ఇంధన ధరలను ప్రపంచ మార్కెట్ కు అనుగూణంగా రోజువారీగా ధరలను మార్చుతున్న చమురు సంస్థలు.. గ్యాస్ ధరలను మాత్రం పక్షం రోజులకో పర్యాయం సమీకరిస్తున్న సంస్థలు తాజాగా మరోమారు గ్యాస్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుని వినియోగదారులకు షాక్ ఇచ్చింది. డొమెస్టిక్ గ్యాస్ ధరలను పక్షం రోజుల్లో రెండో పర్యాయం పెంచగా, గత మూడు నెలలుగా మూడు పర్యాయలు పెంచుతూ ఇంధన సంస్థలు గ్యాస్ సిలిండర్ వినియోగదారులపై గుదిబండను వేశాయి. ఈ క్రమంలో తాజాగా సబ్సీడీ గ్యాస్ సిలిండర్ పై రూ.25 మేర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అలాగే కమర్షియల్ సిలిండర్పై 75 రూపాయల వరకు పెంచింది.
గ్యాస్ ధరలను ఇవాళ మరోపర్యాయం సమీక్షించిన ఆయిల్ కంపెనీలు ధరల పెంపు తక్షణం అమల్లోకి వస్తాయని వెల్లడించాయి. తాజా ధరల ప్రకారం.. ఇక 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర హైదరాబాద్లో రూ.912 ఉండగా, ఇక ఢిల్లీలో ధర రూ.884, అలాగే కోల్కతాలో రూ.886.50, ముంబైలో రూ.859.50, చెన్నైలో రూ.-875.50 ఉంది. ధరలు పెరగడంతో గ్యాస్ సిలిండర్ వాడే వారిపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడిందని చెప్పుకోవచ్చు. గ్యాస్ సిలిండర్ ధర పెరగడం 15 రోజుల్లోనే ఇది రెండో సారి కావడం గమనార్హం. ఈ ఏడాది ఆరంభంలో గ్యాస్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.694గా ఉండేది. ఇప్పుడు రూ.884కు చేరింది.
గత ఏడేళ్ల కాలంలో గ్యాస్ సిలిండర్ ధర రెట్టింపు కావడం సామాన్య ప్రజలపై పెనుభారం మోపుతోంది కేంద్రం. 2014 మార్చి నెలలో గ్యాస్ సిలిండర్ ధర రూ.410 వద్ద ఉండేది. అదేసమయంలో ఈరోజు 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర కూడా రూ.75 పైకి కదిలింది. ఇకపోతే మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. సిలిండర్ బుకింగ్, డెలివరీ బాయ్ తీసుకునే చార్జీ కలుపుకొంటే దాదాపుగా రూ.1000 వరకు చెల్లించుకోవాల్సి ఉంటుంది. అంటే దాదాపు రూ.1000 పెడితే కానీ గ్యాస్ సిలిండర్ లభించని పరిస్థితి నెలకొంది. ఒక వైపు పెట్రోల్, డీజిల్ ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు, ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడంతో సామాన్యులకు భారీగా మారిపోతోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more