నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీయే) ప్రవేశ పరీక్షలో మహిళలకు అవకాశం కల్పించకపోవడంపట్ల భారత సైన్యంపై సుప్రీంకోర్టు మండిపడింది. ఆర్మీ విధాన నిర్ణయాలు లింగ వివక్షను చూపిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. వచ్చేనెల 5న నిర్వహించే ఎన్డీయే ప్రవేశ పరీక్షను మహిళలూ రాయవచ్చని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఇచ్చే తుది ఆదేశాలకు అనుగుణంగానే ప్రవేశాలను నిర్వహించాల్సిందిగా ఆర్మీని ఆదేశించింది.
ఎన్డీయే ప్రవేశ పరీక్షకు అమ్మాయిలనూ అనుమతించాలని పేర్కొంటూ కుష్ కల్రా అనే వ్యక్తి పిటిషన్ ను దాఖలు చేశారు. అర్హులైన మహిళలను ఎన్డీయేలో చేరనివ్వకుండా రాజ్యాంగంలోని 14, 15, 16, 19 అధికరణాలను ఉల్లంఘిస్తున్నారంటూ పిటిషన్ లో పేర్కొన్నారు. ఆ పిటిషన్ ను ఇవాళ సుప్రీంకోర్టు విచారించింది. మహిళల పట్ల ఎక్కడా వివక్ష చూపించట్లేదని కేంద్రం వాదించింది. సాయుధ దళాల్లోనూ మహిళలకు సమాన అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపింది. వారి ప్రాథమిక హక్కులను ఉల్లంఘించట్లేదని స్పష్టం చేసింది.
‘‘మీ ఆలోచనా విధానమే అసలు సమస్య. ప్రభుత్వం వెంటనే దానిని మార్చుకుంటే మంచిది. మేం ఆదేశాలిచ్చే వరకు తెచ్చుకోవద్దు’’ అని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు అక్షింతలు వేసింది. సైన్యంలోనూ మహిళలకు సమాన అవకాశాలను కల్పించాల్సిందేనని, ఇప్పుడున్న పరిస్థితిని వెంటనే మార్చాలని ఆదేశించింది. అవకాశాలను కల్పించాలని జస్టిస్ చంద్రచూడ్ తీర్పునిచ్చినా అమలు చేయరా? అని జస్టిస్ ఎస్కే కౌల్ ప్రశ్నించారు. ఆర్మీలో మహిళలకు అవకాశాల కోసం పర్మనెంట్ కమిషన్ వేయాలన్న జస్టిస్ ఆదేశాలను అమలు చేయరా? అంటూ నిలదీశారు.
కాగా, ఈ పిటిషన్ తో పాటు డెహ్రాడూన్ లోని రాష్ట్రీయ ఇండియన్ మిలటరీ కాలేజ్ లో ఈ ఏడాది నుంచి అమ్మాయిలకు ప్రవేశాలను కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ నూ సుప్రీంకోర్టు విచారించింది. రక్షణ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆ కాలేజీలో ప్రస్తుతం కేవలం అబ్బాయిలకే ప్రవేశాలను నిర్వహిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more