చాక్లెట్లు కొనుక్కునేందుకు దుకాణానికి వచ్చిన నాలుగేళ్ల చిన్నారిపై అత్యంత పాశవికంగా లైంగికదాడికి పాల్పడిన నిందితుడిపై నేరాభియోగాలు రుజువుకావడంతో.. న్యాయస్థానం సంచలన తీర్పును వెలువరించింది. దోషికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది. చిన్నారిపై అత్యాచారం చేసిన నిందితుడిని దోషిగా పరిగణించిన ఖమ్మం జిల్లా ఫస్ట్ అడిషనల్ జిల్లా సెషన్స్ కోర్టు.. అతనికి 20 సంవత్సరాల కఠిన కారాగారవాసాన్ని శిక్షగా పరిగణించింది.
ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఖమ్మం జిల్లా పోలీసులు.. నిందితుడికి 20 ఏళ్ల శిక్ష పడటంతో బాధిత కుటుంబానికి న్యాయాన్ని అందించామని సంతోషాన్ని వ్యక్తపర్చారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన పింగళి గణేశ్ అలియాస్ చింటూ (20)కి కిరాణా దుకాణం ఉంది. గతేడాది నవంబరు 19న చాక్లెట్ కొనుక్కునేందుకు దుకాణం వద్దకు వచ్చిన బాలికను చూసిన చింటూ ఆమెను ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.
అనంతరం ఏడుస్తూ ఇంటికి చేరుకున్న బాలికను చూసిన తల్లిదండ్రులు విషయం ఆరా తీయగా చిన్నారి చెప్పింది విని విస్తుపోయారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. నిన్న ఈ కేసు తుది విచారణకు రాగా, ఖమ్మం మొదటి అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి పి.చంద్రశేఖరప్రసాద్ నిందితుడు గణేశ్ను దోషిగా తేల్చి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. ఈ కేసును పాల్వంచ ఎస్ఐ బాలకృష్ణ రిజిస్టర్ చేసి.. కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలన్నీ పకడ్భంధీగా న్యాయస్థానంలో సమర్పించారు. పాల్వంచ డీఎస్సీ ప్రసాద్ కూడా ఈ కేసును నిందితుడికి శిక్షపడేలా ఎస్ఐకి ఎప్పటికప్పుడు సూచనలు అందించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more