రాష్ట్రంలోని విద్యాసంస్థలతో పాటు ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు అన్ని పాఠశాలలను ప్రత్యక్ష విద్యాబోదనను నిర్వహించాలంటూ తెలంగాణ ప్రభుత్వం జారి చేసిన ఉత్తర్వులమేరకు ఇవాళ్టి నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో విద్యాసంస్థలు, పాఠశాలలు ప్రారంభమయ్యాయి. 18 నెలల తర్వాత స్కూళ్లకు వచ్చిన విద్యార్థులకు ఉపాధ్యాయులు స్వాగతం పలికారు. పలు పాఠశాలలు, జూనియర్ కాలేజీలకు గేట్లకు మామిడి ఆకులు, వేప అకులతో తోరణాలు కూడా కట్టారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా జాగ్రత్తలు పాటిస్తూ విద్యార్థులను తరగతి గదులకు అనుమతించారు. మాస్కులు ధరించి తరగతులకు హాజరయ్యారు. పాఠశాలల్లో అధికారులు, యాజమాన్యాలు శానిటైజర్లు ఏర్పాటు చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రత్యక్ష తరగతులు ప్రారంభమయ్యాయి. దీంతో విద్యార్థులు పెద్దసంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. కోనరావుపేట మండల వ్యాప్తంగా స్కూళ్లు పునఃప్రారంభమయ్యాయి. ఉపాధ్యాయులు.. విద్యార్థుల ఉష్ణోగ్రతలు పరిశీలించి, శానిటైజర్ ఇచ్చిన తర్వాత తరగతిలోకి అనుమతించారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలంలోని సురారం కాలనీలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కొవిడ్ నిబందలను పాటిస్తూ విద్యార్థులు వచ్చారు. తరగతిగదిలో నియమాలను పాటించాలని సైన్ బోర్డులు, శానిటైజర్లను ఏర్పాటు చేశారు. హన్మకొండ జిల్లా కేంద్రంలో పాఠశాలలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. విద్యార్థుల రాకతో పాఠశాలలో సందడి వాతావరణం నెలకొంది. జగిత్యాల జిల్లాలోని మల్యాలో ఉన్న జూనియర్ కాలేజీని తోరణాలతో ముస్తాబు చేశారు.
మహబూబాబాద్ జిల్లా గుమ్ముడూరు మండలంలోని బాలికల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను అందంగా అలంకరించారు. కొబ్బరి, అరటి ఆకులతో తోరణాలు కట్టి స్వాగత ద్వారాలను ఏర్పాటు చేశారు. మహబూబాబాద్ పట్టణంలో ఉన్న ప్రైమరీ స్కూల్లో విద్యార్థులకు ఘనంగా స్వాగతం పలికారు. మున్సిపల్ కమిషనర్ విద్యార్థులకు గులాబీ పూలు అందించారు. కాగా, కరోనా మహమ్మారి రెండు ధఫాలుగా విరుచుకుపడిన అనంతంరం రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభం కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 40 శాతం విద్యార్థులు స్కూళ్లకు హాజరయ్యారని తెలిపారు. బుధవారం హైదరాబాద్ విజయనగర్ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. స్కూళ్లల్లో పారిశుధ్యం పరంగా ఎటువంటి ఇబ్బందులు లేవని చెప్పారు. కరోనా నిబంధనలను తప్పకుండా పాటించాలని అధికారులను ఆదేశించామని, ప్రార్థన సమయంలోనే జాగ్రత్తలు గుర్తు చేయాలని వెల్లడించారు. రాష్ట్రంలోని 60 లక్షల మంది విద్యార్థుల్లో సుమారు 20 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారని పేర్కొన్నారు. ఈ ఏడాది ఒకటో తరగతిలో అదనంగా లక్ష మంది విద్యార్థులు చేరారని వెల్లడించారు. మొత్తంగా ప్రభుత్వ పాఠశాలలో దాదాపు 2.5 లక్షల కొత్త అడ్మిషన్లు వచ్చాయన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more