డెబై ఏళ్ల స్వతంత్ర భారతావనిలో ఎన్నడూ ఎరుగని రీతిలో ఇంధన ధరలు పైపైకి ఎగబాగుతూ.. చరిత్రలో కొత్త శిఖరాలను అందుకుంటున్నాయి, చమురు ధరల పెంపుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నామని చె్ప్పిన కేంద్రం.. ధరలు పతాకస్థాయికి చేరుకున్నాయన్న నేపథ్యంలో విపక్షాల పోరాటల ఫలితంగా ప్రజలకు రెండు నెలల పాటు ఊరట కల్పించింది. ఇక క్రమంలో మళ్లీ ధరల పెంపుకు రెండు రోజుల క్రిందట తెరలేపింది. నిన్న స్థిరంగా వున్న ధరలను మళ్లీ ఇవాళ మరోమారు పెంచి వాహనదారుల జేబులకు చిల్లులు పెట్టింది. దీంతో తమిళనాడులోని చైన్నై మినహా దేశంలో ఎక్కడా లీటరు పెటోల్ ధర రూ. 100కు లోబడి లేదంటే అతిశయోక్తి కాదు.
తాజా పెరుగుదల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలోనూ పెట్రోల్ ధర 101.64 రూపాయలకు చేరువలో వుంది. దీంతో పాటు చైన్నై మినహా దాదాపుగా దేశంలోని అన్ని మెట్రోపాలిటిన్ నగరాలతో పాటు 13 రాష్ట్రాల్లో పెట్రోల్ ధర రూ.105ను మించి పరుగులు పెడుతొంది. ప్రస్తుతం దేశంలోని ఇంధన ధరలు ఈ ఏడాది జూలై 17 నాడు అందుకున్న సరికొత్త చారిత్రక గరిష్టస్థాయి రికార్డును అందుకునేందుకు పోటీ పడుతున్నాయి. మరోమారు పెంపుతో పెట్రోల్ ధర మాత్రం సరికొత్త గరిష్టస్థాయిని అందుకోనుంది. ఇక తాజాగా డీజిల్ దర కూడా వంద మార్కును అందుకునే దిశగా కదులుతోంది.
ఇప్పటికే రికార్డు స్థాయికి ధరలు చేరగా.. మరోసారి పెట్రోల్ లీటర్కు 25 పైసలు మేర పెంచిన ఇంధన సంస్థలు, డీజిల్ ధరను లీటరుకు రూ. 30 పైసల మేర పెంచుతూ అయిల్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి, మే 4 నుంచి ఇప్పటివరకు చమురు ధరను 41 పర్యాయాలు పెంచిన కేంద్రం.. ఏకంగా అప్పట్నించి తాజా పెంపు వరకు పెట్రోల్ పై రూ.11.44, డీజిల్పై 9.14 వరకు చమరు కంపెనీలు పెంచాయి. ఫలితంగా పెట్రోల్-డీజిల్ ధరలు దేశంలో రికార్డు స్థాయికి చేరుకుంది. రాజస్థాన్ సహా మధ్యప్రదేశ్ రాష్ట్రాలోని పలు ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర 110కి చేరుకోగా.. తెలుగు రాష్ట్రాల్లో లీటరు పెట్రోల్ ధర ఏకంగా రూ.105 దాటింది.
తాజాగా దేశవ్యాప్తంగా మెట్రో నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు ఎలా వున్నాయంటే...
ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర 101.64గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ.89.87కు చేరింది.
ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.107.71గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ.97.52కు చేరింది.
చెన్నైలో లీటరు పెట్రోల్ ధర రూ.99.36గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 94.45కు చేరింది.
కొల్ కతాలో లీటరు పెట్రోల్ ధర రూ.102.17గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ.92.97కు చేరింది.
విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ..106.43 కాగా, లీటరు డీజిల్ ధర రూ.98.20కు చేరింది.
హైదారాబాద్ లో లీటరు పెట్రోల్ ధర రూ.105.74గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 98.06కు చేరింది.
బెంగళూరులో లీటరు పెట్రోల్ ధర రూ.105.18గా నమోదు కాగా, లీటరు డీజిల్ రూ.95.38కు చేరింది.
భోపాల్ లో లీటరు పెట్రోల్ ధర రూ. 110.11గా నమోదు కాగా, లీటరు డీజల్ ధర రూ. 98.77కు చేరింది
పాట్నాలో లీటరు పెట్రోల్ ధర రూ.104.45గా నమోదు కాగా, లీటరు డీజిల్ రూ. 96.15కు చేరింది.
చండీగఢ్లో లీటరు పెట్రోల్ ధర రూ.97.85గా నమోదు కాగా, లీటరు డీజిల్ రూ.89.61కు చేరింది.
లక్నోలో లీటరు పెట్రోల్ ధర రూ. 98.75గా నమోదు కాగా, లీటరు డీజిల్ రూ.90.29కు చేరింది.
తిరువనంతపురంలో లీటరు పెట్రోల్ ధర రూ.103.88గా నమోదు కాగా, లీటరు డీజిల్ రూ.96.71కు చేరింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more