వలపు వలలో చిక్కుకుని బడాబాబులే బలైపోతున్న తరుణంలో.. పెద్దగా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ తన సంపాదనంతా వారికి సమర్పించుకున్నాడు. అయినా వారి నుంచి వేధింపులకు ఆగకపోవడంతో దిక్కుతోచని స్థితిలో సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి పిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. గత ఏడాది నవంబర్ నుంచి జూలై వరకు ఒక్క బాధితుడి నుంచి ఏకంగా రూ. 24 లక్షలు ఈ ముఠా నొక్కేసిందంటే.. ఇంతకుముందు ఎందరి నుంచి ఎంతమేర దోచుకుందన్న కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
విశాఖపట్టణం జిల్లాలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. విశాఖపట్నం జిల్లా వేపగుంటకు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కు గతేడాది నవంబరు 6న కవ్వించే ఓ మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ చూసిచూడంగానే ఏదో కొత్త ఉత్సాహం వచ్చినట్లు అనుభవం పోందిన ఇంజనీర్.. ఆ మెసేజ్ ను చదివారు. ‘కాల్ మీ ఎనీటైమ్. ఐయామ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ టు టాక్’ అని ఉన్న ఆ మెసేజ్లో 55678557 నంబరుకు కాల్ చేయాలని ఉంది. ఆలస్యం చేయకుండా ఆ నంబరుకు కాల్ చేశాడు. అటునుంచి ఓ అడ గొంతు మత్తెక్కించేలా మాట్లాడుతూ.. మాటలు కలిపింది. అంతేకాదు ఇంజనీరును మాటల్లోకి దింపి న్యూడ్ గా వీడియో కాల్ చేయమని కోరింది. క్షణం కూడా ఆలోచించకుండా ఆమె అడిగిందే తడవుగా వీడియో కాల్ చేశాడు.
ఆ తర్వాత మరోసారి కూడా ఇలాగే న్యూడ్ వీడియో కాల్ చేసి ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఇలా వెనకాముందు అలోచించకుండా అడిగింతే తడవుగా వీడియో కాల్ మాట్లాడడంతో ఇంజనీరుకు కష్టాలు మొదలయ్యాయి. న్యూడ్ వీడియో కాల్ స్క్రీన్షాట్లు పంపిన ఆ యువతి డబ్బుల కోసం డిమాండ్ చేసింది. డబ్బులు ఇవ్వకుంటే వీడియోలు సోషల్ మీడియాలో పెడతామని హెచ్చరించింది. ఈ క్రమంలో మరో ఇద్దరు వ్యక్తులు రంగంలోకి దిగి అతడిని బెదిరించారు. ఆ వీడియోలు సోషల్ మీడియాకు ఎక్కితే తన పరువు పోతుందని భయపడిన బాధితుడు పలు దఫాలుగా వారు అడిగినంత చెల్లించుకున్నాడు. మొత్తంగా రూ. 24 లక్షలు సమర్పించుకున్నాడు. మళ్లీ బెదిరింపులు కొనసాగాయి.
తాను వలపు వల చక్రబంధంలో చిక్కకుపోయనట్లు గ్రహించిన బాధితుడు జులై 16న సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసి తన గోడు వెళ్లబోసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బ్యాంకు ఖాతాల ఆధారంగా ముగ్గురు నిందితులను గుర్తించారు. కృష్ణా జిల్లా దబ్బకుపల్లికి చెందిన షేక్ అబ్దుల్ రహీం (30), జీడిమెట్లకు చెందిన దంపతులు గుండా జ్యోతి (28), గుండీ వీర సతీష్ (34)లు హైదరాబాద్ కేంద్రంగా ఈ మోసానికి పాల్పడినట్టు గుర్తించారు. వెంటనే హైదరాబాద్ చేరుకుని వారిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ. 3.5 లక్షల నగదు, ల్యాప్టాప్, 8 మొబైల్ ఫోన్లు, 3 ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు. కోర్టు వీరికి 14 రోజుల రిమాండ్ విధించింది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more