కలియుగ దానవుడిగా దేశప్రజల మనస్సులలో సుస్థిర స్థానం ఏర్పర్చుకున్న రియల్ హీరో సోనూసూద్ పేదలకు మరో సేవను కూడా అందుబాటులోకి తీసుకువచ్చాడు. కరోనా మహమ్మరి నేపథ్యంలో వలస కార్మికులను వారి స్వస్థలాలకు చేర్చే నేపథ్యంలో.. వారి ఆకలిదప్పికలను తీర్చే క్రమంలో ప్రారంభమైన ఆనయ సేవా కార్యక్రమాలు ఇంతింతై వటుడింతై అన్నట్లు దినదిన ప్రవర్తమానంగా ఎదుగుతూనే వున్నాయి. సాయం కోసం చేతులు చాచిన అన్నార్తులకు సాయం చేసేందుకు ముందుకువచ్చిన మహావ్యక్తి సోనూసూద్.
తన దృష్టికి ఆర్తుల వినతి చేరడమే అలస్యమన్నట్లు సాయానికి ఆపన్నహస్తం అందిస్తున్నాడు సోనూసూద్. నేరుగా అడిగినా, ఫోన్లో అడిగినా, సామాజిక మాద్యామాల ద్వారా అడిగినా.. తమ వారితో అడిగించినా సాయం అందించేవ్యక్తి సోనూసూద్. అంబులెన్సులు మొదలుకుని ఐఏఎస్, సీఏ, లా కోచింగ్లను అందిస్తున్న ఆయన ఛారిటీ ఫౌండేషన్.. సేవా కార్యక్రమాల్లో మరో ముందడుగు వేసింది. ఈ సారి దేశంలోని పేదప్రజలందరికీ ఉచితంగా ఈఎన్టీ అంటే చెవి, ముక్కు, నాలుగలకు సంబంధించిన శస్త్రచికిత్సలను ఉచితంగా చేయించనున్నారు, తన చారిటీ పౌండేషన్ ద్వారా ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు.
ఈ సందర్భంగా సోనూసూద్ తన ఇన్ స్టాగ్రామ్ లో ఇందుకు సంబంధించిన పోస్టును పెడుతూ.. ‘ఈఎన్టీ సర్జరీలను ఉచితంగా ప్రారంభించడం ఆనందంగా ఉంది. ఇకపై.. వాసన, రుచి, శబ్దం చక్కగా ఆస్వాదిద్దాం’ అంటూ పోస్ట్ చేశాడు. ఆ సేవలు ఎలా ఉపయోగించుకోవాలో సూద్ ఛారిటీ ఫౌండేషన్ కు చెందిన వెబ్ సైట్ ను అందుబాటులో ఉంచాడు. ముందుగా www.soodcharityfoundation.org వెబ్ సైట్ ఓపెన్ చేస్తే .. ఉచితంగా అందించే ఈఎన్టీ సర్జరీలకు సంబంధించి వివరాలు ఉంటాయి. రిజిస్టర్ ఆప్షన్ లేదా బార్కోడ్ స్కాన్ చేస్తే రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇందుకు రోగుల వివరాలతో పాటు.. వారికి అవసరమైన శస్త్రచికిత్స గురించిన వివరాలను పోందుపర్చాలి.
అన్ని వివరాలను పోందుపర్చిన తరువాత సబ్ మిట్ బటన్ పై క్లిక్ చేస్తే అది తమకు చేరుతుందని తెలిపారు. ఇటీవల ఆదాయ పన్ను అధికారులు సోనూసూద్ నివాసం, కార్యాలయాలపై దాడులు చేసి.. ఆయన దాదాపు రూ.20 కోట్లు పన్ను కట్టకుండా తప్పించుకున్నారని ఐటీ అధికారులు చెప్పారు. మొత్తం 19 కోట్లు సేకరించి అందులో రెండు కోట్ల రూపాయలనే ఉపయోగించారని, మిగతా మొత్తాన్ని తన ఖాతాలోనే ఉంచుకున్నారని కూడా అధికారులు వెల్లడించారు. అయితే దీనిపై సోనూసూద్ అభిమానులు, ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా సేవ చేస్తున్న సోనుపై ఐటీ దాడులను ఖండించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more