తిరుమల శ్రీవారి ఏడుకొండలు ఎక్కినా.. భక్తులకు మాత్రం స్వామివారి దర్శనం కలగడం లేదు. కరోనా కష్టకాలంలో దేవుడా నువ్వే దిక్కు అని ఆర్తితో.. కలియుగ ప్రత్యక్ష దైవాన్ని వేడుకుందామనుకుంటే.. అందుకు సర్వదర్శనానికి అనుమతి లేకుండా చేసింది బోర్డు. దీంతో ఎలాగో నానా ప్రయాసలు పడి తిరుపతి చురుకున్న భక్తులు.. తిరుమలకు చేరకుందామనుకుంటే.. అనుమతి లేదంటున్నారు భద్రతాధికారులు. దీంతో మరింత వ్యవయమైనా ఫర్వాలేదని దేవుడి దర్శనం చేసుకునే కదులుదామని భావించిన భక్తులు ఆన్ లైన్ లో టిక్కెట్టు కొనేందుకు పోటీ పడుతున్నారు.
గత నెలలో భక్తుల తాకిడి ఎంతగా ఉందంటే.. అలా టికెట్లు విడుదైలన క్షణాల్లోనే టికెట్లు అయిపోయాయి. భక్తుల నుంచి వస్తున్న విపరీతమైన స్పందన నేపథ్యంలో గత నెల 28న మళ్లీ రోజుకు 3000 టికెట్లను అదనంగా కూడా విక్రయించారు. అయినా హాట్ కేకుల్లా అయిపోయాయి. భక్తులకు కొంగుబంగారమైన తిరుమల శ్రీవారి దర్శనం పోందెందుకు కేవలం అన్ లైన్ టికెట్లు వున్న భక్తులకు మాత్రమే లబిస్తోంది. మిగతాభక్తులను తిరుమల శ్రీవారు కరికరించడం లేదు. గోవిందా.. గోవిందా అంటూ మెట్లు ఎక్కినా.. లేక ఏడు కొండలను కారులో, బస్సులో లేదా ఇతరాత్ర రవాణా సౌకర్యాలతో చేరినా.. తిరుమలేశుడు మాత్రం కానరావడం లేదు. దీంతో భక్తులు ఏ చోట చూసినా నీవుందువందురే.. ఏమిటో నీ మాయ తెలియకున్నామయ్యా అంటూ తిరుగు పయనం అవుతున్నారు.
అయితే చేసేదిలేక ఆన్ లైన్ లోనే టికెట్లు తీసుకుందామని భక్తులు వేచి చూస్తున్న తరుణంలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు షాక్ ఇచ్చింది. ప్రతీ నెల 20వ తేదీన విడుదల కావాల్సిన మరుసటి నెల అన్ లైన్ ప్రత్యేక దర్శన కోటా టికెట్ల విషయంలో భక్తులు ఖంగుతినేలా చేసింది. ఇవాళ (ఆగస్టు 20న) విడుదల కావాల్సిన సెప్టెంబర్ మాసానికి సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ప్రతి నెలా 20వ తేదీన మరుసటి నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే టికెట్ల విడుదలకు సంబంధించిన తేదీని ప్రకటిస్తామని వెల్లడించింది.
భక్తులు విషయాన్ని గమనించాలని కోరింది. అయితే కోటా రిలీజ్కు కాకపోవడానికి కారణాలు మాత్రం తెలియరాలేదు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్లైన్లో మాత్రమే టీటీడీ అందుబాటులో ఉంచుతోంది. ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్నవారిని మాత్రమే దర్శనానికి అనుమతిస్తోంది. ప్రస్తుతం తక్కువ సంఖ్యలో విడుదల చేస్తోంది. ప్రస్తుతం ఈ సంఖ్యను మరింత పెంచే అవకాశం ఉందని, ఇందులో భాగంగానే టికెట్ల కోటా పెంపును వాయిదా వేసినట్లు సమాచారం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more