తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కు చెందిన యూట్యూబ్ చానెల్ క్యూ న్యూస్ కార్యాలయంపై పోలీసులు దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడుల నేపథ్యంలో పోలీసులు క్యూ న్యూస్ కార్యాలయంలోని కంపూటర్ల హార్డ్ డిస్క్ లు, ఇతర కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. తనను తీన్మార్ మల్లన్న బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఆరోపిస్తూ ప్రియాంక అనే యువతి ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ దాడులకు పాల్పడ్డిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో కేసు దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు ప్రియాంకతోపాటు సహోద్యోగి చిలక ప్రవీణ్ వాంగ్మూలాలను నమోదు చేశారు. ఈ నేపథ్యంపై తీన్మార్ మల్లన్న స్పందించారు. పోలీసులు తీసుకెళ్లిన హార్డ్డిస్క్లలో కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేల అక్రమాలు ఉన్నాయని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం పాపం పరాకాష్టకు చేరిందని.. అందుకనే ప్రశ్నించే గొంతులను ఆయన ప్రభుత్వం అణచివేయాలని ప్రయత్నిస్తోందని విమర్శించారు. ప్రభుత్వం అవినీతిని ఎత్తిచూపే తమ కార్యాలయాలపై దాడులు చేస్తే లాభం లేదని అన్నారు.
ప్రభుత్వంతో కలసి అవినీతికి తెరలేపుతున్న బడా బాబుల ఇళ్లతో పాటు ప్రగతి భవన్ లోపల.. ఫామ్ హౌజ్ లోపల పోలీసులు దాడులు చేస్తే.. విస్తుపోయే విషయాలు తెలుస్తాయని మల్లన్న అరోపించారు. మీ ప్రభుత్వం పాలన అవినీతి రహితంగా ఉండివుంటే తామెందుకు ప్రశ్నిస్తామని నిలదీశారు. ‘యుద్ధం మిగిలే ఉంది.. 7200’ పేరుతో హన్మకొండలో నిర్వహించిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో మాట్లాడిన మల్లన్న.. పోలీసు కేసులకు భయపడబోనని అన్నారు. దాడుల నేపథ్యంలో త్వరలోనే తనను అరెస్టు కూడా చేస్తారని, అయినా తాను బెదరబోనని తేల్చిచెప్పారు. ఈ నెల 29న అలంపూర్లో తన తదుపరి కార్యాచరణను ప్రకటించనున్నట్టు మల్లన్న తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more