ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్లను ఆన్ లైన్ ద్వారా విక్రయించే ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్న నేపథ్యంలో ఈ అంశంపై పవర్ స్టార్ పవన్ కల్యాన్ తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. సాయిధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ చిత్రం ప్రి-రిలీజ్ ఈవెంట్లో ఈ అంశంపై స్పందించిన ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. కరోనా లాంటి కష్టకాలం వచ్చినప్పుడు సినీకార్మికులను ఆదుకునేందుకు ముందుకు రానీ ప్రభుత్వాలు.. సినీమా టికెట్లను మాత్రం అన్ లైన్ ద్వారా విక్రయించే సోమ్ము చేసుకోవాలని ఎందుకు ప్రయత్నిస్తున్నాయని ప్రశ్నించారు. పవన్ కల్యాన్ వ్యాఖ్యలను ఏపీ మంత్రలు ఖండించారు.
అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు వేరని, ప్రభుత్వ పాలన సాగించి రెండున్నరేళ్లు కావస్తున్నా హమీలు పూర్తికాలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ మరోమారు విరుచుకుపడ్డారు. ‘సేవ్ ఏపీ ఫ్రమ్ వైసీపీ’ క్యాప్షన్తో ట్విట్టర్ వేదికగా వైసీపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి ఏడున్నరేళ్లు కావస్తున్నా ఇప్పటికీ రాష్ట్రానికి బలమైన రాజధాని లేదని దుయ్యబట్టారు. రాజధాని విషయంలోనూ ప్రజల మధ్య తీవ్ర గంధరగోళం నెలకొందని, ఈ అంశంపై కోర్టుల్ల కేసులు నెలకొన్నాయని పవన్ కల్యాణ్ విమర్శించారు.
ఇష్టానుసారం ప్రజల మీద పన్నులు రుద్ది, మద్యం ఆదాయాన్ని తాకట్టుపెట్టి అప్పులు చేసి పాలిస్తే అది సుపరిపాలన అనిపించుకోదని విమర్శించారు. ప్రజలకు మద్యం తాగించి ఆ వచ్చే డబ్బుతో ఎన్ని పథకాలు చేపట్టినా అవి సంక్షేమం అసలే కాదని నిప్పులు చెరిగారు. ‘నవరత్నాలు’ భావితరాలకు నవకష్టాలుగా మారాయని అన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలు, తీసుకుంటున్న చర్యలకు సంబంధించిన వివరాలను షేర్ చేస్తూ కటిక నిజాలు ఇవేనని క్యాప్షన్ జత చేశారు. ఏపీ పరిస్థితి ఇలా ఉందంటూ మరో స్నాప్షాట్ను కూడా షేర్ చేశారు.
#SaveAPfromYSRCP
— Pawan Kalyan (@PawanKalyan) September 27, 2021
వైసిపి ప్రభుత్వం చేసిన వాగ్దానాలు - వాటిని అమలు చెయ్యడంలో కనిపిస్తున్న కటిక నిజాలు. pic.twitter.com/hq34M15Dx0
(And get your daily news straight to your inbox)
Jun 30 | మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల నాయకుడు ఏక్నాథ్ షిండే గురువారం రాత్రి 7.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయగా, డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇవాళ రాత్రి... Read more
Jun 30 | రైలు టికెట్ కొనాలంటే ముందుగా కౌంటర్ వద్దకు వెళ్లేందుకు ప్రయాణీకులు ఎంతో సమయం క్యూల్లో నిలబడిఉండాలి. టికెట్లు ఇచ్చే వ్యక్తిపైనా తరచూ ఫిర్యాదులు వస్తుంటాయి. ఈ ప్రక్రియ సంక్లిష్టంగా మారడంతో పరిస్థితి మెరుగుపరిచేందుకు పలు... Read more
Jun 30 | గత కొన్నిరోజులుగా కొనసాగుతున్న మహారాష్ట్ర సంక్షోభానికి ఎట్టకేలకు తెరపడింది. కాంగ్రెస్, ఎన్సీపీలతో కలసి ప్రభుత్వ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న శివసేన రెబల్ వర్గ ఎమ్మెల్యేలు బీజేపితో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రంగం సిద్దమైంది. అయితే... Read more
Jun 30 | బంగారం అంటే మహిళలకు చాలా ఇష్టం. దీని కోసమే ఎన్నో ఇళ్లలో మగవారు చీవాట్లు తింటారు. ఇంకొన్ని ఇళ్లలో ప్రశంసలను అందుకునే వాళ్లూ ఉన్నారు. మరి ఈ కుందనం నలుపు శరీర ఛాయ ఉన్నవారిపై... Read more
Jun 30 | గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న మహారాష్ట్ర సంక్షోభం శివసేన అధినేత, మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే రాజీనామాతో క్లైమాక్స్ కు చేరింది. మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ ఎనమిది మంది మంత్రులపై విధించిన... Read more