాపుగా దేశంలోని అన్ని మెట్రోపాలిటిన్ నగరాలతో పాటు 13 రాష్ట్రాల్లో పెట్రోల్ ధర రూ.105ను మించి పరుగులు పెడుతొంది. ప్రస్తుతం దేశంలోని ఇంధన ధరలు ఈ ఏడాది జూలై 17 నాడు అందుకున్న సరికొత్త చారిత్రక గరిష్టస్థాయి రికార్డును అందుకునేందుకు పోటీ పడుతున్నాయి. మరోమారు పెంపుతో పెట్రోల్ ధర మాత్రం సరికొత్త గరిష్టస్థాయిని అందుకోనుంది. ఇక తాజాగా డీజిల్ దర కూడా వంద మార్కును అందుకునే దిశగా కదులుతోంది.

ఇప్పటికే రికార్డు స్థాయికి ధరలు చేరగా.. మరోసారి పెట్రోల్‌ లీటర్‌కు 25 పైసలు మేర పెంచిన ఇంధన సంస్థలు, డీజిల్‌ ధరను లీటరుకు రూ. 30 పైసల మేర పెంచుతూ అయిల్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి, మే 4 నుంచి ఇప్పటివరకు చమురు ధరను 41 పర్యాయాలు పెంచిన కేంద్రం.. ఏకంగా అప్పట్నించి తాజా పెంపు వరకు పెట్రోల్ పై రూ.11.44, డీజిల్‌పై 9.14 వరకు చమరు కంపెనీలు పెంచాయి. ఫలితంగా పెట్రోల్-డీజిల్ ధరలు దేశంలో రికార్డు స్థాయికి చేరుకుంది. రాజస్థాన్ సహా మధ్యప్రదేశ్ రాష్ట్రాలోని పలు ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర 110కి చేరుకోగా..  తెలుగు రాష్ట్రాల్లో లీటరు పెట్రోల్ ధర ఏకంగా రూ.105 దాటింది.

తాజాగా దేశవ్యాప్తంగా మెట్రో నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు ఎలా వున్నాయంటే...

ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర 101.64గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ.89.87కు చేరింది.
ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.107.71గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ.97.52కు చేరింది.
చెన్నైలో లీటరు పెట్రోల్ ధర రూ.99.36గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 94.45కు చేరింది.
కొల్ కతాలో లీటరు పెట్రోల్ ధర రూ.102.17గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ.92.97కు చేరింది.
విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ..106.43 కాగా, లీటరు డీజిల్ ధర రూ.98.20కు చేరింది.
హైదారాబాద్ లో లీటరు పెట్రోల్ ధర రూ.105.74గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 98.06కు చేరింది.
బెంగళూరులో లీటరు పెట్రోల్ ధర రూ.105.18గా నమోదు కాగా, లీటరు డీజిల్‌ రూ.95.38కు చేరింది.
భోపాల్ లో లీటరు పెట్రోల్ ధర రూ. 110.11గా నమోదు కాగా, లీటరు డీజల్ ధర రూ. 98.77కు చేరింది
పాట్నాలో లీటరు పెట్రోల్ ధర రూ.104.45గా నమోదు కాగా, లీటరు  డీజిల్‌ రూ. 96.15కు చేరింది.
చండీగఢ్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.97.85గా నమోదు కాగా, లీటరు  డీజిల్‌ రూ.89.61కు చేరింది.
లక్నోలో లీటరు పెట్రోల్ ధర రూ. 98.75గా నమోదు కాగా, లీటరు  డీజిల్‌ రూ.90.29కు చేరింది.
తిరువనంతపురంలో లీటరు పెట్రోల్ ధర రూ.103.88గా నమోదు కాగా, లీటరు డీజిల్‌ రూ.96.71కు చేరింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Petrol  Diesel  fuel price  petrol price  diesel price  hyderabad  visakhapatnam  coronavirus  covid-19  

Other Articles